పంట అవశేషాలు కలియదున్నితే మేలు
పంట అవశేషాలు భూమిలో కలియదున్నితే కలిగే ప్రయోజనాలను శాస్త్రవేత్తలు రైతులకు వివరించారు. పంట వ్యర్థాలు కుళ్లి సేంద్రియ ఎరువుగా మారి నేలకు పోషకాలు అందించే విధానాన్ని క్షేత్ర ప్రదర్శన ద్వారా చూపారు. రుద్రూర్ వరి-చెరకు ప్రాంతీయ పరిశోధన స్థానం దత్తత
నేలలో పోషకాలు పెంచే విధానాన్ని వివరిస్తున్న శాస్త్రవేత్తలు
కోటగిరి(రుద్రూర్), న్యూస్టుడే: పంట అవశేషాలు భూమిలో కలియదున్నితే కలిగే ప్రయోజనాలను శాస్త్రవేత్తలు రైతులకు వివరించారు. పంట వ్యర్థాలు కుళ్లి సేంద్రియ ఎరువుగా మారి నేలకు పోషకాలు అందించే విధానాన్ని క్షేత్ర ప్రదర్శన ద్వారా చూపారు. రుద్రూర్ వరి-చెరకు ప్రాంతీయ పరిశోధన స్థానం దత్తత గ్రామమైన కోటగిరి మండలం హెగ్డోలిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రపంచ నేల సంరక్షణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆహార విజ్ఞాన శాస్త్ర సాంకేతిక కళాశాలతో కలిసి ప్రదర్శనలు నిర్వహించారు.
సాధారణంగా పంట వ్యర్థాలు కలియదున్నితే ఎరువుగా మారడానికి మూడు నెలలు పడుతుందన్నారు. 30-40 రోజుల్లో సేంద్రియ ఎరువుగా మార్చుకొని వినియోగించే విధానం ఉందని చెప్పారు. పంట అవశేషాలపై చల్లే మూడు రకాల ద్రావణాన్ని రాజేంద్రనగర్లోని ప్రొ.జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం అందుబాటులోకి తెచ్చిందన్నారు. రైజోబియం బ్యాక్టీరియతో శుద్ధి ప్రక్రియను చేసి చూపించారు. రైతులకు క్విజ్ పోటీ నిర్వహించి బహుమతులు అందించారు. ప్రధాన శాస్త్రవేత్త డా.బాలాజీ నాయక్, సేద్య శాస్త్రవేత్త ఫిర్దోస్ సహానా, కీటక శాస్త్రవేత్త సాయిచరణ్, రమ్య రాథోడ్, సౌందర్య పాల్గొన్నారు.
ఖర్చు తగ్గించి దిగుబడులు పెంచాలి
బోధన్ గ్రామీణం : మిరపసాగులో ఎప్పటికప్పుడు సస్యరక్షణ చర్యలు చేపడుతూ దిగుబడులు పెంచేందుకు కృషిచేయాలని రుద్రూర్ కృషివిజ్ఞాన కేంద్ర అధిపతి నవీన్కుమార్ సాగుదారులకు సూచించారు. బోధన్ మండలం మావందిఖుర్దులో శనివారం మిరప పంటను పరిశీలించి రైతులకు అవగాహన కల్పించారు. మిరపలో ప్రస్తుతం గులాబీ పురుగు ఆశించిందని దాని నివారణకు తగిన సూచనలు, సలహాలు అందించారు. అంతకుముందు జాడిజమాల్పూర్లో ప్రపంచ మృత్తిక దినోత్సవాన్ని నిర్వహించారు. ఏడీఏ సంతోష్, ఉద్యాన అధికారి పండరి, రాజేశ్వర్, నర్సయ్య, వెంకట్రెడ్డి, పలువురు కేవీకే శాస్త్రవేత్తలు, ఏఈవోలు, రైతులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం
[ 26-04-2024]
గ్రామీణ మండలం మల్లారం అటవీ ప్రాంతం దాటిన తర్వాత కొత్తపేట శివారులో గురువారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. -
కుంభకోణాలు.. కుటుంబ పార్టీలను ఓడించండి
[ 26-04-2024]
కుంభకోణాలు చేసి దోచుకున్నవారిని.. కుటుంబ పాలన సాగిస్తున్న పార్టీలను ఓడించాలని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్సింగ్ ధామీ ఓటర్లను కోరారు. -
మాధ్యమిక విద్య మిథ్య
[ 26-04-2024]
జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియట్లో విద్యార్థుల ఉత్తీర్ణత గణనీయంగా తగ్గింది. ప్రభుత్వం బుధవారం ప్రకటించిన ఫలితాల్లో జిల్లా రాష్ట్రంలో చివరిస్థానంలో నిలవడం ఆందోళన కలిగిస్తోంది. -
హామీలు నెరవేర్చాలి : పోచారం శ్రీనివాస్రెడ్డి
[ 26-04-2024]
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నేతలు ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చాలని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు. -
పనులు జరగాలి.. వెతలు తీరాలి
[ 26-04-2024]
పలు పాఠశాలల్లోని తరగతి గదులు శిథిలావస్థకు చేరాయి. ఏళ్లుగా మరమ్మతులు చేయకపోవడంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో తెలియని పరిస్థితి. -
రోడ్షోలు.. సభలు
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు కోలాహలం మధ్య నామినేషన్లు సమర్పించారు. -
నాసిరకం మాంసం విక్రయాలు!
[ 26-04-2024]
బాన్సువాడ పట్టణంలోని మటన్ మార్కెట్కు ఓ వ్యక్తి గాయపడ్డ మేకను గురువారం తీసుకొచ్చారు. దానిని విక్రయించేందుకు ఓ వ్యాపారి తక్కువ ధరకు కొనుగోలు చేశారు. -
సొంత గూటికి వడ్డేపల్లి సుభాష్రెడ్డి
[ 26-04-2024]
లోక్సభ సాధారణ ఎన్నికల సమయంలో జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. -
ముగిసిన నామినేషన్ల పర్వం
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ గురువారం ముగిసింది. ఈ నెల 18న నోటిఫికేషన్ విడుదల చేయడంతో నామపత్రాల స్వీకరణ ప్రారంభమైంది. -
తల్లిదండ్రులూ.. పిల్లలపై ఓ కన్నేయండి
[ 26-04-2024]
పిల్లలు ఆత్మహత్యలు చేసుకున్నా.. ప్రమాదంలో మృతిచెందినా వారి తల్లిదండ్రులు జీవితాంతం మానసిక క్షోభ అనుభవిస్తారు. -
గురుకులాలు ఉత్తమం.. ఎయిడెడ్లు అథమం
[ 26-04-2024]
రాష్ట్రవ్యాప్తంగా బుధవారం వెలువడిన ఇంటర్మీడియెట్ ఫలితాల్లో జిల్లా ఏటేటా తనస్థానాన్ని దిగజార్చుకుంటోంది. అందుకు అనేక కారణాలు దోహదం చేస్తున్నాయి. -
పసుపు బోర్డు పేరుతో పరిహాసం : బాజిరెడ్డి
[ 26-04-2024]
గత లోక్సభ ఎన్నికల్లో అబద్ధపు హామీతో గెలిచిన అర్వింద్ పసుపు బోర్డు పేరుతో రైతులతో పరిహాసమాడుతున్నాడని నిజామాబాద్ పార్లమెంటు భారాస అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ విమర్శించారు. -
కాంగ్రెస్తోనే సంక్షేమం : జీవన్రెడ్డి
[ 26-04-2024]
: దేశంలో మొదటిసారిగా అన్నదాతలకు పంట రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్కే దక్కుతుందని ఆ పార్టీ నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్రెడ్డి అన్నారు. -
ఓటు పోటెత్తేలా!
[ 26-04-2024]
ఓటు హక్కుతోనే ప్రజాస్వామ్యం బలోపేతమవుతుంది. వజ్రాయుధాన్ని సమర్థంగా వినియోగిస్తేనే మంచి భవిష్యత్తు కోసం పనిచేసే నాయకులు ఎన్నికవుతారు. -
జేఈఈ మెయిన్స్లో ఇందూరు విద్యార్థుల సత్తా
[ 26-04-2024]
జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) ఆధ్వర్యంలో జనవరిలో మొదటి దశ, ఏప్రిల్లో రెండోదశ ఆన్లైన్లో నిర్వహించిన జేఈఈ మెయిన్స్ ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..