logo

నేడు, రేపు ‘ఈనాడు’ ఆటో ఎక్స్‌పో

వాహన ప్రియుల సౌకర్యార్థం ఒకేచోట విభిన్న వాహనాలను అందుబాటులో ఉంచేందుకు శని,  ఆదివారాల్లో ‘ఈనాడు’ ఆటో ఎక్స్‌పో నిర్వహిస్తోంది. పలు కంపెనీల ఆధునిక మోడళ్ల కార్లు, ద్విచక్రవాహనాలు, స్కూటర్లు ప్రదర్శనకు రానున్నాయి.

Published : 03 Dec 2022 03:41 IST

వాహన ప్రియుల సౌకర్యార్థం ఒకేచోట విభిన్న వాహనాలను అందుబాటులో ఉంచేందుకు శని,  ఆదివారాల్లో ‘ఈనాడు’ ఆటో ఎక్స్‌పో నిర్వహిస్తోంది. పలు కంపెనీల ఆధునిక మోడళ్ల కార్లు, ద్విచక్రవాహనాలు, స్కూటర్లు ప్రదర్శనకు రానున్నాయి. తక్కువ వడ్డీతో రుణ సదుపాయం కల్పించేందుకు బ్యాంకులు ముందుకొస్తున్నాయి. ప్రధాన స్పాన్సర్‌గా మారుతి సుజుకీ నెక్సా (వరుణ్‌ మోటార్స్‌), మీడియా పార్ట్‌నర్‌గా ‘ఈటీవీ’ తెలంగాణ వ్యవహరించనున్నాయి. రెండు రోజుల పాటు మారుతి సుజుకీ నెక్సా, మారుతి సుజుకీ ఎరినా (వరుణ్‌ మోటార్స్‌), టాటా మోటార్స్‌, సాయి ఎస్‌ఆర్‌కే హోండా, మాలిక్‌ కియా, ప్రకాశ్‌ హ్యుందాయ్‌, హోండా కార్స్‌, యమహా ఉదయ మోటార్స్‌, సిట్రోయెన్‌, టయోటా హర్ష ఆటో, సాయిరాం హోండా, టీవీఎస్‌ లక్ష్మి, కెనరా బ్యాంకు, యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, రెనాల్ట్‌(పీపీఎస్‌ మోటార్స్‌), హీరో(వెంకటేశ్వర), మహీంద్రా ఆటోమోటివ్‌, మారుతి సుజుకీ కమర్షియల్‌ వాహనాలు కొలువు దీరనున్నాయి.

వేదిక : కలెక్టరేట్‌ మైదానం, నిజామాబాద్‌

సమయం: ఉదయం 10 నుంచి రాత్రి 8 గంటల వరకు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని