logo

కాంగ్రెస్‌ పార్టీనే ప్రజలకు శ్రీరామరక్ష

తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్‌ పార్టీనే శ్రీరామరక్ష అని ఎమ్మెల్యే, పార్టీ భువనగిరి లోక్‌సభ నియోజకవర్గ ఎన్నికల ఇన్‌ఛార్జి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు.

Published : 18 Apr 2024 02:55 IST

మాట్లాడుతున్న రాజగోపాల్‌రెడ్డి, చిత్రంలో ఎమ్మెల్యే వీరేశం, పార్టీ అభ్యర్థి కిరణ్‌కుమార్‌రెడ్డి

నకిరేకల్‌, న్యూస్‌టుడే: తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్‌ పార్టీనే శ్రీరామరక్ష అని ఎమ్మెల్యే, పార్టీ భువనగిరి లోక్‌సభ నియోజకవర్గ ఎన్నికల ఇన్‌ఛార్జి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. నకిరేకల్‌లో నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశంలో బుధవారం రాత్రి ఆయన మాట్లాడారు. అంతకు ముందు స్థానిక దుర్గగుడి నుంచి శ్రీనివాస ఫంక్షన్‌ హాల్‌ వరకు ప్రదర్శన నిర్వహించారు. భువనగిరి కాంగ్రెస్‌ అడ్డా అని, ఇక్కడ ఒకసారి నన్ను, మరోసారి వెంకటరెడ్డిని ప్రజలు గెలిపించారని, మరోసారి కిరణ్‌కుమార్‌రెడ్డిని గెలిపిస్తారని రాజగోపాల్‌రెడ్డి పేర్కొన్నారు. లోక్‌సభ సెగ్మెంట్‌ పరిధిలో మునుగోడులోనే భారీ మెజార్టీని సాధించేందుకు శ్రమిస్తున్నామన్నారు.

పార్టీ అభ్యర్ధి చామల కిరణ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. నకిరేకల్‌లో కార్యకర్తల ర్యాలీ, సమావేశంలో ఉత్సాహం చూసిన తర్వాత మరింత ధైర్యం వచ్చిందన్నారు. ఆచార్య కోదండరాం మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ మొదలు పెట్టిన జిల్లా సాగునీటి ప్రాజెక్టులను పదేళ్లుగా భారాస ప్రభుత్వం పూర్తి చేయకపోవడం వల్లే నేడు రైతులు సాగునీటి కష్టాలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ.. నకిరేకల్‌లో నాకు వచ్చినంత ఆధిక్యాన్ని కిరణ్‌కుమార్‌రెడ్డికి అందించి గెలిపిస్తామన్నారు. శాసనమండలి మాజీ డిప్యూటీ ఛైర్మన్‌ నేతి విద్యాసాగర్‌, డీసీసీ అధ్యక్షుడు శంకర్‌నాయక్‌, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్‌, తదితరులు పాల్గొన్నారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు