logo

ఘనంగా తెదేపా ఆవిర్భావ దినోత్సవం

తెలుగుదేశం పార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని బలిజిపేట పార్టీ కార్యాలయంలో శుక్రవారం పార్టీ మండల అధ్యక్షుడు పెంకి వేణుగోపాలనాయుడు పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు.

Updated : 29 Mar 2024 17:39 IST

బలిజిపేట: తెలుగుదేశం పార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని బలిజిపేట పార్టీ కార్యాలయంలో శుక్రవారం పార్టీ మండల అధ్యక్షుడు పెంకి వేణుగోపాలనాయుడు పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. ఇదే సమయంలో కార్యకర్తలతో కలసి జెండాకు వందనం చేశారు. అనంతరం పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో వేణుగోపాలనాయుడు మాట్లాడుతూ.. గ్రామ స్థాయిలోని కార్యకర్తలంతా తెదేపా అభ్యర్థి బోనెల విజయచంద్ర విజయానికి కృషి చేయాలన్నారు. తెదేపా అమలు చేయనున్న సూపర్‌సిక్స్‌ పథకాలపై అవగాహన కల్పించాలన్నారు. ఈ అయిదేళ్లపాటు వైకాపా పాలన వల్ల ప్రజలకు జరిగిన నష్టాన్ని తెలియజేసి, అరాచకపాలనను అంతమొందించేందుకు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో మండల సీనియర్‌ నాయకులు రామ్మోహన్‌నాయుడు, సాధు రాంబాబు, బంకపల్లి సింహాచలంనాయుడు, గుల్ల బాబ్జి, మర్రాపు సూర్యనారాయణ, సాలీల రామారావు, పడాల నారాయణరావు, భోగ రామారావు, శ్రీనివాసరావు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని