మరో ముగ్గురు
భాజపా మూడో జాబితాలో ఉమ్మడి జిల్లాలో మూడు నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేసింది.
బాన్సువాడ, బోధన్, నిజామాబాద్ గ్రామీణ నియోజకవర్గాలకు భాజపా అభ్యర్థుల ఎంపిక
ఈనాడు, కామారెడ్డి: భాజపా మూడో జాబితాలో ఉమ్మడి జిల్లాలో మూడు నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. మొదటి జాబితాలో నిజామాబాద్ అర్బన్, కామారెడ్డి, జుక్కల్, బాల్కొండ, అర్మూర్ నియోజకవర్గాల అభ్యర్థులను ప్రకటించారు. మూడో జాబితాలో అనూహ్యంగా బాన్సువాడ టికెట్ను యెండల లక్ష్మీనారాయణకు కేటాయించారు. బోధన్ నుంచి వడ్డీ మోహన్రెడ్డి, నిజామాబాద్ గ్రామీణానికి దినేష్కులాచారి అభ్యర్థిత్వాలు ఖరారు చేశారు. యెండల లక్ష్మీనారాయణ నిజామాబాద్ అర్బన్, ఆర్మూర్ నియోజకవర్గాల టికెట్ ఆశించినప్పటికీ అధిష్ఠానం బాన్సువాడ కేటాయించింది.
ఎల్లారెడ్డి ఒక్కటే మిగిలింది
ఉమ్మడి జిల్లాలో తొమ్మిది నియోజకవర్గాలుండగా రెండు జాబితాల్లో ఎనిమిదింటికి భాజపా అభ్యర్థులను ఖరారు చేసింది. ఎల్లారెడ్డి నియోజకవర్గం నుంచి పద్నాలుగు మంది ఆశావహులు టికెట్ కోసం పార్టీకి దరఖాస్తు చేసుకున్నారు. పైలా క్రిష్ణారెడ్డి, బైండ్ల పోశయ్య, బంగ్లా చైతన్య, బాపురెడ్డిలతో పాటు మరి కొందరు టికెట్ కోసం ప్రయత్నించారు. కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడిన వడ్డేపల్లి సుభాష్రెడ్డి రెండు రోజుల కిందట భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. నాలుగో జాబితాలో ఈయనకు పార్టీ అధిష్ఠానం టికెట్ ఇస్తానని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
- నియోజకవర్గం
- అభ్యర్థి
- విద్యార్హత
- రాజకీయ అనుభవం
- నిజామాబాద్ గ్రామీణం
- దినేష్ కులాచారి
-
సివిల్ ల్యాబ్ టెక్నీషియన్
- తెలుగుదేశం పార్టీ విద్యార్థి, యువజన విభాగాలతో పాటు రాష్ట్ర కమిటీ కార్యదర్శిగా పదవులు చేపట్టారు. జడ్పీటీసీ సభ్యుడిగా, జిల్లా ప్రణాళిక సంఘం సభ్యుడిగా పనిచేశారు. 2021లో భారాసకు రాజీనామా చేసి భాజపా తీర్థం పుచ్చుకున్నారు.
- బాన్సువాడ
- యెండల లక్ష్మీనారాయణ
- బీఎ(ఎల్.ఎల్.బి)
- ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా మొదలు పెట్టి భాజపాలో చేరి రాజకీయ జీవితం ప్రారంభించారు. భాజపా యువజన విభాగం, భాజపా జిల్లా, రాష్ట్ర శాఖల్లో వివిధ హోదాల్లో పదవులు చేపట్టారు. 1999లో నిజామాబాద్ ఎమ్మెల్యేగా పోటీచేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి చెందారు. 2009లో నిజామాబాద్ నియోజకవర్గం నుంచి అప్పటి పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్పై విజయం సాధించారు. తెలంగాణ ఉద్యమంలో భాగంగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. 2010లో జరిగిన ఉప ఎన్నికలో మరోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసి ఓటమి చెందారు.
- బోధన్
- వడ్డీ మోహన్రెడ్డి
- డిగ్రీ(బీకాం)
- తెలుగుదేశం పార్టీతో రాజకీయ జీవితం ప్రారంభించారు. నవీపేట జడ్పీటీసీ సభ్యుడిగా, జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడర్గా పనిచేశారు. రైస్మిల్లర్స్ అసోసియేషన్ జిల్లా, రాష్ట్ర, జాతీయ కార్యవర్గాల్లో పనిచేశారు. 2018-22 మధ్య కాలంలో తెరాస(భారాస)లో పనిచేశారు. 2022లో భాజపాలో చేరారు..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పల్లె బాట.. ఓట్ల వేట
[ 28-04-2024]
లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మూడు ప్రధాన పార్టీలు ప్రచారం ముమ్మరం చేశాయి. భారాస, కాంగ్రెస్ కార్నర్ మీటింగ్లతో ప్రజల్లోకి వెళ్తుండగా.. -
ఇంటికే ఓటరు చీటీలు
[ 28-04-2024]
పార్లమెంటు ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. ఒప్పటికే ఓటర్ల తుది జాబితా ప్రకటించారు. పోలింగ్ రోజు అవసరమైన పోల్ చీటీలను ఇంటింటికి పంపిణీ చేస్తున్నారు. -
ఎన్నికలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు
[ 28-04-2024]
వచ్చే నెల 13న నిర్వహించే పార్లమెంట్ ఎన్నికల పోలింగ్కు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు రిటర్నింగ్ అధికారి, నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు స్పష్టం చేశారు. -
‘పదేళ్లలో అభివృద్ధి శూన్యం’
[ 28-04-2024]
పార్లమెంటు ఎన్నికల్లో భాజపా, ఆర్ఎస్ఎస్, ఎన్డీయే కూటమిని ఓడించాలని తెలంగాణ సోషల్ డెమోక్రటిక్ ఫోరం (టీడీఎస్ఎఫ్) రాష్ట్ర కన్వీనర్ ప్రొఫెసర్ వినాయక్రెడ్డి అన్నారు. -
భారాస పేదల పార్టీ
[ 28-04-2024]
భారాస ఎప్పటికీ పేదలకు అండగా ఉంటుందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి అన్నారు. -
ఏకకాలంలో రుణమాఫీ
[ 28-04-2024]
రైతుల పంట రుణాలు ఏకకాలంలో మాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని నిజామాబాద్ లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి జీవన్రెడ్డి అన్నారు. -
సందేహాలుంటే.. ఫోన్ కొట్టండి
[ 28-04-2024]
మే 13న పార్లమెంటు ఎన్నికల్లో ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాల్లో కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నారు. బయట గోడలపై పోలింగ్ కేంద్రం, పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గ నంబర్లు వేస్తున్నారు. -
డిజిటల్ లావాదేవీలపై నిఘా
[ 28-04-2024]
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పాత జాతీయ రహదారిపై ఉన్న ఓ ప్రైవేటు బ్యాంకులో ఓ వినియోగదారుడు ఏప్రిల్ రెండో వారం నుంచి రూ.7 లక్షల మేర లావాదేవీలు జరిపారు. -
ఓటర్లలో ఎక్కువ.. ప్రాతినిధ్యంలో తక్కువ
[ 28-04-2024]
ఓటర్ల సంఖ్యలో అతివలే పురుషుల కంటే ఎక్కువగా ఉంటున్నారు. కానీ, పార్లమెంట్కు ఎంపీలుగా ప్రాతినిధ్యం వహించడంలో మాత్రం వారి సంఖ్య తక్కువగా ఉంటోంది. -
తగ్గుతుందా.. పెరుగుతుందా..?
[ 28-04-2024]
లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించేందుకు ప్రధాన రాజకీయ పార్టీలు వ్యూహాలు రూపొందించుకుని ప్రచారం చేస్తున్నాయి. జహీరాబాద్ లోక్సభ పరిధిలో మొదటిసారి త్రిముఖ పోటీ నెలకొన్న నేపథ్యంలో పోలింగ్శాతం ప్రభావంపై ఆయా పార్టీలు లెక్కలు వేసుకుంటున్నాయి. -
గెలిపిస్తే.. కామారెడ్డికి తాగునీరు తెప్పిస్తా
[ 28-04-2024]
‘గత ఎన్నికల్లో కాంగ్రెస్కు ఉమ్మడి మాచారెడ్డి మండలం భారీ మెజారిటీనిచ్చింది. పార్లమెంట్ ఎన్నికల్లోనూ పార్టీని మరింత ఆశీర్వదించాలి’ అని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్అలీ పేర్కొన్నారు. -
‘ఓర్వలేక బిల్లులు ఆపేశారు’
[ 28-04-2024]
రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా నియోజకవర్గంలో సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేక కొన్ని బిల్లులు ఆపేశారని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి అన్నారు. మోస్రా, చందూర్, వర్నిల్లో శనివారం రాత్రి ఆయన రోడ్ షో నిర్వహించారు. -
కూలి పెంచితేనే ప్రయోజనం
[ 28-04-2024]
సర్కారు బడుల్లో చదివే విద్యార్థులకు ఏకరూప దుస్తులను వచ్చే విద్యాసంవత్సరం ప్రారంభం నాటికి ఇచ్చేందుకు విద్యాశాఖ ప్రణాళిక రూపొందించింది. -
నెల రోజుల్లో చక్కెర పరిశ్రమలు తెరిపిస్తా
[ 28-04-2024]
ఎంపీగా మళ్లీ గెలిపిస్తే నెలరోజుల్లోనే చక్కెర పరిశ్రమలు తెరిపిస్తానని నిజామాబాద్ లోక్సభ భాజపా అభ్యర్థి ధర్మపురి అర్వింద్ అన్నారు. -
అన్నకు నచ్చని తమ్ముడి పెళ్లి
[ 28-04-2024]
వద్దని చెప్పినా వినకుండా తనకు నచ్చని అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని తమ్ముడిపై కోపం పెంచుకున్న అన్న..
తాజా వార్తలు (Latest News)
-
ఈ సెల్యూట్ ఆయన కోసమే.. తొలి హాఫ్ సెంచరీ అంకితం: ధ్రువ్ జురెల్
-
నా ముఖం కాదు.. మార్కులు చూడండి: ట్రోలర్లకు యూపీ టాపర్ దీటైన జవాబు
-
ఆర్చరీ వరల్డ్ కప్లో భారత్ అద్భుతం.. ఒలింపిక్ ఛాంపియన్ను ఓడించి స్వర్ణం కైవసం
-
అర్ధరాత్రి వైకాపా ఎమ్మెల్యే సోదరుడి హల్చల్.. తెదేపా సానుభూతిపరులపై దాడి
-
మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసు.. బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ అరెస్ట్
-
ఆదుకుంటానన్నావ్.. పీల్చి పిప్పి చేశావ్!!