విద్యార్థులు.. సైబర్ రక్షకులు
పెరిగిన సాంకేతికత, చరవాణులు అందరికీ చేరువై అన్ని రంగాల్లో సేవలు సులభమయ్యాయి. కానీ అదే సాంకేతికతను దుర్వినియోగం చేస్తూ వ్యక్తిగత డేటా, ప్రజల బ్యాంకు ఖాతాల నుంచి సైబర్ మోసగాళ్లు డబ్బులు అపహరిస్తున్నారు.
విద్యాశాఖ సమన్వయంతో పోలీసుల అవగాహన కార్యక్రమాలు
న్యూస్టుడే, ఏర్గట్ల: పెరిగిన సాంకేతికత, చరవాణులు అందరికీ చేరువై అన్ని రంగాల్లో సేవలు సులభమయ్యాయి. కానీ అదే సాంకేతికతను దుర్వినియోగం చేస్తూ వ్యక్తిగత డేటా, ప్రజల బ్యాంకు ఖాతాల నుంచి సైబర్ మోసగాళ్లు డబ్బులు అపహరిస్తున్నారు. పనులు ఎంత సులభంగా అవుతున్నాయో.. కొంచెం అప్రమత్తంగా లేకున్నా అంతకంటే ఎక్కువగా నష్టపోయే అవకాశముంది. ఇలాంటి నేరాలు, వాటి నివారణ చర్యలపై అవగాహన కల్పించేందుకు పోలీసులు ఎంతో కృషి చేస్తున్నారు. తెలంగాణ పోలీసు మహిళా భద్రతా విభాగం రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ సమన్వయంతో సైబర్నేరాల నివారణకు ‘సైబర్ అంబాసిడర్స్ ప్లాట్ఫారం(సీఏపీ)’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా విద్యార్థులకు శిక్షణ ఇచ్చి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.
జిల్లాలో 188 పాఠశాలల నుంచి ఎంపిక..
జిల్లాలో 188 పాఠశాలల నుంచి నలుగురి చొప్పున 752 మంది విద్యార్థులకు ఆన్లైన్లో పరీక్ష నిర్వహించి సైబర్ అంబాసిడర్లుగా ఎంపిక చేయనున్నట్లు ఆర్మూర్ డివిజన్ మహిళా భద్రతా విభాగం(షీటీమ్) కానిస్టేబుల్ విఘ్నేశ్ పోహర్ తెలిపారు. ఇప్పటికే చాలా పాఠశాలల్లో ప్రక్రియ పూర్తయినట్లు చెప్పారు. అలాగే ఒక్కో పాఠశాల నుంచి ఇద్దరు ఉపాధ్యాయులు మెంటార్లుగా ఉంటారన్నారు. వీరికి పోలీసు శాఖ పాఠశాల స్థాయిలో శిక్షణనిచ్చి ధ్రువపత్రాలు, బ్యాడ్జీలు పంపిణీ చేస్తుంది. తర్వాత వీరితో గ్రామాల్లో అవగాహన కల్పించనున్నారు.
సైబర్మోసాల గురించి వివరిస్తున్న రిషిత, వైష్ణవి
చాలా విషయాలు నేర్పించారు
- చరణ్, 9వ తరగతి విద్యార్థి.
సైబర్ భద్రత, సురక్షిత డౌన్లోడ్లు, మాల్వేర్లు, వైరస్లు, ఈ-మెయిల్ బెదిరింపులు, ఫేక్ అప్లికేషన్లను ఎలా గుర్తించడం వంటివి శిక్షణలో నేర్చుకున్నాం. గ్యాడ్జెట్ల వాడకం, అనవసర యాప్లు, ఓటీపీల గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. ప్రతి అప్లికేషన్కు బలమైన పాస్వర్డ్లను ఉపయోగించాలి.
అందరి బాధ్యత
- బస్వారెడ్డి, ఏసీపీ, ఆర్మూర్
ఆన్లైన్ మోసాలు, మహిళలు, బాలికలపై ఆన్లైన్లో వేధింపులు వంటి వాటిని నివారించేందుకు విద్యాశాఖ సహకారంతో పోలీసుశాఖ కృషి చేస్తోంది. ఇందులో భాగంగా విద్యార్థులకు శిక్షణనిచ్చి వారి గ్రామాల్లో ప్రజలకు సైబర్ నేరాలు జరుగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తోంది. నేరాలు అరికట్టాల్సిన బాధ్యత అందరిపై ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాంగ్రెస్ ఇంటింటి ఎన్నికల ప్రచారం
[ 01-05-2024]
పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మదన్మోహన్ ఆదేశాల మేరకు నాయకులు నాగిరెడ్డిపేట మండలంలో ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
‘పది’లమైన ఫలితాలు
[ 01-05-2024]
పదో తరగతి ఫలితాల్లో ఈ సారి 14వ స్థానంలో నిలిచింది. మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకు పరీక్షలు నిర్వహించగా మంగళవారం ఫలితాలు విడుదలయ్యాయి. జిల్లాలో 11,144 మంది బాలురు, 10,714 బాలికలు మొత్తంగా 21858 మంది పరీక్షలకు హాజరయ్యారు. -
పదిలో కాస్త తడబడి
[ 01-05-2024]
జిల్లాలో మంగళవారం విడుదలైన పదో తరగతి ఫలితాల్లో గతేడాది కన్నా ఈ సారి వెనుకబడ్డారు. గతేడాది 93.32 శాతం ఉత్తీర్ణత కాగా ఈ సారి 0.61 శాతం తగ్గి 92.71కి పడిపోయింది. రాష్ట్రస్థాయిలో కామారెడ్డి జిల్లాకు గతేడాది 7వ ర్యాంకు దక్కగా ఈ సారి 19కి చేరింది. -
విమర్శల జోరు... కేరింతల హోరు
[ 01-05-2024]
మెదక్ జిల్లా అల్లాదుర్గం చిల్వేర్ ఐబీ చౌరస్తాలో మంగళవారం మెదక్-జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గాల భాజపా విశాల్ జనసభలో కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్న విధానాలను ప్రధాని నరేంద్రమోదీ తీవ్రంగా దుయ్యబట్టారు. -
న్యాయం చేయాలని గుత్తేదారు నిరసన
[ 01-05-2024]
తాను చేపట్టిన పనులకు బిల్లులు ఇవ్వకుండా పంచాయతీ అధికారులు రెండేళ్లుగా ఇబ్బందులు పెడుతున్నారని ఓ గుత్తేదారు పంచాయతీ కార్యాలయంలో అధికారులు ఉండగా.. గేట్కు తాళం వేసిన ఘటన బీర్కూర్ మండలకేంద్రంలో చోటుచేసుకుంది. -
పరిధి దాటింది.. బిల్లు వచ్చింది
[ 01-05-2024]
ప్రభుత్వం గృహజ్యోతి పథకం కింద తెల్లరేషన్కార్డులు కలిగిన లబ్ధిదారులకు నెలకు 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్తు సరఫరా చేస్తోంది. వీరికి శూన్య బిల్లులు అందజేస్తున్నారు. ఉష్ణోగ్రతలు 44-45 డిగ్రీలకు చేరడంతో ప్రజలు ఉక్కపోతలతో అల్లాడుతున్నారు. -
దడ పుట్టిస్తున్న వడగాలులు
[ 01-05-2024]
జిల్లాలో మంగళవారం ఎండ మండిపోయింది. భానుడు తన ప్రతాపాన్ని రోజురోజుకూ పెంచుతుండడంతో వడగాలులు దడ పుట్టిస్తున్నాయి. -
ఇంటి వద్ద ఓటేసేది 1,758 మంది
[ 01-05-2024]
నడవలేని స్థితిలో ఉన్న దివ్యాంగులు, 85 ఏళ్లు పైబడిన వృద్ధులకు పార్లమెంటు ఎన్నికల్లో ఇంటి వద్దే ఓటు వేసే అవకాశం కల్పించారు. కర్ణాటకలో ఈ పద్ధతి సత్ఫలితం ఇవ్వడంతో ఎన్నికల సంఘం మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మనవద్ద ప్రవేశపెట్టింది. -
‘ఆ రెండు పార్టీలు ఒక్కటే’
[ 01-05-2024]
కాంగ్రెస్, భాజపా ఒక్కటేనని భారాస నిజామాబాద్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. మంగళవారం భారాస జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్రావు, జడ్పీ ఛైర్పర్సన్ దావ వసంత, ఎమ్మెల్సీ ఎల్.రమణ, ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్, మాజీ మంత్రి జి.రాజేశంగౌడ్, మాజీ మార్క్ఫెడ్ ఛైర్మన్ లోక బాపురెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. -
బలహీన వర్గాలకు అండగా కాంగ్రెస్
[ 01-05-2024]
బడుగు బలహీన వర్గాలకు తమ పార్టీ అండగా ఉంటుందని నిజామాబాద్ పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి జీవన్రెడ్డి తెలిపారు. -
‘యూనిఫాం సివిల్ కోడ్తో ఇబ్బంది లేదు’
[ 01-05-2024]
యూనిఫాం సివిల్ కోడ్ అమల్లోకి వస్తే దేశంలో ముస్లింలకు ఎలాంటి ఇబ్బంది ఉండదని ఎంపీ అర్వింద్ భరోసా ఇచ్చారు. మోదీ తీసుకున్న ఈ నిర్ణయం ముస్లిం మహిళలకు సంతోషాన్నిచ్చిందన్నారు. -
పదిలో మెరిశారు
[ 01-05-2024]
రాష్ట్ర విద్యాశాఖ మంగళవారం విడుదల చేసిన పదో తరగతి ఫలితాల్లో జిల్లాకు చెందిన విద్యార్థులు ప్రతిభ చాటారు. వివిధ ప్రభుత్వ పాఠశాలలకు చెందిన బాలబాలికలు పది జీపీఏ పాయింట్లు సాధించారు.
తాజా వార్తలు (Latest News)
-
క్యాన్సర్ బాధితుడికి జాక్ పాట్.. లాటరీలో రూ.10వేల కోట్లు
-
పంత్ 4 నెలల్లో 16 కేజీలు తగ్గాడు.. కేవలం 5ml ఆలివ్ ఆయిల్ వాడేవాడు!
-
పాకిస్థాన్లో 5 లక్షల సిమ్ కార్డులు బ్లాక్.. ఎందుకో తెలుసా?
-
ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ మోసం.. ఏపీ సహా 10రాష్ట్రాల్లో సీబీఐ దాడులు
-
కెప్టెన్గా మార్ష్.. యంగ్ సెన్సేషన్కు నో ఛాన్స్.. ఆసీస్ జట్టు ఇదే!
-
‘రామాయణ’లో పాత్ర..రూమర్స్పై లారా దత్తా కామెంట్స్