ఫ్లోరైడ్పై పోరు.. నామినేషన్ల జోరు
ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలను పీడిస్తున్న ఫ్లోరైడ్ నీటి సమస్య, ఎస్ఎల్బీసీ సొరంగం పూర్తి చేసి ఫ్లోరైడ్ పీడిత గ్రామాలకు తాగునీరు ఇవ్వడం, బీళ్లుగా మారిన భూములకు సాగునీరు అందించాలనే డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ఎన్నికలను వేదికగా చేసుకుంది జల సాధన సమితి.
1996 లోక్సభ ఎన్నికల్లో 537 నామపత్రాలు దాఖలు
ఓ గ్రామంలో వార్తపత్రిక పరిమాణంలోని నమూనా బ్యాలెట్తో నిర్వహిస్తున్న ప్రచారం (పాతచిత్రం)
చౌటుప్పల్, న్యూస్టుడే: ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలను పీడిస్తున్న ఫ్లోరైడ్ నీటి సమస్య, ఎస్ఎల్బీసీ సొరంగం పూర్తి చేసి ఫ్లోరైడ్ పీడిత గ్రామాలకు తాగునీరు ఇవ్వడం, బీళ్లుగా మారిన భూములకు సాగునీరు అందించాలనే డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ఎన్నికలను వేదికగా చేసుకుంది జల సాధన సమితి. ఫ్లోరైడ్ బాధితులు, రైతులను, ఉద్యమ కార్యకర్తలను సమీకరించి 1996లో నిర్వహించిన నల్గొండ లోక్సభ ఎన్నికల్లో నామినేషన్లు వేయించింది. ఈ ఎన్నికలో 537 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులో నామినేషన్లు ఉపసంహరించుకున్నవారు, నామినేషన్లు తిరస్కరణకు గురైనవారు 57 మంది ఉన్నారు. నామపత్రాల పరిశీలన అనంతరం 480 మంది బరిలో మిగిలారు. ఇందులో 386 మంది షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డు తెగల అభ్యర్థులున్నారు. వీరిలో 60 మంది మహిళలు పోటీలో నిలవడం విశేషం. 480 మందిలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల అభ్యర్థులు ఆరుగురు మాత్రమే ఉన్నారు. అసాధారణంగా అభ్యర్థులు బరిలో నిలవడంతో ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లు చేయడానికి నెల రోజుల పాటు ఈ నియోజకవర్గంలో ఎన్నికలను ఎన్నికల సంఘం వాయిదా వేసింది. 480 గుర్తులతో ఒక పుస్తకం ఆకారంలో బ్యాలెట్ పత్రం రూపొందించారు. బ్యాలెట్ పెట్టెలు ప్రత్యేకంగా భారీ ఆకారంలో తయారు చేయించారు. 1996 మే 27న ఎన్నికలు నిర్వహించారు. నల్గొండ లోక్సభకు నిర్వహించిన ఈ ఎన్నిక జాతీయ స్థాయిలో చర్చకు, సంస్కరణలకు దారి తీసింది.
ధర్మబిక్షం
71,757 ఓట్ల ఆధిక్యంతో ధర్మభిక్షం విజయం
నల్గొండ లోక్సభ ఎన్నికలో 1996లో మొత్తం ఓటర్ల సంఖ్య 14,27,026. ఇందులో 8,51,118 మంది (59.8 శాతం) ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ పూర్తయ్యాక బ్యాలెట్ పత్రాలన్నీ లెక్కించేందుకు రెండు రోజులు పట్టింది. 480 మంది అభ్యర్థులున్న బ్యాలెట్ పత్రంలో 313 వరుస సంఖ్యలో సీపీఐ అభ్యర్థి బొమ్మగాని ధర్మభిక్షంకు కంకి, కొడవలి గుర్తు కేటాయించారు. ఆ గుర్తుపై 2,77,336 ఓట్లు పోలయ్యాయి. భాజపా అభ్యర్థి నల్లు ఇంద్రసేనారెడ్డికి 2,05,579, కాంగ్రెస్ అభ్యర్థి తిరునగరు గంగాధర్కు 1,99,282, ఎన్టీఆర్ తెదేపా అభ్యర్థి వెన్రెడ్డి నరేందర్రెడ్డికి 22,994 ఓట్లు పోలయ్యాయి. పోలైన ఓట్లలో ఆరో వంతు రాకపోవడంతో 477 మంది అభ్యర్థుల డిపాజిట్లు గల్లంతయ్యాయి.
నామినేషన్కు డిపాజిట్ పెంపు
1996, అంతకు మందు లోక్సభకు పోటీ చేయడానికి డిపాజిట్గా సాధారణ అభ్యర్థులు రూ.500, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.250, శాసనసభ సభ్యుడిగా పోటీ చేయడానికి సాధారణ అభ్యర్థులు రూ.250, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.125 చెల్లించాల్సి వచ్చేది. సమస్యలను ప్రభుత్వ దృష్టికి తెచ్చేందుకు 1996లో నల్గొండ లోక్సభ స్థానానికి, కర్ణాటక రాష్ట్రంలోని బెల్గాం, తూర్పు దిల్లీ శాసనసభ స్థానాలకు అసాధారణంగా భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేయడంతో ఎన్నికల కమిషన్ దీనిపై చర్చించి సంస్కరణలు తెచ్చింది. తర్వాతి ఎన్నికల్లో నామినేషన్ రుసుమును లోక్సభకు జనరల్ అభ్యర్థులకు రూ.500 నుంచి రూ.25 వేలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.250 నుంచి రూ.12,500, శాసనసభకు జనరల్ అభ్యర్థులకు రూ.250 నుంచి రూ.10వేలకు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.125 నుంచి రూ.5000కు పెంచింది. ఇప్పటికీ దేశమంతటా అభ్యర్థులు నాడు పెంచిన మొత్తంలో డిపాజిట్ను చెల్లించాల్సి వస్తుంది.
1996 ఎన్నికలో ఉపయోగించిన బ్యాలెట్ పత్రం, బ్యాలెట్ పెట్టె
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హస్తంలోకి ఆహ్వానం..!
[ 28-04-2024]
ఉమ్మడి జిల్లాలోని రెండు లోక్సభ స్థానాలైన నల్గొండ, భువనగిరిలో గెలుపే లక్ష్యంగా అధికార కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతోంది. రెండు స్థానాలకు ఇన్ఛార్జులుగా మంత్రి ఉత్తమ్, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి వ్యవహరిస్తున్నారు. -
పక్షం రోజుల లక్ష్యం.. ప్రచారాస్త్రాలు సిద్ధం
[ 28-04-2024]
లోక్సభ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ముగిసింది. బరిలో నిలిచే అభ్యర్థులెవరో ఇప్పటికే తేలిపోవడంతో నల్గొండ, భువనగిరి లోక్సభ స్థానాల్లో ప్రధాన పార్టీల అభ్యర్థుల ప్రచారం వేడెక్కుతోంది. -
వారు ఆడిందే ఆట.. కాసుల వేట
[ 28-04-2024]
కంచే చేను మేసినట్లుగా.. ఔషధ దుకాణాల్లో జరిగే అవినీతిని అరికట్టాల్సిన అధికారులే అక్రమాలకు పాల్పడుతున్నారు. తనిఖీల పేరుతో రూ.లక్షలు వసూళ్లు చేసుకుని రూ.కోట్ల విలువ చేసే భూములు కొనుగోలు చేసినట్లు ఇటీవల ఉన్నతాధికారుల విచారణలో వెలుగులోకి వచ్చింది. -
నిద్రలేమి.. నిండు ప్రాణాలు బలి
[ 28-04-2024]
నిద్రలేమి కారణంగానే ఈ మధ్యలో ఎక్కువ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. రహదారి వెంబడి నిలిపి ఉంచిన వాహనాలను నేరుగా వచ్చి ఢీకొట్టడం వెనక గత రాత్రి డ్రైవర్లకు నిద్ర లేకుండా ఉండటం, ఏకాగ్రత లోపించడమే ప్రధాన కారణం. -
ఆయిల్పాం తోటలకు నీటి కొరత
[ 28-04-2024]
ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని ప్రోత్సహిస్తున్న ఆయిల్పాం సాగుపై కరవు ప్రభావం పడుతోంది. భూగర్భజలాలు అడుగంటడంతో బోర్లలో నీరు అందక, ఈ తోటల్లో బిందుసేద్యం పరికరాలు సరిగా పనిచేయక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
పంచనారసింహులకు భక్తుల పూజలు
[ 28-04-2024]
పంచనారసింహులు కొలువై ఉన్న యాదాద్రి పుణ్యక్షేత్రంలో శనివారం భక్త జనుల ఆరాధనలు శాస్త్రోక్తంగా కొనసాగాయి. వేకువజామున సుప్రభాతం నిర్వహించిన పూజారులు బిందేతీర్థంతో చేపట్టిన కైంకర్యాలు ఆలయ విశిష్టతకు అనుగుణంగా కొనసాగాయి. -
ఆటాడుకుందాం..రా..!
[ 28-04-2024]
వేసవి సెలవుల్లో పిల్లలు చరవాణులకే పరిమితం కాకుండా.. వాటి నుంచి చిన్నారుల దృష్టి మళ్లించి క్రీడా నైపుణ్యం వెలికి తీసేందుకు రాష్ట్ర ప్రభుత్వం క్రీడా శిబిరాలను ఏర్పాటు చేస్తోంది. -
సంఘాలను కాదని.. సంస్థకు అప్పగించి..
[ 28-04-2024]
పురపాలక సంఘం పరిధిలో చేపట్టాల్సిన పనులకు ముందస్తుగా ఒప్పందం కుదుర్చుకోవడంలో పాలకులు విఫలమవుతున్నారు. అర్హులకు లబ్ధి చేకూరకపోగా పనులు ముందుకు సాగడం లేదు. -
లెక్కకు మించితే వేటే
[ 28-04-2024]
ఉమ్మడి నల్గొండ జిల్లాలో నల్గొండ, భువనగిరి లోక్సభ స్థానాల ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల ఖర్చులపై ఎన్నికల సంఘం కన్నేసింది. -
లోక్సభ ప్రచారంలో.. స్థానిక వ్యూహం
[ 28-04-2024]
అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన ఆరు మాసాలకే జరుగుతున్న లోక్సభ ఎన్నికలను ప్రధాన పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. ఓటరు దేవుళ్లను ప్రసన్నం చేసుకునేందుకు భువనగిరి, నల్గొండ లోక్సభ నియోజకవర్గాల పరిధిలో ప్రధాన పార్టీల అభ్యర్థులు డిజిటల్ ప్రచారాన్ని మొదలుపెట్టారు. -
ద్విసభ.. పదేళ్ల ముచ్చట
[ 28-04-2024]
లోక్సభకు 1951లో తొలిసారి ఎన్నికలు జరగగా హైదరాబాద్, ఆంధ్రా ప్రాంతానికి 1952లో జరిగాయి. మద్రాసు రాష్ట్రం పరిధిలోని ఆంధ్రా ప్రాంతానికి, హైదరాబాద్ పరిధిలోని కొన్ని ప్రాంతాలకు ఇద్దరు చొప్పున సభ్యులను ఎన్నుకునే వారు. -
మరో ఉద్యమానికి శ్రీకారం: జగదీశ్రెడ్డి
[ 28-04-2024]
ఉమ్మడి రాష్ట్రంలో 14 ఏళ్ల పోరాటం చేసి దిల్లీ పెద్దల మెడలు వంచి రాష్ట్రం సాధించిన భారాస మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టబోతుందని మాజీ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఒక్క ఫోటో .. నాలుగేళ్ల కష్టం
-
వివాదాస్పదంగా మారిన చేరిక.. నల్గొండ నేతల అభ్యంతరంతో నిలిపివేత..
-
పెళ్లి శుభలేఖపై పెంపుడు శునకాల పేర్లు
-
ఏపీలో స్టాంపు పేపర్లుండవు.. ఇక జిరాక్స్ కాపీలే!
-
సమాధాన పత్రాల్లో ‘జై శ్రీరాం’, క్రికెటర్ల పేర్లు.. ఉత్తీర్ణులు చేసిన ఆచార్యుల తొలగింపు
-
అప్పలరాజును చిత్తుగా ఓడించాలి: ఎంపీ రామ్మోహన్నాయుడు