సమస్యలు అటుంచి..విధానాలే ముందుంచి!
శాసనసభ నియోజకవర్గాలతో పోలిస్తే లోకసభ స్థానం పరిధి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు గ్రామస్థాయిలో ఇంటింటి ప్రచార బాధ్యతలను ముఖ్య కార్యకర్తలకే అప్పగిస్తున్నారు.
చేరికలు, పదవుల హామీపైనే పార్టీల దృష్టి
ఈనాడు, కామారెడ్డి, న్యూస్టుడే, జహీరాబాద్: శాసనసభ నియోజకవర్గాలతో పోలిస్తే లోకసభ స్థానం పరిధి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు గ్రామస్థాయిలో ఇంటింటి ప్రచార బాధ్యతలను ముఖ్య కార్యకర్తలకే అప్పగిస్తున్నారు. జహీరాబాద్ నియోజకవర్గంలో మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులు స్థానిక నాయకత్వమే పార్టీ విధానాలు, చేసిన పనులు, హామీలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా కార్యాచరణ రూపొందించుకుంటున్నారు. మండల, నియోజకవర్గ కేంద్రాలు, ప్రధాన పట్టణాల్లో ముఖ్యనేతలతో సభలు, రోడ్డుషోల ద్వారా ప్రచారం చేపట్టాలనే ఆలోచనలో పార్టీలున్నాయి. ఇందుకనుగుణంగానే ప్రచార అనుమతులు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే గ్రామస్థాయి, ద్వితీయ శ్రేణి నేతలను ఆకర్షించేందుకు అభ్యర్థులు పోటీపడుతున్నారు.
గతం కంటే భిన్నంగా..
గతంలో ఎన్నికల ప్రచారంలో స్థానిక అంశాలనే ప్రచార అస్త్రాలుగా మలుచుకునేవారు. ప్రస్తుతం ఇందుకు భిన్నంగా పార్టీల మేనిఫెస్టోల్లోని అంశాలు, అభ్యర్థుల వ్యక్తిగత అంశాలే ప్రధాన అంశాలుగా మారుతున్నాయి.
- జహీరాబాద్ నియోజకవర్గంలో సాగు, తాగునీటి సమస్యలతో మౌలిక వసతుల కల్పన ప్రధాన సమస్యలుగా ఉన్నాయి. కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్, అందోలు, నారాయణఖేడ్, జహీరాబాద్ నియోజకవర్గాల్లో సాగునీరు లేక అన్నదాతలు వర్షాధార పంటలపైనే ఆధారపడుతున్నారు. గోదావరి జలాలు తరలించి నియోజకవర్గం పరిధిలోని రెండు లక్షల ఎకరాలను సస్యశ్యామలం చేస్తామనే నాయకుల మాటలు హామీలుగా మారుతున్నాయి.
- ఆరుతడి పంటలు ఎక్కువగా పండించే జహీరాబాద్, అందోలు, నారాయణఖేడ్, జుక్కల్ నియోజకవర్గాల్లో ఆహారశుద్ధి పరిశ్రమలు ఏర్పాటు చేయాల్సి ఉన్నా ముందడుగు పడడం లేదు. గతంలో మూడు పార్టీలు పరిశ్రమల ఏర్పాటు, యువతకు ఉపాధిపై హామీలు ఇచ్చినా కార్యరూపం దాల్చలేదు.
- కామారెడ్డి జిల్లాలోని మద్నూర్లో ప్రస్తుత ఎంపీ బీబీపాటిల్ కేంద్రీయ విద్యాలయం ఏర్పాటవుతుందని ప్రకటించినా కార్యరూపం దాల్చలేదు. నాలుగేళ్ల నుంచి ప్రచారం చేసినా విద్యాసంస్థ ఏర్పాటు కాలేదు.
- కామారెడ్డి జిల్లాకేంద్రంలో ఆర్వోబీ(రైల్వే ఓవర్ బ్రిడ్జిలు)లు లేక పాతపట్టణం నుంచి కొత్త పట్టణానికి వెళ్లే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అరగంటకోసారి రైల్వే గేటు పడుతుండడం వాహనదారులకు ఇబ్బందికరంగా మారింది. ఆర్వోబీల నిర్మాణం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేపట్టాల్సి ఉంటుంది. ఎంపీ చొరవతోనే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుంది.
- కరీంనగర్-కామారెడ్డి-ఎల్లారెడ్డి- పిట్లం(కేకేవై) రహదారిని జాతీయ రహదారిగా మార్చే దస్త్రం కేంద్రంలో నాలుగేళ్ల నుంచి పెండింగ్లోనే ఉంది. లోకసభ స్థానం పరిధిలో పలు రహదారుల నిర్మాణాలకు అటవీశాఖ అనుమతులు లభించక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
వలసలను ప్రోత్సహిస్తున్న అభ్యర్థులురానున్న రోజుల్లో రాజకీయ పార్టీల సభలు, ర్యాలీలు, రోడ్షోలకు జనసమీకరణలో ముఖ్యకార్యకర్తలు, ద్వితీయశ్రేణి నేతలే కీలకంగా ఉండనున్నారు. గ్రామాల్లో అభ్యర్థుల తరఫున ఓటు అడిగే బాధ్యత వీరే తీసుకోనున్నారు. ఈ నేపథ్యంలో పల్లెలు, పట్టణాల్లో ప్రజాబలం ఉన్న నేతలు, మాజీ ప్రజాప్రతినిధులతో పాటు ఇతర పార్టీల క్రియాశీల కార్యకర్తలను తమ పార్టీల్లో చేర్చుకునేందుకు అభ్యర్థులు పోటీపడుతున్నారు.
స్థానిక ఎన్నికల్లో ప్రాధాన్యమిస్తామంటూ..
ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయం కోసం పనిచేసిన నాయకులకు రానున్న స్థానిక ఎన్నికల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాల టికెట్లు కేటాయింపులో ప్రాధాన్యమిస్తామని మూడు ప్రధాన పార్టీలు హామీనిస్తున్నాయి. నియోజకవర్గ, మండల స్థాయి నేతలకు నియామక పదవులు వచ్చేలా కృషి చేస్తామని అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు చెబుతున్నారు. కేంద్రంలో మూడోసారి అధికారం చేపడతామని చెబుతున్న భాజపా నేతలు సైతం కేంద్ర ప్రభుత్వ నియామక పదవులు ఇస్తామని నమ్మకం కలిగిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇంటి నుంచే ఓటు.. చైతన్యం చాటు
[ 02-05-2024]
ప్రజాస్వామ్యంలో ఓటుకున్న విలువ ఎనలేనిది. దాన్ని పొందడమే కాకుండా.. వినియోగించుకోవడం అత్యంత ప్రధానం. వంద శాతం ఓటింగ్ ఎన్నికల సంఘం ప్రధాన లక్ష్యం. వయోభారం, అంగవైకల్యంతో నడవలేని స్థితిలో ఉన్న వారిలో కొందరు ఓటింగ్కు దూరంగా ఉంటున్నారు. -
ఓటింగ్ శాతం పెంపుపై ప్రత్యేక దృష్టి
[ 02-05-2024]
ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం సన్నద్ధమవుతోంది. పదుల సంఖ్యలో అభ్యర్థులు పోటీలో ఉండడంతో అవసరమైన బ్యాలెట్, కంట్రోల్ యూనిట్లు, వీవీ ప్యాట్లను సిద్ధం చేస్తున్నారు. -
గోబెల్స్ ప్రచారం నమ్మొద్దు: హరీశ్రావు
[ 02-05-2024]
భాజపా అభ్యర్థి రఘునందన్రావు కల్పిత దృశ్యాలు సృష్టించి ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నారని మాజీ మంత్రి హరీశ్రావు ఆరోపించారు. గత దుబ్బాక ఉప ఎన్నికల్లో సైతం కాంగ్రెస్ అభ్యర్థి భారాసలో చేరారని వీడియో సృష్టించి రాజకీయంగా లబ్ధి పొందారన్నారు. -
వసతులు కొరవడి.. అన్నదాత అలజడి
[ 02-05-2024]
జిల్లాలో యాసంగి వరి కోతలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఉత్పత్తులు చేతికి అందడంతో ధాన్యాన్ని విక్రయించేందుకు రైతులు కొనుగోలు కేంద్రాలకు తీసుకు వస్తున్నారు. -
ఎండ పెరిగి.. మీటర్లు తిరిగి
[ 02-05-2024]
ఎండల తీవ్రత పెరగడంతో విద్యుత్తు వినియోగం పెరిగి గృహజ్యోతి కింద జీరో బిల్లులు పొందే లబ్ధిదారుల సంఖ్య తగ్గిపోయింది. ప్రభుత్వ నిబంధనల మేరకు 200 యూనిట్లలోపు వినియోగించుకునే వారికి జీరో బిల్లు ఇస్తారు. -
రాజ్యాంగ పరిరక్షణకే కాంగ్రెస్కు మద్దతు
[ 02-05-2024]
ప్రజాస్వామ్యం, రాజ్యాంగ పరిరక్షణ కోసమే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్కు మద్దతు ఇస్తున్నామని ఆచార్య కోదండరాం అన్నారు. బుధవారం మెదక్లో ఆయన మాట్లాడారు. -
కార్మికుల హక్కుల సాధనకు ఐక్య పోరాటం
[ 02-05-2024]
కార్మికుల హక్కుల సాధన కోసం ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని సీఐటీయూ జిల్లా కోశాధికారి నర్సమ్మ పిలుపునిచ్చారు. కార్మిక దినోత్సవం మేడేను పురస్కరించుకొని బుధవారం కౌడిపల్లి మండల కేంద్రంలో భవన -
అప్రమత్తతోనే ప్రశాంతం
[ 02-05-2024]
ఎన్నికలు సజావుగా సాగాలంటే.. అన్ని స్థాయిల్లో అప్రమత్తత అవసరం. ప్రధానంగా పటిష్ఠ బందోబస్తు.. నిఘా వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తుంది. లోక్సభ ఎన్నికల వేళ నూతన సాంకేతికత తోడుగా ప్రశాంతంగా ఎన్నికల క్రతువు పూర్తి చేసేందుకు చర్యలు ఆరంభించారు. -
రాజకీయ భవిష్యత్తు.. చేరికలను ప్రోత్సహిస్తూ..
[ 02-05-2024]
గజ్వేల్-ప్రజ్ఞాపూర్ బల్దియాకు చెందిన సీనియర్ నేత రాబోయే పురపాలిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఛైర్మన్ పీఠాన్ని దక్కించుకోవాలన్న తలంపుతో తన అనుచరులతో ఓ ప్రధాన పార్టీ నుంచి మరో ప్రధాన పార్టీలో చేరిపోయారు. -
కేసీఆర్ మా ఫోన్లు ట్యాపింగ్ చేయించారు
[ 02-05-2024]
మల్లన్న సాగర్ నిర్వాసితులమైన తమ ఫోన్లను మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ట్యాపింగ్ చేయించారని నిర్వాసితులు ఎండీ హయాతుద్దీన్, వై.శ్రీనివాస్రెడ్డి ఆరోపించారు. బుధవారం సోమాజిగూడలోని ప్రెస్క్లబ్లో వారు మాట్లాడుతూ.. -
జొన్న రైతులకు బకాయిల బెంగ
[ 02-05-2024]
అన్నదాతలకు కష్టాలు తప్పడం లేదు. పంట సాగు నుంచి విపణికి తరలించి విక్రయాలు చేపట్టే వరకు ఇదే పరిస్థితి. ఇన్ని ఇబ్బందులను అధిగమించినా పంట విక్రయాల బిల్లుల చెల్లింపులో జాప్యం వల్ల కర్షకులకు ఎదురుచూపులు తప్పడం లేదు. -
మహిళా సంఘాలకు సీఎస్సీ కేంద్రాలు
[ 02-05-2024]
పొదుపులు.. బ్యాంకుల్లో అప్పులు తీసుకోవడం.. జమ చేయడం వరకే పరిమితమైన మహిళా పొదుపు సంఘాల సభ్యులు ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించిన పనులు చేపట్టనున్నారు. -
7, 8 తేదీల్లో మాక్ పోలింగ్పై శిక్షణ
[ 02-05-2024]
ఎన్నికల విధులు సక్రమంగా నిర్వహించాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్లో పోలింగ్ అధికారులు, సహాయ పోలింగ్ అధికారులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. -
ఓటమి భయంతోనే భాజపా ఆరోపణలు
[ 02-05-2024]
లోక్సభ ఎన్నికల్లో భాజపా తక్కువ సీట్లకే పరిమితమయ్యే పరిస్థితి ఉందని, అందుకే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కాంగ్రెస్పై ఆరోపణలు చేస్తున్నారని జహీరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ షెట్కార్ ఆరోపించారు. -
నకిలీ పత్రాలతో ప్లాట్ల విక్రయం
[ 02-05-2024]
నకిలీ పత్రాలు సృష్టించి ప్లాట్లు విక్రయిస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. బుధవారం ఎస్పీ చెన్నూరి రూపేష్ వెల్లడించిన వివరాల ప్రకారం.. అమీన్పూర్కు చెందిన దుర్గాప్రసాద్, సుబ్బారావు, రవి గౌడ్ ముఠాగా ఏర్పడ్డారు.
తాజా వార్తలు (Latest News)
-
లైంగిక దౌర్జన్యం కేసు.. ప్రజ్వల్ రేవణ్ణపై లుక్అవుట్ నోటీసు
-
హైదరాబాద్.. ఫస్ట్ బ్యాటింగ్ చేస్తారా? 300 కొట్టేస్తారా?
-
వాట్సప్లో కొత్త ఫీచర్.. ఇకపై ఈవెంట్ ప్లాన్ చేయొచ్చు!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
నంబర్ 6 ర్యాంకర్కు నో ప్లేస్.. ఆ బాధను తట్టుకోవడం కష్టమే: ఇర్ఫాన్ పఠాన్
-
దిల్లీ ఎల్జీ కీలక నిర్ణయం.. మహిళా కమిషన్లో 223 మంది తొలగింపు