పెట్రోలు, డీజిల్కు కోత
ఉమ్మడి జిల్లాల్లో ఓ ప్రధాన ఆయిల్ కంపెనీకి చెందిన కొన్ని బంకుల్లో గురువారం రాత్రి నుంచే పెట్రోలు, డీజిల్ నిల్వలు నిండుకుంటున్నాయి. విశాఖ కేంద్రంగా పనిచేసే సదరు కంపెనీ ఐదు జిల్లాలకు చమురు సరఫరా చేసే డిపోను గురువారం మధ్యాహ్నం 12 గంటల వరకు తెరవలేదు.
బంకుల్లో నిండుకుంటున్న నిల్వలు
విజయనగరం కలెక్టరేట్, న్యూస్టుడే: ఉమ్మడి జిల్లాల్లో ఓ ప్రధాన ఆయిల్ కంపెనీకి చెందిన కొన్ని బంకుల్లో గురువారం రాత్రి నుంచే పెట్రోలు, డీజిల్ నిల్వలు నిండుకుంటున్నాయి. విశాఖ కేంద్రంగా పనిచేసే సదరు కంపెనీ ఐదు జిల్లాలకు చమురు సరఫరా చేసే డిపోను గురువారం మధ్యాహ్నం 12 గంటల వరకు తెరవలేదు. తర్వాత తెరిచి కంపెనీ సొంత అవుట్లెట్లకు మాత్రమే 25-30 వరకు లోడులు పంపినట్లు తెలిసింది. తర్వాత డీలర్ల నుంచి వ్యతిరేకత వస్తుందనే ఉద్దేశంతో ఒక్కో జిల్లాకు కేవలం 5-6 లోడుల చొప్పున సరఫరా చేసింది. విజయనగరం, బొబ్బిలి, సాలూరు, పార్వతీపురం తదితర ప్రాంతాలకు కనీసం ఒక్క లోడు కూడా రాలేదు. ముందు రోజు డబ్బులు చెల్లించినప్పటికీ సరఫరా చేయలేదని ఓ పెట్రోలు బంకు యజమాని ‘న్యూస్టుడే’కు తెలిపారు. గురువారం రాత్రికో, శుక్రవారం ఉదయానికో తమ వద్దనున్న నిల్వలు పూర్తిగా నిండుకుంటాయని వివరించారు.
తెరపైకి రేషన్ విధానం
ఉమ్మడి విజయనగరం జిల్లాలో 147 వరకు వివిధ బంకులు ఉన్నాయి. ఇందులో ప్రస్తుతం సరఫరా ఆగిన సదరు కంపెనీ బంకులు 32 వరకు ఉంటాయి. వీటి డీలర్లు ఒక లోడు (12 వేల లీటర్లు)కు రూ.14 లక్షలు కట్టి పెట్రోలు, డీజిల్ కొనుగోలు చేస్తుంటారు. గతంలో ముందుగా డబ్బులు చెల్లించకపోయినా కంపెనీలు సరఫరా చేసేవి. తర్వాత అడ్వాన్స్ విధానం తీసుకొచ్చాయి. ప్రస్తుతం రేషన్ కోటా అంటూ కొత్త విధానాన్ని తెరపైకి తెచ్చాయి. గత డిసెంబరులో ఎంతయితే బంకుల్లో వినియోగం అయిందో అందులో 80 శాతమే ఇస్తామంటూ మెలిక పెట్టాయి. గత నెలలో లక్ష లీటర్లు విక్రయిస్తే.. ఇప్పుడు కేవలం 80 వేల లీటర్లే ఇస్తామని చెబుతున్నాయి. ఆ కోటా దాటిపోతే ఈ నెలకు ఇక ఇవ్వలేమని తేల్చి చెప్పేస్తున్నారని బంకుల యజమానులు గగ్గోలు పెడుతున్నారు. కోటా విషయం నెల మొదటి వారంలో చెబితే ఏదోలా సర్దుబాటు చేసుకుంటామని.. ఇప్పటికిప్పుడు చెబితే వ్యాపారం ఎలా చేయగలమని ప్రశ్నిస్తున్నారు. అడ్వాన్స్ ఇస్తున్నా లోడులు పంపించడం లేదని వాపోతున్నారు. ఈ నేపథ్యంలో బంకుల యజమానులంతా శుక్రవారం విజయనగరం కలెక్టర్ సూర్యకుమారిని కలసి తమ సమస్య విన్నవించుకునేందుకు సిద్ధమవుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ ‘మిత్ర’ ద్రోహం
[ 01-05-2024]
‘జగన్ మీ బిడ్డ.. ఎన్నికలప్పుడు ఒకలా.. ఎన్నికలైన తర్వాత మరోలా.. ఉండేవాడు కాదు. మీ బిడ్డకు నిజాయతీ ఉంది. -
నేనున్నానన్నావ్బొబ్బిలిని వదిలేశావ్
[ 01-05-2024]
అబద్ధపు హామీలు.. కపట ప్రేమ కురిపించి.. ఎన్నికల ముందు పాదయాత్రలో ప్రసంగాలు చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి గద్దె ఎక్కిన తర్వాత నిజస్వరూపం బయటపెట్టారు. -
బొబ్బిలి ఉత్తర కోట వద్ద జగన్ సభ
[ 01-05-2024]
ఎన్నికల ప్రచారంలో భాగంగా బొబ్బిలిలో సీఎం జగన్మోహన్రెడ్డి పర్యటన బుధవారం ఖరారైంది. ముందుగా చంద్రబాబు ప్రజా సంకల్పయాత్ర జరిగిన చోట సభాస్థలం ఏర్పాటుకు సన్నాహాలు చేశారు. -
తొలిరోజు నుంచీ పోలీసుల హడావుడి
[ 01-05-2024]
సీఎం జగన్ సిద్ధం సభ బుధవారం ఉదయం 10 గంటలకు బొబ్బిలిలో జరగనుంది. -
అప్పన్న సన్నిధిలో పూసపాటి కుటుంబం
[ 01-05-2024]
సింహాచలం దేవస్థానం దివంగత అనువంశిక ధర్మకర్త పి.వి.జి.రాజు శత జయంతిని పురస్కరించుకుని ఆయన కుమారుడు, ప్రస్తుత అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు కుటుంబ సమేతంగా మంగళవారం సింహాద్రి అప్పన్న స్వామిని దర్శించుకున్నారు. -
అవ్వాతాతలతో.. సర్కార్ పింఛనాట!
[ 01-05-2024]
వృద్ధులతో వైకాపా సర్కార్ పింఛనాట ఆడుతోంది. సచివాలయ సిబ్బంది ద్వారా ఇంటికి వెళ్లి పింఛను సొమ్ము అందించే వెసులుబాటు ఉన్నా.. పండుటాకులను ఇబ్బందులకు గురి చేస్తోంది. -
ఓ వినాశకారి.. ఈ వారధులు చూడోసారి
[ 01-05-2024]
ఐదేళ్ల వైకాపా పాలనలో భూతద్దం పెట్టి వెతికినా అభివృద్ధి కనపడడం లేదు.. ఇన్నిరోజులూ మాటలతోనే బతికేసిందీ ప్రభుత్వం.. హామీల నీటిమూటలతో ప్రజలను ముంచేసింది.. -
ప్రతిపక్షాలపై కక్ష.. పండుటాకులకు శిక్ష
[ 01-05-2024]
పింఛన్ల పంపిణీ విషయంలో ప్రభుత్వం పండుటాకులతో ఆటలాడుకుంటోంది. నెలకో మాట చెప్పి.. వారిని అష్టకష్టాలు పెడుతోంది.. ఆ నెపాన్ని ప్రతిపక్షాలపై నెట్టేసి ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తోంది. -
సంక్షేమ పథకాల పేరుతో జగన్ మభ్యపెట్టారు
[ 01-05-2024]
జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో సంక్షేమ పథకాల పేరుతో ప్రజలను మభ్యపెట్టి వారి చేతికి చిప్ప ఇస్తున్నారంటూ తెలగ, బలిజ, కాపు దక్షిణ భారత కన్వీనర్ దాసరి రాము ఆవేదన వ్యక్తం చేశారు. -
ఎమ్మెల్యే స్వగ్రామంలో జయకృష్ణకు బ్రహ్మరథం
[ 01-05-2024]
పాలకొండ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి(వైకాపా) స్వగ్రామం వండువలో కూటమి అభ్యర్థి నిమ్మక జయకృష్ణకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. -
సొమ్మసిల్లిన సంధ్యారాణి
[ 01-05-2024]
ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న తెదేపా సాలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిని గుమ్మిడి సంధ్యారాణి ఎండ వేడికి తట్టుకోలేక సొమ్మసిల్లి పడిపోయారు. మంగళవారం ఆమె మక్కువ మండలంలోని పెద ఊటగెడ్డ గ్రామంలో ప్రచారం చేపట్టారు.
తాజా వార్తలు (Latest News)
-
ప్రపంచం ఇలా ఎందుకు ఉండలేకపోతోంది..!: ఆనంద్ మహీంద్రా
-
మరో ‘బాహుబలి’ వచ్చేస్తోంది.. క్రేజీ అప్డేట్ ఇచ్చిన రాజమౌళి
-
నిజమే.. ఆర్థిక సవాళ్లు ఎదుర్కొంటున్నాం : చైనా
-
ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్.. గెలాక్సీ ఎస్23పై ₹20వేలు డిస్కౌంట్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (01/05/24)
-
సత్తా చాటిన ‘పొలిమేర 2’, ‘ఉస్తాద్’.. ఉత్తమ నటుడిగా నవీన్ చంద్ర