logo

నిఖత్‌కు హరియాణా గవర్నర్‌ అభినందనలు

ప్రపంచ మహిళల బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలిచిన నిఖత్‌ జరీన్‌ను హరియాణా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ అభినందించారు. నిఖత్‌ తండ్రి జమీల్‌ అహ్మద్‌కు సోమవారం ఆయన ఫోన్‌ చేసి మాట్లాడారు. సంకల్పం ఉంటే..

Published : 24 May 2022 05:44 IST

ఈనాడు, నిజామాబాద్‌: ప్రపంచ మహిళల బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలిచిన నిఖత్‌ జరీన్‌ను హరియాణా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ అభినందించారు. నిఖత్‌ తండ్రి జమీల్‌ అహ్మద్‌కు సోమవారం ఆయన ఫోన్‌ చేసి మాట్లాడారు. సంకల్పం ఉంటే.. అనుకున్నది సాధించగలమని నిఖత్‌ రుజువు చేసిందన్నారు. సమాజంలోని అసమానతలను దాటి ఇంతటి విజయాన్ని సొంతం చేసుకున్న ఆమె.. ఎందరో బాలికలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందన్నారు. విశ్వవిజేతగా నిలిచి దేశానికి, తెలంగాణకు కీర్తిని తెచ్చిందని, భవిష్యత్తులో మరిన్ని పతకాలు గెలుస్తుందని ఆకాంక్షించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని