చెత్తకో లెక్కుంది..
స్వచ్ఛ సర్వేక్షణ్లో భాగంగా ఘన వ్యర్థాల నిర్వహణ- 2016 నిబంధనలు పాటించేందుకు అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది.
నూతన విధానంలో సేకరణకు కార్యాచరణ
త్వరలో దుకాణాలకు జియోట్యాగింగ్
న్యూస్టుడే, కామారెడ్డి పట్టణం
కామారెడ్డి పట్టణంలో ప్రధాన వాణిజ్య ప్రాంతం సుభాశ్రోడ్డు
స్వచ్ఛ సర్వేక్షణ్లో భాగంగా ఘన వ్యర్థాల నిర్వహణ- 2016 నిబంధనలు పాటించేందుకు అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది. ఇంటింటి నుంచి సేకరించే చెత్తతో పాటు దుకాణాల ద్వారా ఉత్పత్తవుతున్న వ్యర్థాలకు పక్కాగా లెక్క ఉండేలా చర్యలు చేపడుతోంది. వీటి పరిమాణం ఆధారంగా వాణిజ్య కేంద్రాల నుంచి రుసుం వసూలు చేయనున్నారు.
ప్రధాన రహదారులపై ఉన్నవాటిని..
పురపాలికల్లోని వాణిజ్య ప్రాంతాల్లో చెత్త సేకరణకు ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయనున్నారు. ప్రధాన రహదారికి ఆనుకొని ఉన్న ప్రతి దుకాణాన్ని జియోట్యాగింగ్ చేసే దిశగా యంత్రాంగం అడుగులు వేస్తోంది. క్యూఆర్ కోడ్తో కూడిన సంఖ్యను కేటాయించి స్థానికత ఆధారంగా మ్యాపింగ్ చేయనున్నారు. ప్రైవేటు సంస్థలు, దుకాణాలు, ఆసుపత్రులు, సూపర్మార్కెట్లు, ఆలయాలు, చర్చిలు, మసీదులు, హోటళ్లు, రెస్టారెంట్లు, దాబాలు, మాంస విక్రయ దుకాణాలను జియోట్యాగింగ్ చేయాలని నిర్ణయించారు. ఏయే దుకాణానికి ఎంత చెత్త వస్తోంది.. వాటికి ఎంత రుసుం వసూలు చేయాలనే అంశాన్ని పరిశీలిస్తున్నారు.
ఎరువు తయారీ
బల్దియాల్లో ఉత్పత్తవుతున్న తడి చెత్తతో సేంద్రియ ఎరువు తయారు చేయాలని నిర్ణయించారు. వర్మికంపోస్టు ప్లాంటులో రైతులకు అవసరమైన ఎరువును తయారు చేసి ఆదాయం రాబట్టాలని భావిస్తున్నారు. ఇళ్ల ద్వారా వెలువడుతున్న చెత్తను వేర్వేరు డబ్బాల్లో సేకరించి డంపింగ్యార్డుకు తరలించనున్నారు.
స్వచ్ఛత దిశగా అడుగులు
జిల్లాలో మూడు బల్దియాలు స్వచ్ఛసర్వేక్షణ్- 2023లో మెరుగైన ర్యాంకులు సాధించేందుకు పోటీ పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాన రహదారుల వెంబడి చెత్త పడేయకుండా సిబ్బంది కఠినంగా వ్యవహరించనున్నారు. నిబంధనలు అతిక్రమించిన వారికి భారీగా జరిమానాలు విధించనున్నారు. దుకాణాల నుంచి చెత్త సేకరణకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసి పర్యవేక్షించనున్నారు.
మార్పునకు ప్రయత్నం
- దేవేందర్, కమిషనర్
పట్టణాల్లో చెత్త ఉత్పత్తి, సేకరణపై పర్యవేక్షణ అవసరం. ఎవరికివారు ఇళ్లలో చెత్త ఉత్పత్తిపై స్వీయ నియంత్రణ పాటించాలి. దుకాణాల వద్ద చెత్త సేకరణకు నూతన విధానాన్ని అమలు చేసేందుకు కసరత్తు చేస్తున్నాం. స్వచ్ఛత దిశగా ప్రజలు అడుగులు వేయాలి. బల్దియా సిబ్బందికి తోడ్పాటునందించాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం
[ 26-04-2024]
గ్రామీణ మండలం మల్లారం అటవీ ప్రాంతం దాటిన తర్వాత కొత్తపేట శివారులో గురువారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. -
కుంభకోణాలు.. కుటుంబ పార్టీలను ఓడించండి
[ 26-04-2024]
కుంభకోణాలు చేసి దోచుకున్నవారిని.. కుటుంబ పాలన సాగిస్తున్న పార్టీలను ఓడించాలని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్సింగ్ ధామీ ఓటర్లను కోరారు. -
మాధ్యమిక విద్య మిథ్య
[ 26-04-2024]
జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియట్లో విద్యార్థుల ఉత్తీర్ణత గణనీయంగా తగ్గింది. ప్రభుత్వం బుధవారం ప్రకటించిన ఫలితాల్లో జిల్లా రాష్ట్రంలో చివరిస్థానంలో నిలవడం ఆందోళన కలిగిస్తోంది. -
హామీలు నెరవేర్చాలి : పోచారం శ్రీనివాస్రెడ్డి
[ 26-04-2024]
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నేతలు ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చాలని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు. -
పనులు జరగాలి.. వెతలు తీరాలి
[ 26-04-2024]
పలు పాఠశాలల్లోని తరగతి గదులు శిథిలావస్థకు చేరాయి. ఏళ్లుగా మరమ్మతులు చేయకపోవడంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో తెలియని పరిస్థితి. -
రోడ్షోలు.. సభలు
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు కోలాహలం మధ్య నామినేషన్లు సమర్పించారు. -
నాసిరకం మాంసం విక్రయాలు!
[ 26-04-2024]
బాన్సువాడ పట్టణంలోని మటన్ మార్కెట్కు ఓ వ్యక్తి గాయపడ్డ మేకను గురువారం తీసుకొచ్చారు. దానిని విక్రయించేందుకు ఓ వ్యాపారి తక్కువ ధరకు కొనుగోలు చేశారు. -
సొంత గూటికి వడ్డేపల్లి సుభాష్రెడ్డి
[ 26-04-2024]
లోక్సభ సాధారణ ఎన్నికల సమయంలో జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. -
ముగిసిన నామినేషన్ల పర్వం
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ గురువారం ముగిసింది. ఈ నెల 18న నోటిఫికేషన్ విడుదల చేయడంతో నామపత్రాల స్వీకరణ ప్రారంభమైంది. -
తల్లిదండ్రులూ.. పిల్లలపై ఓ కన్నేయండి
[ 26-04-2024]
పిల్లలు ఆత్మహత్యలు చేసుకున్నా.. ప్రమాదంలో మృతిచెందినా వారి తల్లిదండ్రులు జీవితాంతం మానసిక క్షోభ అనుభవిస్తారు. -
గురుకులాలు ఉత్తమం.. ఎయిడెడ్లు అథమం
[ 26-04-2024]
రాష్ట్రవ్యాప్తంగా బుధవారం వెలువడిన ఇంటర్మీడియెట్ ఫలితాల్లో జిల్లా ఏటేటా తనస్థానాన్ని దిగజార్చుకుంటోంది. అందుకు అనేక కారణాలు దోహదం చేస్తున్నాయి. -
పసుపు బోర్డు పేరుతో పరిహాసం : బాజిరెడ్డి
[ 26-04-2024]
గత లోక్సభ ఎన్నికల్లో అబద్ధపు హామీతో గెలిచిన అర్వింద్ పసుపు బోర్డు పేరుతో రైతులతో పరిహాసమాడుతున్నాడని నిజామాబాద్ పార్లమెంటు భారాస అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ విమర్శించారు. -
కాంగ్రెస్తోనే సంక్షేమం : జీవన్రెడ్డి
[ 26-04-2024]
: దేశంలో మొదటిసారిగా అన్నదాతలకు పంట రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్కే దక్కుతుందని ఆ పార్టీ నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్రెడ్డి అన్నారు. -
ఓటు పోటెత్తేలా!
[ 26-04-2024]
ఓటు హక్కుతోనే ప్రజాస్వామ్యం బలోపేతమవుతుంది. వజ్రాయుధాన్ని సమర్థంగా వినియోగిస్తేనే మంచి భవిష్యత్తు కోసం పనిచేసే నాయకులు ఎన్నికవుతారు. -
జేఈఈ మెయిన్స్లో ఇందూరు విద్యార్థుల సత్తా
[ 26-04-2024]
జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) ఆధ్వర్యంలో జనవరిలో మొదటి దశ, ఏప్రిల్లో రెండోదశ ఆన్లైన్లో నిర్వహించిన జేఈఈ మెయిన్స్ ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..