logo

లోక్‌సభ బరిలో ధర్మ సమాజ్‌ పార్టీ

లోక్‌సభ ఎన్నికలతోపాటు సికింద్రాబాద్‌లోని కంటోన్మెంట్‌ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికలోనూ పోటీ చేస్తున్నట్లు ధర్మ సమాజ్‌ పార్టీ(డీఎస్పీ) రాష్ట్ర అధ్యక్షుడు విశారదన్‌ మహరాజ్‌ తెలిపారు.

Published : 18 Apr 2024 02:30 IST

14 మంది ఎంపీ అభ్యర్థుల ప్రకటన

సమావేశంలో మాట్లాడుతున్న డీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు విశారదన్‌ మహరాజ్‌. చిత్రంలో నేతలు కె.ప్రసాద్‌, దుర్గాప్రసాద్‌

బర్కత్‌పుర, న్యూస్‌టుడే: లోక్‌సభ ఎన్నికలతోపాటు సికింద్రాబాద్‌లోని కంటోన్మెంట్‌ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికలోనూ పోటీ చేస్తున్నట్లు ధర్మ సమాజ్‌ పార్టీ(డీఎస్పీ) రాష్ట్ర అధ్యక్షుడు విశారదన్‌ మహరాజ్‌ తెలిపారు. ఈ సందర్భంగా తమ పార్టీ నుంచి బరిలో దిగే 14 మంది ఎంపీ అభ్యర్థులతోపాటు కంటోన్మెంట్‌లో పోటీచేయనున్న అభ్యర్థి పేరు కూడా ప్రకటించారు. హైదరాబాద్‌ బర్కత్‌పురలోని పార్టీ కార్యాలయంలో బుధవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

బరిలో ఉన్నవారు..

తలారి రాంబాబు(నల్గొండ), కొంగరి లింగస్వామి(భువనగిరి), గడ్డం హరీశ్‌గౌడ్‌(హైదరాబాద్‌), రాసాల వినోద్‌ యాదవ్‌(సికింద్రాబాద్‌), బి.దుర్గాప్రసాద్‌ యాదవ్‌(మల్కాజిగిరి), తొట్ల రాఘవేంద్ర ముదిరాజ్‌(చేవెళ్ల), అన్నెల లక్ష్మణ్‌(మెదక్‌), మేకల సుమన్‌(వరంగల్‌), రవ్వ భద్రమ్మ(మహబూబాబాద్‌), గంట్లవెల్లి రాకేశ్‌(మహబూబ్‌నగర్‌), చిలువేరు శ్రీకాంత్‌(కరీంనగర్‌), కండెల సుమన్‌(నిజామాబాద్‌), టి.దేవశిఖామణి(జహీరాబాద్‌), పవార్‌ కృష్ణ(ఆదిలాబాద్‌), కంటోన్మెంట్‌ అసెంబ్లీ నియోజకవర్గం ఉపఎన్నికలో గుండాటి నర్సింగ్‌రావు పోటీ చేస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని