ఓటున్న ప్రవాసీ.. పెరగాలి చైతన్య దీప్తి
వజ్రాయుధంతో సమానమైన ఓటు హక్కును సద్వినియోగం చేసుకుంటేనే సార్థకత. ప్రజాస్వామ్య పరిరక్షణకు బాటలు వేసే ఎన్నికల క్రతువులో దేశ భవితను ‘ఓటు’ నిర్దేశిస్తుంది.
న్యూస్టుడే, సిద్దిపేట: వజ్రాయుధంతో సమానమైన ఓటు హక్కును సద్వినియోగం చేసుకుంటేనే సార్థకత. ప్రజాస్వామ్య పరిరక్షణకు బాటలు వేసే ఎన్నికల క్రతువులో దేశ భవితను ‘ఓటు’ నిర్దేశిస్తుంది. ఈ తరుణంలో ఓటరు తన బాధ్యతను పక్కాగా నిర్వర్తించాల్సి ఉంటుంది. అర్హులైన ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు చేసుకోవాలంటూ ఎన్నికల సంఘం వివిధ స్థాయిల్లో ప్రేరణ కల్పిస్తోంది. ఎన్నికల్లో ఎన్నారైల (ప్రవాసుల) నుంచి ఆశించిన స్పందన కనిపించడం లేదు. జిల్లాకు సంబంధించి ఎన్నారైలు కేవలం 27 మంది మాత్రమే ఓటు హక్కు పొందారు. అందులో పురుషులు - 24, మహిళలు - 3 మంది మాత్రమే. ఫిబ్రవరి 8న వెలువరించిన ఓటరు జాబితా ప్రకారం నియోజకవర్గాల వారీగా పరిశీలిస్తే.. హుస్నాబాద్ నుంచి 13 మంది, సిద్దిపేట - 5, దుబ్బాక - 6, గజ్వేల్ - 3 ఉన్నారు. వారు సైతం పూర్తిస్థాయిలో వినియోగించుకుంటారా.. లేదా.. అనేది ప్రశ్నార్థకం. ఓటు సద్వినియోగం పక్కన పెడితే.. కనీసం నమోదు సంఖ్య జిల్లాలో మూడంకెలను దాటడం లేదు.
విదేశాల్లో 9 వేల మంది: జిల్లాలో ఓటర్ల సంఖ్య 9,61,361 మంది. ఇక్కడే పుట్టిపెరిగి.. చదువుకుని ఎంతో మంది ఉద్యోగం, ఉపాధి, వ్యాపారాల నిమిత్తం ఇతర దేశాలకు వలస వెళ్తున్నారు. అలాంటి ప్రవాసీయులకు.. ఓటరుగా నమోదయ్యే అవకాశం ఉంది. పోలింగ్ రోజున నేరుగా పాల్గొని నచ్చిన అభ్యర్థిని ఎన్నుకోవచ్చు. ఎన్నికల సంఘం ఆన్లైన్లో నమోదుకు అవకాశం (ఫారం -6ఏ దరఖాస్తు) కల్పించినా.. పెద్దగా ముందుకు రావడం లేదు. మరోవైపు జిల్లాకు చెందిన సుమారు 9 వేల మంది గల్ఫ్ దేశాలు, అమెరికా, ఆస్ట్రేలియా, చైనా, కెనడా, జర్మనీ, యూకే, ఇతరత్రా దేశాల్లో నివసిస్తున్నారు. విద్యార్థులు సహా ఐటీ, ఇతర రంగాల్లో ఉద్యోగులు, వివిధ చోట్ల కార్మికులుగా పని చేస్తున్నారు. సహజంగా ఆరు నెలలు స్థానికంగా ఉండకపోతే ఎన్నికల సంఘం జాబితా నుంచి ఓటు హక్కును తొలగిస్తుంది. ఇతర దేశాలకు వెళితే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు పలు దశల్లో అవకాశం కల్పించింది. అయినా అతి తక్కువ మంది ముందుకు రావడం గమనార్హం.
అవకాశం కల్పిస్తే మేలు: ప్రవాసులు ఓటు వేయాలంటే స్వదేశానికి రావాల్సి ఉంటుంది. కార్మికులు, కూలీ పనుల నిమిత్తం వెళ్లిన వారు.. ఇక్కడికి రాలేని పరిస్థితి. మరోవైపు పని చేస్తున్న చోట అనుమతి తీసుకోవడం కష్టమే. పోలింగ్ రోజు వచ్చి ఓటేయడం వ్యయప్రయాసలతో కూడుకున్నదని భావించి ఆసక్తి చూపడం లేదు. ఆన్లైన్ ద్వారా ఓటేసే అవకాశం కల్పించాలని గతంలో ఎన్నికల సంఘం యోచించినా కార్యరూపం దాల్చ లేదు. పొరపాట్లు జరిగితే ఎన్నికల ప్రక్రియపై ప్రభావం పడుతుందన్న కారణంతో ఈసీ వెనక్కి తగ్గింది. కనీసం ఓటరుగా నమోదు చేసుకుంటే ఎంత మంది ఎన్నారైలు ఉన్నారనే లెక్క పక్కాగా తేలేదని మరికొందరి అభిప్రాయం. భవిష్యత్తులో ప్రత్యామ్నాయ చర్యలు తీసుకొని అంతా ఓటు వేసేలా పకడ్బందీ వ్యవస్థను రూపకల్పన చేయాల్సి ఉంది. మన దేశ ప్రజాస్వామ్యబద్ధమైన ఎన్నికల ప్రక్రియలో తామూ పాల్గొన్నామనే తృప్తి మిగులుతుంది. దేశ, రాష్ట్ర రాజకీయాలను తెలుసుకోవడంలో మాత్రం ఎన్ఆర్ఐలు ఆసక్తి చూపుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పంద్రాగస్టు తర్వాత సిద్దిపేటకు విముక్తి కల్పిస్తా: రేవంత్ రెడ్డి
[ 02-05-2024]
ఆరునూరైనా మెదక్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరాలని సీఎం రేవంత్రెడ్డి ఓటర్లకు పిలుపునిచ్చారు. -
ఇంటి నుంచే ఓటు.. చైతన్యం చాటు
[ 02-05-2024]
ప్రజాస్వామ్యంలో ఓటుకున్న విలువ ఎనలేనిది. దాన్ని పొందడమే కాకుండా.. వినియోగించుకోవడం అత్యంత ప్రధానం. వంద శాతం ఓటింగ్ ఎన్నికల సంఘం ప్రధాన లక్ష్యం. వయోభారం, అంగవైకల్యంతో నడవలేని స్థితిలో ఉన్న వారిలో కొందరు ఓటింగ్కు దూరంగా ఉంటున్నారు. -
ఓటింగ్ శాతం పెంపుపై ప్రత్యేక దృష్టి
[ 02-05-2024]
ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం సన్నద్ధమవుతోంది. పదుల సంఖ్యలో అభ్యర్థులు పోటీలో ఉండడంతో అవసరమైన బ్యాలెట్, కంట్రోల్ యూనిట్లు, వీవీ ప్యాట్లను సిద్ధం చేస్తున్నారు. -
గోబెల్స్ ప్రచారం నమ్మొద్దు: హరీశ్రావు
[ 02-05-2024]
భాజపా అభ్యర్థి రఘునందన్రావు కల్పిత దృశ్యాలు సృష్టించి ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నారని మాజీ మంత్రి హరీశ్రావు ఆరోపించారు. గత దుబ్బాక ఉప ఎన్నికల్లో సైతం కాంగ్రెస్ అభ్యర్థి భారాసలో చేరారని వీడియో సృష్టించి రాజకీయంగా లబ్ధి పొందారన్నారు. -
వసతులు కొరవడి.. అన్నదాత అలజడి
[ 02-05-2024]
జిల్లాలో యాసంగి వరి కోతలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఉత్పత్తులు చేతికి అందడంతో ధాన్యాన్ని విక్రయించేందుకు రైతులు కొనుగోలు కేంద్రాలకు తీసుకు వస్తున్నారు. -
ఎండ పెరిగి.. మీటర్లు తిరిగి
[ 02-05-2024]
ఎండల తీవ్రత పెరగడంతో విద్యుత్తు వినియోగం పెరిగి గృహజ్యోతి కింద జీరో బిల్లులు పొందే లబ్ధిదారుల సంఖ్య తగ్గిపోయింది. ప్రభుత్వ నిబంధనల మేరకు 200 యూనిట్లలోపు వినియోగించుకునే వారికి జీరో బిల్లు ఇస్తారు. -
రాజ్యాంగ పరిరక్షణకే కాంగ్రెస్కు మద్దతు
[ 02-05-2024]
ప్రజాస్వామ్యం, రాజ్యాంగ పరిరక్షణ కోసమే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్కు మద్దతు ఇస్తున్నామని ఆచార్య కోదండరాం అన్నారు. బుధవారం మెదక్లో ఆయన మాట్లాడారు. -
కార్మికుల హక్కుల సాధనకు ఐక్య పోరాటం
[ 02-05-2024]
కార్మికుల హక్కుల సాధన కోసం ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని సీఐటీయూ జిల్లా కోశాధికారి నర్సమ్మ పిలుపునిచ్చారు. కార్మిక దినోత్సవం మేడేను పురస్కరించుకొని బుధవారం కౌడిపల్లి మండల కేంద్రంలో భవన -
అప్రమత్తతోనే ప్రశాంతం
[ 02-05-2024]
ఎన్నికలు సజావుగా సాగాలంటే.. అన్ని స్థాయిల్లో అప్రమత్తత అవసరం. ప్రధానంగా పటిష్ఠ బందోబస్తు.. నిఘా వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తుంది. లోక్సభ ఎన్నికల వేళ నూతన సాంకేతికత తోడుగా ప్రశాంతంగా ఎన్నికల క్రతువు పూర్తి చేసేందుకు చర్యలు ఆరంభించారు. -
రాజకీయ భవిష్యత్తు.. చేరికలను ప్రోత్సహిస్తూ..
[ 02-05-2024]
గజ్వేల్-ప్రజ్ఞాపూర్ బల్దియాకు చెందిన సీనియర్ నేత రాబోయే పురపాలిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఛైర్మన్ పీఠాన్ని దక్కించుకోవాలన్న తలంపుతో తన అనుచరులతో ఓ ప్రధాన పార్టీ నుంచి మరో ప్రధాన పార్టీలో చేరిపోయారు. -
కేసీఆర్ మా ఫోన్లు ట్యాపింగ్ చేయించారు
[ 02-05-2024]
మల్లన్న సాగర్ నిర్వాసితులమైన తమ ఫోన్లను మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ట్యాపింగ్ చేయించారని నిర్వాసితులు ఎండీ హయాతుద్దీన్, వై.శ్రీనివాస్రెడ్డి ఆరోపించారు. బుధవారం సోమాజిగూడలోని ప్రెస్క్లబ్లో వారు మాట్లాడుతూ.. -
జొన్న రైతులకు బకాయిల బెంగ
[ 02-05-2024]
అన్నదాతలకు కష్టాలు తప్పడం లేదు. పంట సాగు నుంచి విపణికి తరలించి విక్రయాలు చేపట్టే వరకు ఇదే పరిస్థితి. ఇన్ని ఇబ్బందులను అధిగమించినా పంట విక్రయాల బిల్లుల చెల్లింపులో జాప్యం వల్ల కర్షకులకు ఎదురుచూపులు తప్పడం లేదు. -
మహిళా సంఘాలకు సీఎస్సీ కేంద్రాలు
[ 02-05-2024]
పొదుపులు.. బ్యాంకుల్లో అప్పులు తీసుకోవడం.. జమ చేయడం వరకే పరిమితమైన మహిళా పొదుపు సంఘాల సభ్యులు ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించిన పనులు చేపట్టనున్నారు. -
7, 8 తేదీల్లో మాక్ పోలింగ్పై శిక్షణ
[ 02-05-2024]
ఎన్నికల విధులు సక్రమంగా నిర్వహించాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్లో పోలింగ్ అధికారులు, సహాయ పోలింగ్ అధికారులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. -
ఓటమి భయంతోనే భాజపా ఆరోపణలు
[ 02-05-2024]
లోక్సభ ఎన్నికల్లో భాజపా తక్కువ సీట్లకే పరిమితమయ్యే పరిస్థితి ఉందని, అందుకే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కాంగ్రెస్పై ఆరోపణలు చేస్తున్నారని జహీరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ షెట్కార్ ఆరోపించారు. -
నకిలీ పత్రాలతో ప్లాట్ల విక్రయం
[ 02-05-2024]
నకిలీ పత్రాలు సృష్టించి ప్లాట్లు విక్రయిస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. బుధవారం ఎస్పీ చెన్నూరి రూపేష్ వెల్లడించిన వివరాల ప్రకారం.. అమీన్పూర్కు చెందిన దుర్గాప్రసాద్, సుబ్బారావు, రవి గౌడ్ ముఠాగా ఏర్పడ్డారు.
తాజా వార్తలు (Latest News)
-
97.76% రూ.2వేల నోట్లు వెనక్కి: ఆర్బీఐ
-
అభిమాని బర్త్డే సెలబ్రేట్ చేసి.. ఖరీదైన గిఫ్ట్ ఇచ్చి.. వీడియో వైరల్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కిమ్ ‘సుఖం’ కోసం.. ఏడాదికి 25 మంది యువతులు!
-
ఆ క్యారెక్టర్ ప్లే చేయాలంటే భయమేసింది: రాశీఖన్నా
-
8న ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ ఐపీఓ.. ధరల శ్రేణి ఇదే..