కారుపై పొక్లెయిన్ పిడుగు!
ఓ రోడ్డు ప్రమాదం తల్లికి కొడుకు, కోడలు, కూతురిని.. ఇద్దరు చిన్నారులకు తల్లిదండ్రులను దూరం చేసింది. ఒకే కుటుంబంలో ముగ్గురు దుర్మరణం చెందిన ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది.
ముగ్గురి దుర్మరణం.. ఇద్దరికి తీవ్రగాయాలు
పొక్లెయిన్ పడటంతో నుజ్జునుజ్జైన కారు
భీమ్గల్, న్యూస్టుడే: ఓ రోడ్డు ప్రమాదం తల్లికి కొడుకు, కోడలు, కూతురిని.. ఇద్దరు చిన్నారులకు తల్లిదండ్రులను దూరం చేసింది. ఒకే కుటుంబంలో ముగ్గురు దుర్మరణం చెందిన ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. భీమ్గల్ ఎస్సై రాజ్భరత్రెడ్డి కథనం ప్రకారం... మోర్తాడ్ మండలం దొన్కల్కు చెందిన లక్ష్మి తన కుటుంబ సభ్యులతో బడాభీమ్గల్ ఎల్లమ్మ వద్దకు మొక్కులు తీర్చుకోవడానికి వెళ్లారు. కారులో మొత్తం ఏడుగురితో తిరుగు ప్రయాణమయ్యారు. మంగళవారం రాత్రి భీమ్గల్ పట్టణంలోని విద్యుత్తు ఉపకేంద్రం వద్ద ట్రాక్టర్ ట్రాలీపై ఉన్న పొక్లెయిన్ వారి కారుపై పడింది. అందులో ఉన్న లక్ష్మి కొడుకు ముప్పారపు రాజేశ్వర్(45), కోడలు జ్యోతి(42), కూతురు రమ(41) అక్కడికక్కడే మృతి చెందారు. నుజ్జునజ్జయిన కారులో నుంచి మృతదేహాలను, క్షతగాత్రులను బయటికి తీసేందుకు 108 సిబ్బంది దినేష్, నరేందర్, వంశీ గంట పాటు శ్రమించారు. తీవ్రంగా గాయపడిన లక్ష్మి, అల్లుడు చుక్కాల రాజేశ్వర్ను 108 అంబులెన్సులో నిజామాబాద్ జనరల్ ఆసుపత్రికి, మృతదేహాలను ఆర్మూర్ ప్రాంతీయాసుపత్రికి తరలించారు. ముప్పారపు రాజేశ్వర్-జ్యోతి దంపతులకు కూతురు, కొడుకు. తల్లిదండ్రులను కోల్పోయి ఆ ఇద్దరు చిన్నారులు అనాథలుగా మారారు. విగతజీవులైన తన కొడుకు, కూతురు, కోడలిని చూస్తూ.. లక్ష్మి రోదించడం స్థానికుల్ని కలిచివేసింది. రమకు ఆర్మూర్ మండలం గోవింద్పేట్కు చెందిన చుక్కాల రాజేశ్వర్తో పెళ్లైంది. ట్రాక్టర్ ట్రాలీపై నుంచి పొక్లెయిన్ ఎదురుగా వస్తున్న కారుపై ఎలా పడింది? కారు ట్రాక్టర్ ట్రాలీని ఢీకొట్టిందా? అనే కోణంలో విచారణ చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.
మంత్రి దిగ్భ్రాంతి : రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందడంపై మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. మృతి చెందిన వారి కుటుంబాలకు సంతాపం తెలిపారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భాజపా ప్రజా మద్దతు ర్యాలీ
[ 10-05-2024]
కామారెడ్డి జిల్లా కేంద్రంలో భాజపా ప్రజా మద్దతు ర్యాలీని శుక్రవారం నిర్వహించారు. -
వైద్యురాలి నిర్వాకం.. గాల్లో కలిసిపోయిన బాలింత ప్రాణం!
[ 10-05-2024]
వైద్యురాలి నిర్వాకంతో నిండు ప్రాణం గాల్లో కలిసిపోయింది. ఓ ప్రైవేటు ఆస్పత్రికి కాన్పు కోసం వచ్చిన మహిళ అర్ధంతరంగా తనువు చాలించింది.. -
కాంగ్రెస్ తోనే గ్రామాల అభివృద్ధి
[ 10-05-2024]
కాంగ్రెస్ తోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కందూరి లింబాద్రి అన్నారు. -
బసవేశ్వర్ మహారాజ్ 891వ జయంతి
[ 10-05-2024]
ఇందూర్ నగరంలో స్థానిక నాందేవాడ శివాజీ చౌక్ వద్ద వీర శైల లింగాయత్ సంఘం దుబ్బ వారి ఆధ్వర్యంలో సంతు బసవేశ్వర్ మహారాజ్ 891వ జయంతిని నిర్వహించారు. -
రక్తం కొరత
[ 10-05-2024]
ఎండలు మండిపోతున్నాయి. కళాశాలలకు సెలవులు. వేసవి తాపానికి దాతలు రక్తం ఇచ్చేందుకు ముందుకు రావడం లేదు. -
పాఠశాలల అభివృద్ధికి రూ.39.38 కోట్లు
[ 10-05-2024]
ప్రభుత్వ పాఠశాలల పర్యవేక్షణలో ‘అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ’ల పేరుతో మహిళా సంఘాల సభ్యులను భాగస్వాములను చేసి వారి సహకారంతోనే బడుల్లో మౌలిక వసతులు కల్పించాలని ప్రభుత్వం సంకల్పించింది. -
అమలుకాని చలువ పైకప్పు విధానం
[ 10-05-2024]
ఎండలు మండుతున్నాయి. మే మొదటి వారం నుంచి అమాంతంగా ఉష్ణోగ్రతలు పెరిగాయి. ఇ -
మోదీ ఉంటేనే దేశం సురక్షితం
[ 10-05-2024]
దేశం అభివృద్ధి పథంలో, సురక్షితంగా, ఆరోగ్యంగా ఉండాలంటే మళ్లీ నరేంద్ర మోదీ ప్రధాని కావాలని తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పేర్కొన్నారు. -
ప్రతి గౌడ కుటుంబానికి ఐదెకరాలు
[ 10-05-2024]
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితో మాట్లాడి ప్రతి గౌడ కుటుంబానికి ఐదెకరాల భూమి ఇప్పించేందుకు కృషి చేస్తామని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీనవన్రెడ్డి, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. -
ఆశీర్వదించండి.. సేవకుడిగా పనిచేస్తా
[ 10-05-2024]
ప్రధాని మోదీ ఇస్తానన్న రూ.15 లక్షలు, రెండు కోట్ల ఉద్యోగాలు ఎక్కడా అని భారాస ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ ప్రశ్నించారు. -
ఆ ఓటర్లే కీలకం
[ 10-05-2024]
జహీరాబాద్ లోక్సభ స్థానంలో గెలుపోటములపై మహిళ, యువ ఓటర్లు కీలక భూమిక పోషించనున్నారు. -
వయోవృద్ధులే నయం
[ 10-05-2024]
ఓటు హక్కు సద్వినియోగం చేసుకోవాలంటూ అధికారులు ఒక వైపు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. -
ఓటు పిలుస్తోంది.. రారండోయ్
[ 10-05-2024]
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలకు మరో నాలుగు రోజులే ఉంది. -
జీవన్రెడ్డి మాల్కు నోటీసులు
[ 10-05-2024]
ఆర్మూర్లోని ఆర్టీసీ స్థలంలో నిర్మించిన జీవన్రెడ్డి మాల్కు గురువారం ఆర్టీసీ అధికారులు నోటీసులు అందజేశారు. -
నినాదం.. చైతన్యం
[ 10-05-2024]
లోక్సభ ఎన్నికల్లో నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో 100 శాతం పోలింగ్ నమోదయ్యేలా అధికారులు అనేక రకాలుగా ప్రచారం చేస్తున్నారు. -
ప్రతినబూనుతున్నాం.. అమ్మానాన్నకు చెబుతాం
[ 10-05-2024]
అర్హులైన వారంతా తప్పకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలని, ఓటును ఆయుధంగా మల్చుకోవాలని చిన్నారులు సందేశాన్నిచ్చారు. -
చనిపోవాలనుకుంటున్నానని స్నేహితుడికి కాల్
[ 10-05-2024]
దోమకొండకు చెందిన యువకుడు గోత్రాల విక్రమ్ తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని మిత్రుడికి కాల్ చేశాడు.