ఫార్మసీ విద్య.. భవితకు బాట
మినీ ఎంబీబీఎస్గా గుర్తింపు పొందిన బి.ఫార్మసీ కోర్సుపై ఆసక్తి పెరుగుతోంది. ఈ కోర్సు చదివితే ఉద్యోగాలు, స్వయం ఉపాధి అవకాశాలు లభిస్తాయని యువత భావిస్తున్నారు.
నల్గొండ టౌన్, న్యూస్టుడే: మినీ ఎంబీబీఎస్గా గుర్తింపు పొందిన బి.ఫార్మసీ కోర్సుపై ఆసక్తి పెరుగుతోంది. ఈ కోర్సు చదివితే ఉద్యోగాలు, స్వయం ఉపాధి అవకాశాలు లభిస్తాయని యువత భావిస్తున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కొన్నాళ్లుగా పరిశీలిస్తే ఇంటర్లో బైపీసీ చదివిన విద్యార్థులు ఫార్మసీ కోర్సువైపు మక్కువ చూపుతున్నారు. దీంతో ఏటికేడు ఈ కోర్సుకు డిమాండ్ పెరుగుతుంది. కోర్సు పూర్తిచేసిన విద్యార్థులకు జిల్లాలోని ఫార్మా కంపెనీలు, క్లినికల్ ల్యాబ్లు, మందుల దుకాణాలు, ఆసుపత్రుల్లో విస్తృతంగా ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. మరికొంత మంది విద్యార్థులకు ఫార్మా హబ్గా మారుతున్న హైదరాబాద్లో ఉద్యోగాలు దొరుకుతున్నాయి. యువతకు ఉద్యోగ వారధిగా ఫార్మసీ విద్య మారింది. ప్రస్తుతం ఫార్మసీ ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతోంది. కరోనా తర్వాత ఈ కోర్సులకు మరింతగా డిమాండ్ పెరిగింది.
ఉమ్మడి జిల్లాలో 10 కళాశాలలు..
బి.ఫార్మసీ కళాశాలలు ఉమ్మడి జిల్లాలో 10 వరకు ఉన్నాయి. నల్గొండలో 2, యాదాద్రి, భువనగిరిలో 2, సూర్యాపేటలో ఆరు ఫార్మసీ కళాశాలలున్నాయి. వీటిలో దాదాపు వెయ్యి సీట్లు వరకు ఉన్నాయి. కన్వీనర్ కోటాలో 700, మేనేజ్మెంట్ కోటాలో 300 సీట్లు అందుబాటులో ఉంటాయి. ప్రతి యేటా అక్టోబరులో ప్రవేశాల ప్రక్రియ ఉంటుంది. ఈ ఏడాది వివిధ కారణాల వల్ల ప్రవేశాల కౌన్సెలింగ్ ఆలస్యమైంది. ఈ నెల ఒకటో తేదీ నుంచి ప్రవేశాల ప్రక్రియ మొదలైంది. ఒకటో తేదీ నుంచి 5వ తేదీ వరకు మొదటి విడత.. 13వ తేదీ నుంచి 15 వరకు రెండో విడత ప్రవేశాల షెడ్యూల్ ఖరారు చేశారు. నాలుగేళ్ల ఫార్మసీ కోర్సులో ప్రతి యేటా 10 పేపర్ల చొప్పున మొత్తం నలబై పేపర్లు విద్యార్థులు చదవాల్సి ఉంటుంది. ప్రథమ సంవత్సరం నుంచే విద్యార్థులతో ప్రయోగాలు చేయించి..వారికి ప్రయోగ పరిజ్ఞానం అందిస్తారు. తృతీయ సంవత్సరం చివరలో ఇంటర్నషిప్లో భాగంగా విద్యార్థులు ఆసుపత్రులు, మెడికల్ షాపులు, ఫార్మ ఇండస్ట్రీల్లో శిక్షణ పొంది వారి నుంచి ధ్రువపత్రాలు పొందుతారు. విద్యార్థులకు వార్షిక పరీక్షలు ప్రతి ఏటా నవంబర్ మాసంలో నిర్వహిస్తారు.
ప్రయోగ పరిజ్ఞానం అవసరం
- కె.ఎన్.వి.రావు, ప్రిన్సిపల్
మంచి కళాశాలను ఎంచుకుని భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలి. నాలుగేళ్ల కోర్సులో విద్యార్థులు ప్రయోగ పరిజ్ఞానం పొందాల్సి ఉంటుంది. కోర్సులో భాగంగా మందుల తయారీ, వాడకం వంటి విషయాలపై మరింత అవగాహన పెంచుకోవాలి. కోర్సు పూర్తయిన వారికి దేశ, విదేశాల్లో విస్తృతంగా ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని అనేక ఫార్మ కంపెనీల్లో విద్యార్థులు ఉద్యోగాలు పొందవచ్చు.
ఉపాధి అవకాశాలు త్వరగా లభిస్తాయని
- గాయత్రి, బి.ఫార్మసీ, నాల్గో సంవత్సరం
ఉపాధి అవకాశాలు త్వరగా లభిస్తాయని ఫార్మసీ కోర్సును చదువుతున్నాను. ఈ నాలుగేళ్లలో ఎన్నో విషయాలపై అవగాహన పొందాను. ప్రతి రోజు తరగతులకు హాజరవుతూ...ప్రయోగాలు చేశాను. వార్షిక పరీక్షల్లో మంచి మార్కులు సాధించాను. ప్రభుత్వ ఉద్యోగమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నా. ఫార్మసీ విద్యకు రానున్న రోజుల్లో మరింత డిమాండ్ పెరుగుతుంది.
సొంత కంపెనీలు స్థాపించుకోవచ్చు
-సీహెచ్.సంపత్కుమార్, డ్రగ్ ఇన్స్పెక్టర్ యాదాద్రి,భువనగిరి జిల్లా
ఫార్మసీ పూర్తిచేసిన విద్యార్థులు ప్రభుత్వ సహకారంతో చిన్న, మధ్య తరహా కంపెనీలు స్థాపించుకోవచ్ఛు పీహెచ్సీలు, ఆసుపత్రుల్లో ఫార్మసిస్ట్లుగా ఉపాధి అవకాశాలు పొందవచ్ఛుడ్రగ్ ఇన్స్పెక్టర్లుగా ఎంపిక కావోచ్ఛు ఫార్మా ల్యాబ్ల్లో ఎనలిస్ట్గా పనిచేయవచ్ఛు దేశ, విదేశాల్లో అపార అవకాశాలు ఉన్నాయి. వేతనాలు కూడా ఆశాజనకంగానే ఉన్నాయి. ఫార్మ కంపెనీల్లో ప్రొడక్షన్, క్వాలిటీ అస్యూరెన్స్, క్వాలిటీ కంట్రోల్, రిసెర్చ్ డెవలప్మెంట్ విభాగాల్లో విస్తృతంగా ఉపాధి అవకాశాలు ఉన్నాయి. కొవిడ్ నేపథ్యంలో మందులు, విటమిన్ల వాడకం పెరిగిన నేపథ్యంలో సొంత మెడికల్ డిస్ట్రిబ్యూషన్, రిటైల్ షాపులు నెలకొల్పి ఉపాధి పొందవచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భానుడి వేడి..దొరకని నాడి
[ 05-05-2024]
లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో ఇంకా పట్టణ ఓటరు నాడి అంతుచిక్కకుండా ఉంది. -
ప్రచారం కన్నా... సమీక్షలే మిన్నా..!
[ 05-05-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారానికి మరో ఏడు రోజులే గడువు ఉన్నా.. గతంతో పోలిస్తే క్షేత్రస్థాయిలో మాత్రం ప్రచారం ఊపందుకోలేదు. -
మనమే కారణం.. మేల్కోకుంటే దారుణం
[ 05-05-2024]
ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఇటీవలి కాలంలో రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. -
అప్రమత్తతే శ్రీరామరక్ష
[ 05-05-2024]
మిర్యాలగూడ పట్టణంలో శనివారం దుస్తులు ఆరేస్తుండగా విద్యుదాఘాతానికి గురై ఓ మహిళ మృతి చెందగా..మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. -
రైతు భరోసా ఇవ్వని కాంగ్రెస్ ప్రభుత్వం
[ 05-05-2024]
రాష్ట్ర వ్యాప్తంగా 65 లక్షల మంది రైతులకు రైతు భరోసా ఇచ్చినట్లు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్పుకోవడం సిగ్గుచేటని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. -
గంగా, సబర్మతి మాదిరిగా మూసీ ప్రక్షాళన
[ 05-05-2024]
ఈ ప్రాంత ప్రజలను ఏళ్లుగా పట్టి పీడిస్తున్న మూసీ కాలుష్యాన్ని శాశ్వతంగా నిర్మూలించేందుకు ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళ్తాం. గంగా, సబర్మతి నదుల్లాగా మూసీని కాలుష్యరహితంగా తయారు చేస్తామని భువనగిరి భారాస అభ్యర్థి క్యామ మల్లేష్ అన్నారు. -
చుక్క నీరు కూడా వదులుకోబోం: మంత్రి ఉత్తమ్
[ 05-05-2024]
ప్రస్తుత ఎన్నికలు భారతదేశ దిశ, దశ మార్చేవని, ప్రతి ఓటరూ ఇది గుర్తించి ఓటు వేయాలని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి పిలుపునిచ్చారు. -
నాలుగు లక్షల మెజార్టీ ఖాయం: రాజగోపాల్రెడ్డి
[ 05-05-2024]
భువనగిరి లోక్సభ నియోకవర్గంలో నాలుగు లక్షల మెజార్టీ తగ్గకుండా కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధిస్తారని మునుగోడు ఎమ్మెల్యే, భువనగిరి లోక్సభ నియోజకవర్గ ఇన్ఛార్జి కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అన్నారు -
ఆ ఎద్దడి మనకొద్దు.. అప్రమత్తతే ముద్దు
[ 05-05-2024]
ప్రస్తుతం బెంగళూరు నగర నీటి సంక్షోభం దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వాలను అప్రమత్తం చేసింది. -
ఆయకట్టులో ఆగని చోరీలు
[ 05-05-2024]
సాగర్ ఆయకట్టు పరిధిలోని రైతులకు దొంగలు చుక్కలు చూపిస్తున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా యథేచ్ఛగా వారి పని చేసుకుంటూ పోతున్నారు. -
నిబంధనలకు విరుద్ధంగా పోస్టులు పెట్టొద్దు
[ 05-05-2024]
లోక్సభ ఎన్నికల సందర్భంగా సామాజిక మాధ్యమాల్లో వచ్చే పోస్టులను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం చర్యలు తీసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటరావు తెలిపారు. -
భానుడి ప్రతాపం.. బాతులకు తాపం
[ 05-05-2024]
రోజురోజుకీ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి.దీంతో పక్షులు సేదతీరేందుకు ప్రత్యామ్నాయాలు వెతుకుతున్నాయి. -
నేనేంటీ.. నాకింత విలువేంటి..!
[ 05-05-2024]
లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రధాన పార్టీలు ఎన్నికల ప్రచారంతో పాటు చేరికలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాయి. -
నేటి నుంచి ఈవీఎంల కమీషనింగ్
[ 05-05-2024]
ఎన్నికల పర్వంలో మరో కీలక ఘట్టమైన ఈవీఎంల కమీషనింగ్ (బ్యాలెట్ కాగితం అమర్చడం, నమూనా పోలింగ్) ప్రక్రియ ఆదివారం నుంచి ప్రారంభం కానుంది. -
6న నల్గొండలో నడ్డా సభ: సైదిరెడ్డి
[ 05-05-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 6న నల్గొండలోని మేకల అభినవ్ స్టేడియంలో నిర్వహించే బహిరంగ సభలో భాజపా జాతీయ అధ్యక్షడు జేపీ నడ్డా పాల్గొంటారని ఆ పార్టీ నల్గొండ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి తెలిపారు. -
కొనసాగిన ఇంటి వద్ద పోలింగ్
[ 05-05-2024]
జిల్లాలో రెండు రోజులుగా ఇంటి వద్ద పోలింగ్ నిర్వహణను అధికారులు, సిబ్బంది పకడ్బందీగా నిర్వహించారు. -
రూ.2తో ఓటు సవాల్
[ 05-05-2024]
ఓటును సవాల్ (ఛాలెంజ్) చేసే అవకాశం పోలింగ్ కేంద్రంలో కూర్చునే ఏజెంట్కు మాత్రమే ఉంటుంది. -
రోడ్డు ప్రమాదంలో గీత కార్మికుడి దుర్మరణం
[ 05-05-2024]
రోడ్డు ప్రమాదంలో గీత కార్మికుడు మృతి చెందిన ఘటన మండలంలోని అక్కలదేవిగూడెంలో శనివారం చోటుచేసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
నిజ్జర్ హత్య కేసు.. నిందితుల అరెస్టుపై స్పందించిన ట్రూడో
-
ఇది రజనీకాంత్ స్టైల్ మూవీ కాదు: రానా ఆసక్తికర వ్యాఖ్యలు
-
‘ఆఫ్టర్ 9’ పబ్పై దాడి.. 160 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
-
మ్యాక్సీ ఆటతీరుపై కామెంట్.. పార్థివ్కు తప్పని బాడీ షేమింగ్
-
దండంతో సరి.. హామీలు మరిచారేం మరి.. స్థానిక సమస్యలపై మాట్లాడని జగన్
-
నిజం చెప్పటమే నేరమా..? 572 మంది ఉపాధ్యాయులకు నోటీసులు