ఎమ్మెల్యే సారూ..90 రోజుల్లో ఇల్లెక్కడ
నిజంగా ప్రభుత్వం ఇస్తుందేమోనని కొందరు స్థలం కోసం, ఇంకొందరు సొంత స్థలంలో ఇళ్లు కట్టుకుంటామని ముందుకొచ్చారు. విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో 30 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు.
పేదల గూడుకు.. ‘కోడ్’ దెబ్బ!
30 వేల దరఖాస్తులు పెండింగ్
ఇది ముమ్మాటికీ ప్రభుత్వ నిర్లక్ష్యమే
బొబ్బిలి ఐటీఐ కాలనీ వద్ద జగనన్న కాలనీ
నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు పథకంలో గృహం కోసం దరఖాస్తు చేసుకున్న వారికి 90 రోజుల్లోగా మంజూరు చేస్తాం
ప్రభుత్వం, వైకాపా ప్రజాప్రతినిధులు
న్యూస్టుడే, విజయనగరం అర్బన్: నిజంగా ప్రభుత్వం ఇస్తుందేమోనని కొందరు స్థలం కోసం, ఇంకొందరు సొంత స్థలంలో ఇళ్లు కట్టుకుంటామని ముందుకొచ్చారు. విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో 30 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. ప్రభుత్వం నాన్చుతూ రావడంతో ఇంతలో ఎన్నికల కోడ్ వచ్చింది. దీంతో ఎదురు చూసిన లబ్ధిదారులంతా నిరాశకు గురికావాల్సి వస్తోంది.
ఎన్నికలు దగ్గరకొస్తున్నందున కొత్తగా ఇళ్లు మంజూరు చేస్తామని రెండు జిల్లాల నుంచి ప్రజాప్రతినిధులు ప్రజలకు హామీ ఇచ్చారు. ప్రభుత్వం కూడా మంజూరుకు సిద్ధంగా ఉందంటూ నమ్మించారు. ఆ మేరకు ఇప్పటికే మంజూరై పనులు ప్రారంభం కాని లబ్ధిదారులవి రద్దు చేసి, వారి స్థానంలో కొత్త దరఖాస్తుదారుల కోసం ప్రతిపాదనలు, అక్టోబరు నెలాఖరు నాటికి డీపీఆర్ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఆ మేరకు అర్హుల నుంచి వచ్చిన దరఖాస్తులు, రద్దు చేయాల్సినవి రెండు రూపాల్లో ప్రతిపాదనలు సిద్ధం చేశారు.
- విజయనగరం జిల్లాలో ఇంకా 16,336 మంది మంజూరు కోసం అర్హులుగా గుర్తించారు. తొలి విడతలో మంజూరైన వాటిలో 6,307 రద్దు కోసం ప్రతిపాదించారు.
- మన్యం జిల్లాలో 11,823 మందిని మంజూరు కోసం అర్హులుగా గుర్తించారు.
తొలివిడతలో రెండు జిల్లాల్లో 1,05,269 ఇళ్లు మంజూరు చేశారు. ఇప్పటికీ 50,341 మాత్రమే పూర్తయ్యాయి. తర్వాత అర్హులైన వారు సచివాలయంలో దరఖాస్తు చేసుకుంటే 90 రోజుల్లో గృహం మంజూరు చేస్తామని నమ్మబలికారు. అప్పట్లో స్థానిక ప్రజాప్రతినిధుల కోరిక మేరకు రాజాం, చీపురుపల్లి, గజపతినగరం నియోజకవర్గాలకు రెండో విడతగా కొన్నింటిని మాత్రమే మంజూరు చేశారు.
గృహ ప్రవేశాలు ఇక లేనట్లే..
సామూహిక గృహ ప్రవేశాలు ఇప్పట్లో లేనట్లే. ప్రభుత్వం రెండో విడత సామూహిక గృహ ప్రవేశాలకు ఉమ్మడి జిల్లాలో 26,485 ఇళ్లను లక్ష్యంగా నిర్దేశించింది. విజయనగరం జిల్లాలో 16,228 గృహాలకు 2,161, మన్యంలో 10,257 నిర్మాణాలకు వెయ్యి వరకే పూర్తయినట్లు గణాంకాలను బట్టి తెలుస్తోంది. ఎన్నికల నియమావళి అమల్లోకి రావడంతో కొత్తగా మంజూరు ఉండదని గృహ నిర్మాణ సంస్థ పీడీ శ్రీనివాసరావు తెలిపారు. గృహ ప్రవేశాలకు ఇంకా నిర్మాణాలు పూర్తి కావాల్సి ఉందని చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అన్నను మించిన అన‘కొండ’లు
[ 29-04-2024]
మృత్యుదూతగా పేరొందాడు నాటి యమకింకరుడు.. కంకరను బొక్కేసే నాయకులను వెనకుండి నడిపిస్తున్నాడు నేటి యమకంకరుడు జగన్.. ఆయన అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అదేపనిగా తవ్వకాలు ప్రారంభించిన కొందరు కేటుగాళ్లు ఈ ఐదేళ్ల కాలంలో పెద్దపెద్ద కొండలనే కరిగించేశారు. -
సర్కారు వారి గూడు పుఠాణి
[ 29-04-2024]
ఐదేళ్ల పాలన పూర్తయింది.. అయినా చాలా చోట్ల నిర్మాణాలు పూర్తి చేయలేదు. ఎన్నికల ముందు విజయనగరం, సాలూరులో హడావుడిగా కొన్ని చోట్ల అప్పగించి చేతులు దులుపుకొన్నారు. -
జగన్.. ఈ పాపం నీదే
[ 29-04-2024]
విజయనగరం జిల్లా వంగర, మన్యం జిల్లాలోని బలిజిపేట మండలాల్లో ఉన్న 17 గ్రామాలకు ప్రధాన సాగునీటి వనరును నేను.. దాదాపు 8 వేల ఎకరాలకు పైగా తడివ్వాల్సిన బాధ్యత నాది.. నా ఆయకట్టు పరిధిలో బంగారం పండే పొలాలున్నాయి.. -
రాష్ట్ర భవిష్యత్తు కోసమే కూటమి
[ 29-04-2024]
రాష్ట్ర భవిష్యత్తు కోసమే మూడు పార్టీలు కలిసి పనిచేస్తున్నాయని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు పూసపాటి అశోక్గజపతిరాజు అన్నారు. ఆదివారం రాత్రి విజయనగరంలోని పుత్సలవీధి, పూల్బాగ్ కాలనీల్లో నిర్వహించిన బహిరంగ సభల్లో ఆయన మాట్లాడారు. -
ప్రభుత్వ వైద్య రంగాన్ని బలోపేతం చేయాలి
[ 29-04-2024]
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ వైద్య రంగాన్ని బలోపేతం చేయాలని, అదే సమయంలో ప్రైవేటు వైద్యాలయాలను ఆదుకోవాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) జాతీయ అధ్యక్షుడు డా.ఆర్వీ.అశోకన్ అన్నారు. -
ఓటు వినియోగంతో ప్రశ్నించే హక్కు
[ 29-04-2024]
రాబోయే ఎన్నికల్లో ప్రతిఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, అప్పుడే నాయకులను ప్రశ్నించే హక్కు లభిస్తుందని మెప్మా సీఎంఎం సన్యాసిరావు అన్నారు. -
సమన్వయంతో పనిచేయాలి
[ 29-04-2024]
ఎన్నికల సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారిణి, కలెక్టర్ నాగలక్ష్మి ఆదేశించారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో ఆదివారం జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. -
5, 6, 7వ తేదీల్లో పోస్టల్ బ్యాలెట్
[ 29-04-2024]
సాధారణ ఎన్నికల నిర్వహణలో భాగంగా పోలింగ్ సిబ్బందికి విధుల కేటాయింపు రెండో విడత ప్రక్రియ ఆదివారం పూర్తి చేశారు. -
గొంతు తడిపే ఆలోచనుందా..?
[ 29-04-2024]
వేసవి ఆరంభంతోనే ఆ 44 గ్రామాల్లో దాహార్తి మొదలవుతుంది. నీటి కోసం కోటి పాట్లు పడాల్సిన పరిస్థితి. తోడుదామంటే బావుండదు.. వెళ్దామంటే బోరు కనిపించదు.. -
తెదేపా విశాఖ ఉత్తర పరిశీలకుడిగా రవిశేఖర్
[ 29-04-2024]
విశాఖ తెదేపా ఉత్తర నియోజకవర్గ పరిశీలకుడిగా సువ్వాడ రవిశేఖర్ను ఆ పార్టీ అధిష్ఠానం ఆదివారం నియమించింది. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నియోజకవర్గం పరిశీలకుడిగా ఆయన ఉన్నారు. -
కంకర గుటకాయ స్వాహా
[ 29-04-2024]
కొండలు.. గుట్టలు.. అనే తేడా లేదు.. ఎక్కడ మట్టి కనిపిస్తే అక్కడ తవ్వేస్తాం.. ఎర్రమట్టిని అమ్మేస్తాం.. అడిగితే దౌర్జన్యానికి దిగుతాం.. అన్న రీతిలో నడుస్తోంది గరివిడి, గజపతినగరం నియోజకవర్గాల్లో అక్రమ తవ్వకాల పరిస్థితి. -
ఇళ్లన్నావ్.. రోడ్డున పడేశావ్
[ 29-04-2024]
పేదల సొంతింటి కల నెరవేరుస్తామని ఆశలు పెంచి, హామీలు గుప్పించిన జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన తర్వాత మోసం చేశారు. ఐదేళ్లుగా సొంత గూడులేని వారి గోడును పట్టించుకోకుండా నిర్లక్ష్య వైఖరి అవలంబించారు. -
చంద్రబాబుతోనే సంక్షేమం
[ 29-04-2024]
రాష్ట్రంలో ప్రజల సంక్షేమం చంద్రబాబుతోనే సాధ్యమని కూటమి అభ్యర్థి బేబినాయన అన్నారు. రానున్న ఎన్నికల్లో గెలిపించాలని కోరారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కల్కి ఆ ఇంగ్లీష్ మూవీకి కాపీనా? నాగ్ అశ్విన్ రిప్లై ఇదే!
-
లైంగిక వేధింపుల కేసు.. ప్రజ్వల్ను సస్పెండ్ చేస్తాం - జేడీఎస్
-
30 వారాల గర్భవిచ్ఛిత్తి కేసు.. తీర్పును వెనక్కి తీసుకున్న ‘సుప్రీం’
-
మహీంద్రా నుంచి ఎక్స్యూవీ 3XO.. ధర ₹7.49 లక్షలు
-
ప్రేమలో విఫలమైతే అలా చేయొద్దు: పూరి జగన్నాథ్