శుభ్రత పాటించు.. సేవలు అందించు
ఇన్ఫెక్షన్లకు తావులేకుండా వైద్య ఉపకరణాలను శుభ్రత పాటిస్తూ సేవలు అందించాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు.
ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు
బోదకాలు మందుల కిట్ను పంపిణీ చేస్తున్న మంత్రి హరీశ్రావు, జడ్పీ అధ్యక్షురాలు రోజాశర్మ
న్యూస్టుడే - సిద్దిపేట, నంగునూరు: ఇన్ఫెక్షన్లకు తావులేకుండా వైద్య ఉపకరణాలను శుభ్రత పాటిస్తూ సేవలు అందించాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో శస్త్రచికిత్స విధానంలో జరుగుతున్న ప్రసవాలకు అడ్డుకట్టవేయాలని, ఈ మేరకు అవగాహన కల్పించాలని జిల్లా పాలనాధికారి ప్రశాంత్ జీవన్ పాటిల్ను ఆదేశించారు. హైదరాబాద్ ఈసీఐఎల్ సంస్థ సీఎస్ఆర్ కింద దాదాపు రూ.70 లక్షల విలువైన వైద్య ఉపకరణాలను సిద్దిపేట ప్రభుత్వ వైద్య కళాశాల అనుబంధ సర్వజన, గజ్వేల్ జిల్లా ఆసుపత్రికి గురువారం సిద్దిపేటలో వితరణ చేశారు. మంత్రి మాట్లాడుతూ.. నంగునూరు మండలం ఘనపూర్లో గత నెల ఐదు ప్రసవాలు జరుగగా అందులో నాలుగు ప్రైవేటులో జరిగినట్లు దృష్టికి వచ్చిందన్నారు. మిట్టపల్లి శివారులో సురభి వైద్య కళాశాలలో ప్రసవ తేదీకి వారం రోజుల ముందుగానే శస్త్రచికిత్సతో కాన్పులు చేస్తున్నట్లు తెలిసిందన్నారు. సర్వజన ఆసుపత్రిలో గత నెల 380 ప్రసవాలు జరిగాయని సిబ్బంది తెలుపగా సంఖ్య పెంచాలని సూచించారు.
చివరి అవకాశం : వచ్చే ఏప్రిల్ 1 నుంచి 30వ తేదీ వరకు జీవో నం. 58, 59ల కింద దరఖాస్తు చేసుకునేందుకు చివరి అవకాశమని, 2020 జూన్ 2వ తేదీలోగా ధ్రువపత్రాలు కలిగి ఉంటే అర్హులని మంత్రి పేర్కొన్నారు. ఆయా జీవోల కింద 600 మందికి పట్టాల పంపిణీని సిద్దిపేటలో గురువారం చేపట్టారు. సతత్ వికాస్ పురస్కార ప్రదానోత్సవంలో జక్కాపూర్ గ్రామం ఏడింటికి ఎంపికవగా మంత్రి అభినందించారు.
బోదకాలు బాధితులకు కిట్ల పంపిణీ : బోద వ్యాధిగ్రస్థులను ప్రభుత్వం గుండెల్లో పెట్టుకొని చూస్తోందని, ఈ తరుణంలో వారికి పింఛన్లు సైతం అందిస్తున్నట్లు మంత్రి అన్నారు. గురువారం సిద్దిపేటలోని తన క్యాంపు కార్యాలయంలో వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో బోద బాధితులకు కిట్ల పంపిణీ ప్రారంభించారు. జిల్లాలోని 8121 మందికి కిట్లు అందించనున్నట్లు వివరించారు. అనంతరం మంత్రి క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో సిద్దిపేట అర్బన్ పరిధిలో 85 మందికి కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ చెక్కులు, సిద్దిపేట గ్రామీణ మండలం మాచాపూర్, సీతారాంపల్లి గ్రామాలకు చెందిన 34 మంది లబ్ధిదారులకు అసైన్మెంట్ పట్టా సర్టిఫికేట్లు, నంగునూరు మండలం కోనాయిపల్లి గ్రామానికి చెందిన 28 మందికి ఇళ్ల పట్టాలు అందజేశారు. చిన్నకోడూరు మండలంలో 66 మంది భూ నిర్వాసితులకు రూ.95 లక్షల విలువైన చెక్కులను పంపిణీ చేశారు.
రంజాన్ మాస శుభాకాంక్షలు
రంజాన్ మాసం ప్రారంభమవుతున్న సందర్భంగా మంత్రి శుభాకాంక్షలు తెలియజేశారు. రానున్న పండుగలు, మహనీయుల జయంతి కార్యక్రమాల నేపథ్యంలో అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా చర్యలు చేపట్టాలని సూచిస్తూ జడ్పీ అధ్యక్షురాలు రోజాశర్మ, ఎమ్మెల్సీ ఫారూఖ్హుస్సేన్, జిల్లా పాలనాధికారి ప్రశాంత్ జీవన్ పాటిల్, సీపీ శ్వేత, ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి మంత్రి సమీక్షించారు.
విస్తరణ పనుల పరిశీలన
ఎల్కతుర్తి జాతీయ రహదారి పనులు నంగునూరు మండలంలోని ముండ్రాయి, బద్దిపడగలో జరుగుతున్నాయి. మంత్రి ఆయా పనులను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. ఆయిల్పామ్ రైతు సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు సోమిరెడ్డి, రాష్ట్ర నర్సింగ్ కౌన్సిల్ సభ్యుడు పాల సాయిరాం, సూపరింటెండెంట్ కిషోర్కుమార్, ఈసీఐఎల్ ప్రతినిధులు, అదనపు పాలనాధికారులు శ్రీనివాస్రెడ్డి, ముజమ్మిల్ఖాన్, జిల్లా వైద్యాధికారి కాశీనాథ్ తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎన్నికలకు సమాయత్తం
[ 05-05-2024]
బరిలో నిలిచే అభ్యర్థులు తేలిపోవడంతో ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం సన్నద్ధమవుతోంది. ఇప్పటికే ఈవీఎంలు ఆయా జిల్లాలకు చేరుకోగా, అభ్యర్థులు భారీ సంఖ్యలో పోటీ చేస్తుండటంతో అదనంగా మరిన్ని ఈవీఎంలను తెప్పించారు. -
దుబ్బాకలో లోకల్ దారి
[ 05-05-2024]
నియోజకవర్గంలోని ఓటర్లందరినీ ఒకేరకమైన హామీతో ప్రసన్నం చేసుకోవాలనుకుంటే కొంత ఇబ్బందే. ఒక్కోచోట ఒక్కో సమస్య ప్రభావితం చేస్తుంది. -
హ్యాట్రిక్ విజయం ఖాయం: హరీశ్రావు
[ 05-05-2024]
అబద్ధపు పునాదుల మీద స్వార్థ రాజకీయాలకు పాల్పడుతున్న కాంగ్రెస్, భాజపాలకు తగిన గుణపాఠం చెప్పే సమయం ఆసన్నమైందని మాజీ మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. -
ఎన్డీయేతోనే సుపరిపాలన: తమిళిసై
[ 05-05-2024]
దేశం అభివృద్ధి చెందాలన్న.. సురక్షితంగా ఉండాలన్నా... సుపరిపాలన కోసం, పేదరికాన్ని నిర్మూలించాలంటే నరేంద్ర మోదీ ప్రధాని కావాలని రాష్ట్ర మాజీ గవర్నర్ తమిళిసై అన్నారు. -
దేవుళ్లతో రాజకీయం చేయడం సరికాదు
[ 05-05-2024]
దేవుళ్లతో భాజపా రాజకీయం చేయడం సరికాదని మంత్రి కొండా సురేఖ అన్నారు. శనివారం రాత్రి మెదక్లో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడారు. -
పూత రాలి.. తెగుళ్లు పెరిగి
[ 05-05-2024]
మామిడికి ఏటా తెగుళ్ల బెడద పట్టిపీడిస్తోంది. నవంబర్, డిసెంబర్లో చలి తీవ్రత, తేనె మంచు, బూడిద, నల్లతామర తెగుళ్ల సమస్య ఉంటోంది. -
సంతోషాల సవ్వడి.. ఐదు వసంతాల ఒరవడి
[ 05-05-2024]
‘నవ్వడం ఒక భోగం.. నవ్వించడం ఒక యోగం.. నవ్వలేకపోవడం ఒక రోగం’ అన్నాడో కవి. జీవితం సాఫీగా.. -
రెండో పెళ్లి వ్యామోహంతో భార్య హత్య
[ 05-05-2024]
తన కుమార్తెను హత్య చేసి కాగ్నా నదిలో పడేశారని అనుమానం వ్యక్తం చేస్తూ, హతురాలి తండ్రి ఫిర్యాదుతో పోలీసులు కేసు దర్యాప్తు చేసి శనివారం హత్యోందంతాన్ని ఛేదించారు. -
వాడిన విరులూ.. ఆదాయపు సిరులే
[ 05-05-2024]
అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే సత్ఫలితం ఖాయం. ఈ కోవకే చెందుతారు మెదక్ జిల్లా శివ్వంపేట మండలం ఎదుల్లాపూర్ గ్రామానికి చెందిన మహిళలు. -
‘కుబేరులను పోషించిన మోదీ ప్రభుత్వం’
[ 05-05-2024]
పదేళ్లుగా ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వం కుబేరులను పెంచి పోషిస్తూ పేదలపై ఆర్థిక భారాన్ని మోపిందని ప్రజా సంఘాల ఐకాస రాష్ట్ర ఛైర్మన్ ఆచార్య కూరపాటి వెంకటనారాయణ అన్నారు. -
మన భవితను నిర్ణయిస్తుంది
[ 05-05-2024]
మనం వేసే ఓటు ఐదేళ్ల భవిష్యత్తుకు సంబంధించినది. మన భవితను నిర్ణయిస్తుంది. నోటు, మద్యం వంటి ప్రలోభాలకు లొంగొద్దు. లేదంటే మనల్ని మనం అమ్ముకున్నట్లే. ఓటు విషయంలో కులం, మతం, బంధుప్రీతిని అనుసరించొద్దు. -
గ్రామీణులపైనే ఆశలు
[ 05-05-2024]
లోక్సభ ఎన్నికలకు గడువు సమీపిస్తుండడంతో ప్రధాన పార్టీలన్నీ ప్రచారంలో వేగం పెంచాయి. భారాస, కాంగ్రెస్, భాజపా అభ్యర్థులు ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల ఓటర్ల మద్దతు కూడగట్టేందుకే ప్రాధాన్యమిస్తున్నారు. -
హామీలన్నీ నెరవేరుస్తాం: మంత్రి సురేఖ
[ 05-05-2024]
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తుందని మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. శనివారం స్థానిక పీఎస్ఆర్ గార్డెన్లో మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధుకు మద్దతుగా సీపీఎం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విస్తృత స్థాయి సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. -
మతం బలహీనత కావొద్దు: మంత్రి
[ 05-05-2024]
మతం బలహీనత కారాదని, అది సమాజంలో అసమానతలు, అసహనాన్ని పెంచేలా ఉండొద్దని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. -
సాంకేతికత వినియోగం పారదర్శకతకు దోహదం
[ 05-05-2024]
ప్రజాస్వామ్యంలో ఎన్నికలే కీలకం. ఇవి పారదర్శకంగా జరగాలి. ఓటు హక్కు ఉన్న వారంతా వినియోగించుకోవాలి. -
గజ్వేల్లో 25 వేల ఓట్ల ఆధిక్యం తేవాలి: జగ్గారెడ్డి
[ 05-05-2024]
రాహుల్గాంధీని ప్రధానిని చేయటమే లక్ష్యంగా మెదక్ పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధును భారీ ఓట్ల ఆధిక్యంతో గెలిపించాలని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి అన్నారు. -
ఎట్టకేలకు కేజీబీవీ నిర్మాణం ప్రారంభం
[ 05-05-2024]
ఎట్టకేలకు అక్కన్నపేట కేజీబీవీ భవన నిర్మాణ పనులు మళ్లీ ప్రారంభమయ్యాయి. రెండున్నరేళ్ల క్రితం ప్రారంభించిన ఈ భవన నిర్మాణ పనులు ఏడాది క్రితం వివిధ కారణాలతో అర్దంతరంగా ఆగిపోయాయి.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (05/05/24)
-
శ్రీలీల సమ్మర్ షో.. అరియానా హాట్ ‘గ్లో’
-
టీచర్ను కొట్టిన ప్రిన్సిపల్.. వీడియో వైరల్
-
ఫ్రీగా ఇస్తాం.. ఈ విల్లా తీసుకోండి..!
-
నిద్రపోయిన స్టేషన్ మాస్టర్.. నిలిచిపోయిన ఎక్స్ప్రెస్ రైలు!
-
కొనసాగుతున్న లేఆఫ్లు.. 4 నెలల్లో 80 వేల మంది ఉద్యోగులపై వేటు