ప్రాణం కాపాడేది.. ఆహార ప్రమాణాలే
ప్రపంచ ఆరోగ్య సంస్థ పలు అధ్యయనాలతో వెల్లడించిన వాస్తవాలు ఇవి. కల్తీ, నాణ్యత లోపించిన, హానికర మిశ్రమాలతో అసురక్షితంగా మారుతున్న ఆహార పదార్థాల చలామణిని నియంత్రించడంలో వ్యవస్థలు విఫలమవుతున్నాయి.
నేడు సురక్షిత ఆహార దినోత్సవం
న్యూస్టుడే, ఇందూరు ఫీచర్స్: ప్రపంచ ఆరోగ్య సంస్థ పలు అధ్యయనాలతో వెల్లడించిన వాస్తవాలు ఇవి. కల్తీ, నాణ్యత లోపించిన, హానికర మిశ్రమాలతో అసురక్షితంగా మారుతున్న ఆహార పదార్థాల చలామణిని నియంత్రించడంలో వ్యవస్థలు విఫలమవుతున్నాయి.
ప్రజలకు సురక్షిత ఆహారం లభించేలా చేయడం కోసం అందరిలో చైతన్యం నింపడానికి ఏటా ప్రపంచ ఆరోగ్య, ఆహార, వ్యవసాయ సంస్థలు ఏటా జూన్ 7న సురక్షిత ఆహార దినోత్సవం నిర్వహిస్తున్నాయి. ఈ సందర్భంలో నాణ్యమైన ఆహారం అందించడానికి ఆయా సంస్థల్లో ఉన్న ప్రతి ఒక్కరు బాధ్యత వహించాలని స్పష్టం చేశాయి. ఎవరెవరు ఎలా పాత్రులో పరిశీలిద్దాం..
నిర్ధారణ
ఇది ప్రభుత్వ యంత్రాంగం విధి. ఈ బాధ్యతగల శాఖల అధికారులు నిత్యం తనిఖీలతో ఆహార పదార్థాల నాణ్యత, శుభ్రత వంటివి పరిశీలించాలి. నిర్దేశిత ప్రమాణాలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. ప్రస్తుతం నిజామాబాద్ ఆహార తనిఖీ అధికారి ఇతర జిల్లాలకు ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. ఏకకాలంలో బహుళ జిల్లాలకు ప్రాతినిధ్యం వహించడం, శాఖ కార్యాలయంలో సిబ్బంది కొరత వెరసి నాణ్యత గాలిలో దీపంలా మారింది. నెలకు కనీసం 72 రకాల నమూనాలు సేకరించి పరీక్షించాల్సి ఉండగా.. సిబ్బంది కొరతతో తనిఖీలకు దిక్కులేదనే విమర్శలున్నాయి. ఈ వ్యవస్థను ప్రభుత్వం పటిష్ఠపరచాల్సిన అవసరముంది.
నిల్వ
సరకును ఉత్పత్తిదారుల నుంచి వినియోగదారులకు చేరవేసే వ్యాపారులు.. నిర్దేశిత ప్రమాణాలకు లోబడి నిల్వ, ప్యాకింగ్, శుద్ధి చేయాలి. ఇప్పుడు తక్కువ సరకుతో ఎక్కువ లాభాలు గడించాలనే ఉద్దేశంతో ఆహార వస్తువులు కల్తీ చేస్తున్నారు. నూనె, ఎరువు ఉపయోగించి పాల తయారీ, పిండి, కారంపొడి, టీ పౌడర్లో ఇతర హానికర వస్తువులు కలుపుతున్నారు. వీటికివిధానాలకు స్వస్తి పలకాలి. వ్యాపారంలో నైతిక విలువలు పాటించాలి.
తెలుసుకోవాలి
తేనె, పాల వంటి ఉత్పత్తుల్లో కల్తీని సులువుగా తెలుసుకోవచ్చని గ్రామీణ ప్రాంతాల్లో వాటిని అనుసరిస్తుంటారు. ఆయా విధానాలపై అవగాహన పెంచుకోవడం వినియోగదారుల కర్తవ్యం. కల్తీని గుర్తిస్తే ఫిర్యాదు చేసి నియంత్రణ వ్యవస్థలకు బాసటగా నిలబడాలి.
సమాజం సంఘటితం
సురక్షిత ఆహార సరఫరా గొలుసులో మంచి విధానాల కోసం సమాజం సంఘటితమవ్వాలి. అందుకు ఆయా సంఘాలుగా ఏర్పడి కల్తీలేని నాణ్యమైన ఆహారోత్పత్తులు ప్రజలకు చేరేలా చర్యలు తీసుకోవాలి.
సాగు
ఆహార ఉత్పత్తిదారులు సాగులో సురక్షిత విధానాలు అనుసరించాలి. అందుకు సేంద్రియ సాగు శ్రేయస్కరం. దిగుబడుల పెరుగుదలకు రసాయనిక ఎరువులు, క్రిమిసంహారక మందులు విచ్చలవిడి వినియోగం ఇప్పుడు ఆహార, ఆరోగ్య భద్రతను ప్రమాదంలో పడేసింది. ఆహారోత్పత్తుల్లో విషపూరిత అవశేషాలు ఉంటున్నాయని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. భూమిలోనూ పరిమితికి మించి భాస్వరం ఉందని నిజామాబాద్ మట్టి నమూనాలు పరిశీలించిన నిపుణులు తేల్చారు
16 లక్షలు సగటున రోజుకు ప్రపంచంలో సురక్షితం కాని ఆహారం తిని అస్వస్థతకు గురవుతున్నారు.
340 ఆహార జనిత వ్యాధులకు ఒక్కరోజులో బలవుతున్న అయిదేళ్లలోపు చిన్నారుల సంఖ్య.
200 డయేరియా నుంచి క్యాన్సర్ వరకు నాణ్యత లోపించిన ఆహారంతో వ్యాపిస్తున్న వ్యాధులు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏ సామాజిక వర్గం ఎటు వైపో..!
[ 05-05-2024]
లోక్సభ ఎన్నికలకు సమయం సమీపిస్తోంది. జహీరాబాద్ స్థానంలో 19 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఇక్కడ ప్రధాన పార్టీలకు చెందిన ముగ్గురు అభ్యర్థులు బరిలో నిలిచారు. -
వేధింపుల కట్టడికి అంతర్గత కమిటీలు
[ 05-05-2024]
పురపాలక కార్యాలయాల్లో, పని ప్రదేశంలో లైంగిక వేధింపులను నియంత్రించడానికి అంతర్గత కమిటీల ఏర్పాటుకు ఆ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. -
ఇందూరు భగభగ
[ 05-05-2024]
ఇందూరులో భానుడు విశ్వరూపం చూపిస్తున్నాడు. మే ఆరంభంలోనే ఎండ ప్రచండమైంది. జిల్లాలో మూడు ప్రాంతాలు రెడ్ జోన్లోకి వెళ్లాయి. -
శతశాతంతో శెభాష్ అనిపించారు
[ 05-05-2024]
ఇటీవల విడుదల చేసిన పదో తరగతి ఫలితాల్లో జంగంపల్లి మహాత్మా జ్యోతిబా ఫులే పాఠశాలకు చెందిన పది మంది విద్యార్థులు 10 జీపీఏతో సత్తా చాటారు. -
పల్లెలపైనే పార్టీల ఆశలు
[ 05-05-2024]
జహీరాబాద్ లోక్సభ స్థానంలో పాగావేసేందుకు భారాస, కాంగ్రెస్, భాజపా సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ప్రత్యర్థి పార్టీల ప్రచారసరళిని గమనిస్తూ ఎత్తుకు పైఎత్తులు వేస్తూ ప్రచారం సాగిస్తున్నాయి. -
దోస్త్కు వేళాయె..!
[ 05-05-2024]
డిగ్రీ కళాశాలల్లో 2024-25 విద్యా సంవత్సరం ప్రవేశాలకు దోస్త్(డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ) నోటిఫికేషన్ విడుదలైంది. సోమవారం నుంచి తొలి విడత రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. -
బిల్లులు ఇవ్వకుంటే ధర్నా చేస్తా
[ 05-05-2024]
పెండింగ్లో ఉన్న రెండు పడకగదుల ఇళ్ల బిల్లులు రూ.26 కోట్లు ఇవ్వకుంటే కుటుంబ సభ్యులతో కలిసి ఎన్నికల తర్వాత కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తానని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి తెలిపారు. -
‘జిల్లాను రద్దు చేస్తే ఊరుకునేది లేదు’
[ 05-05-2024]
కొత్తగా ఏర్పాటైన కామారెడ్డి జిల్లాను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రద్దు చేస్తే ఊరుకునేది లేదని మాజీ ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ హెచ్చరించారు. -
‘370 సీట్లతో భాజపా మూడోసారి అధికారంలోకి’
[ 05-05-2024]
ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో 370 సీట్లతో మూడోసారి కేంద్రంలో భాజపా అధికారం చేపట్టనుందని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి అన్నారు. -
పోలీసుల అదుపులో నిందితులు..!
[ 05-05-2024]
భిక్కనూరు పోలీస్స్టేషన్ పరిధిలో నిషేధిత మత్తు పదార్థాలు తరలిస్తున్న నలుగురు నిందితులను ప్రత్యేక పోలీసు బృందం శనివారం అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. -
పట్టపగలే దొంగలు పడ్డారు
[ 05-05-2024]
నాలుగో ఠాణా పరిధిలో పట్టపగలే చోరీ కలకలం రేపింది. అరగంట వ్యవధిలోనే ఇల్లు గుల్లచేశారు. వివరాల్లోకి వెళ్తే వినాయక్నగర్ తుల్జా భవానీ మందిరం సమీపంలో మధుసూదన్ తన కుటుంబ సభ్యులతో శనివారం మధ్యాహ్నం 12.10 గంటలకు ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లారు. -
పరీక్ష రుసుము చెల్లింపునకు అవకాశం
[ 05-05-2024]
డా బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీలో 2017 విద్యా సంవత్సరానికి ముందు డిగ్రీలో ప్రవేశం పొందిన, పునఃప్రవేశం పొందిన విద్యార్థులు బ్యాక్లాగ్ పరీక్ష రుసుము కట్టుకోవడానికి అవకాశం కల్పిస్తున్నట్లు గిరిరాజ్ కళాశాల ప్రిన్సిపల్ రామ్మోహన్రెడ్డి, అధ్యయన కేంద్రం ప్రాంతీయ సమన్వయకర్త రంజిత శనివారం ప్రకటనలో తెలిపారు. అపరాధ రుసుము రూ.200తో ఈ నెల 6 వరకు, రూ.500తో 13 వరకు అవకాశం ఉందన్నారు