logo

4న వారాహి యాత్ర

ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ చేపట్టిన వారాహి యాత్ర ఈ నెల 4న నెల్లిమర్ల నియోజకవర్గంలో నిర్వహించనున్నారు.

Published : 30 Mar 2024 03:02 IST

ఈనాడు, విజయనగరం: ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ చేపట్టిన వారాహి యాత్ర ఈ నెల 4న నెల్లిమర్ల నియోజకవర్గంలో నిర్వహించనున్నారు. తెదేపా, జనసేన, భాజపా పొత్తులో భాగంగా జనసేనకు దక్కిన ఈ స్థానం నుంచి లోకం నాగమాధవిని అభ్యర్థిగా ప్రకటించారు. కూటమి అభ్యర్థి తరఫున ప్రచారానికి జనసేనాని పవన్‌ రానున్నారు. ఈ యాత్రను విజయవంతం చేయడానికి కూటమిలోని పార్టీలన్నీ సమష్టిగా కృషి చేయనున్నాయి. ఇప్పటికే ఆయా పార్టీ నాయకులు సమావేశమై చర్చించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని