logo

Nizamabad: గుండెపోటుతో ఏడో తరగతి విద్యార్థిని మృతి

నిజామాబాద్‌ జిల్లా మోపాల్‌ మండలంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్న విద్యార్థిని అదరంగి మైథిలి(12) దసరా సెలవులకు ఇంటికివచ్చిన రోజే గుండెపోటుతో మృతి చెందింది.

Published : 15 Oct 2023 07:46 IST

మైథిలి

కంజర(మోపాల్‌), న్యూస్‌టుడే: నిజామాబాద్‌ జిల్లా మోపాల్‌ మండలంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్న విద్యార్థిని అదరంగి మైథిలి(12) దసరా సెలవులకు ఇంటికివచ్చిన రోజే గుండెపోటుతో మృతి చెందింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. కంజర గ్రామానికి చెందిన అంగన్‌వాడీ ఉపాధ్యాయురాలు సాయిలక్ష్మికి గ్రెసీ, మైథిలి ఇద్దరు కుమార్తెలు. సాంఘిక సంక్షేమ గురుకులంలోనే గ్రెసీ ఇంటర్‌ ప్రథమ సంవత్సరం, మైథిలి ఏడో తరగతి చదువుతున్నారు. దసరా సెలవు కావడంతో శుక్రవారం ఇంటికి వచ్చారు. సాయంత్రం వరకు హుషారుగా కనిపించిన బాలిక రాత్రి ఒక్కసారిగా ఛాతిలో నొప్పి వస్తుందని తల్లికి చెప్పడంతో చికిత్స నిమిత్తం ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే గుండెపోటుతో విద్యార్థిని చనిపోయిందని వైద్యుడు తెలిపారు. శనివారం గ్రామంలో బాలిక అంత్యక్రియలు నిర్వహించగా.. తోటి విద్యార్థులు, పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామస్థులు కన్నీటి వీడ్కోలు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు