రాష్ట్రాభివృద్ధికి కూటమి గెలవాలి
రాష్ట్రంలో రాజకీయం కోడికత్తి నుంచి ప్రారంభమై గులకరాయి వరకు వచ్చింది. ఇటువంటి వారిని ఇంటికి పంపించకపోతే ప్రజలు నష్టపోతారు. ఇవన్నీ చౌకబారు రాజకీయాలు.
తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు అశోక్గజపతిరాజు
గాజులరేగ సభలో మాట్లాడుతున్న అశోక్
రాష్ట్రంలో రాజకీయం కోడికత్తి నుంచి ప్రారంభమై గులకరాయి వరకు వచ్చింది. ఇటువంటి వారిని ఇంటికి పంపించకపోతే ప్రజలు నష్టపోతారు. ఇవన్నీ చౌకబారు రాజకీయాలు. అయిదేళ్లకొకసారి వచ్చే ఎన్నికల్లో మంచి వ్యక్తులను ఎన్నుకోవాలి.
- అశోక్గజపతిరాజు
విజయనగరం అర్బన్, న్యూస్టుడే: రాష్ట్రాభివృద్ధికి కూటమిని గెలిపించాలని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు పూసపాటి అశోక్ గజపతిరాజు కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం గాజులరేగ, కణపాకలో నిర్వహించిన బహిరంగ సభల్లో మాట్లాడారు. ఎవరి వల్ల రాష్ట్రం అభివృద్ధి చెందుతుందో ప్రజలు ఆలోచించాలన్నారు. కొత్తతరానికి అవకాశం ఇవ్వాలన్నదే పార్టీ ఆలోచనని, అందుకే అదితి, కలిశెట్టి అప్పలనాయుడుకు టిక్కెట్లు ఇచ్చారన్నారు. అందుకే తాను సుదీర్ఘ రాజకీయాల నుంచి తప్పుకొన్నట్లు పేర్కొన్నారు.
హామీలతో మభ్యపెట్టారు: అదితి
అయిదేళ్లలో వైకాపా ప్రభుత్వం ప్రజలను మభ్యపెట్టిందని కూటమి అభ్యర్థి అదితి గజపతిరాజు అన్నారు. యువతకు తీవ్ర అన్యాయం చేశారన్నారు. అశోక్బంగ్లాలో మంగళవారం 11-20 వార్డు అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, అనుంబంధ కమిటీలు, బూత్ ఇన్ఛార్జులతో సమీక్ష నిర్వహించారు. పాదయాత్రలో ఎన్నో హామీలు ఇచ్చిన జగన్, సీఎం అయ్యాక యువతకు ఇస్తామన్న జాబ్ కేలండర్ ఇవ్వలేదన్నారు. చంద్రబాబుతోనే యువతకు ఉద్యోగాలు వస్తాయన్నారు. ఉమ్మడి మేనిఫెస్టోలో ప్రకటించినవి చంద్రబాబు అమలు చేస్తారన్నారు. ఎన్నికల్లో ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీ అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడు, జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.యశస్వి, ఐవీపీ రాజు, ప్రసాదుల వరప్రసాద్, ఆల్తి బంగారుబాబు, కాళ్ల గౌరీశంకర్, కర్రోతు నర్సింగరావు, నడిపల్లి రవికుమార్ పాల్గొన్నారు.
350 కుటుంబాల చేరిక
విజయనగరం అర్బన్, న్యూస్టుడే: విజయనగరంలో 350 వైకాపా కుటుంబాలు తెదేపాలో చేరాయి. అశోక్ బంగ్లాలో మంగళవారం నియోజకవర్గ ఇన్ఛార్జి అదితి విజయలక్ష్మి గజపతిరాజు సమక్షంలో వారంతా పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. గాజులరేగ ప్రాంతానికి చెందిన మాజీ కౌన్సిలర్ గార సత్యనారాయణ, కటారి శ్రీనివాసులు, జి.సూర్యనారాయణ ఆధ్వర్యంలో 300 కుటుంబాలు, 26 డివిజన్కు చెందిన సదాయి భాస్కరరావు, ముప్పర్తి శ్రీనివాస్, కొప్పరపు సతీష్ ఆధ్వర్యంలో 25 కుటుంబాలు, పదో డివిజన్కు చెందిన ఆండ్ర చిన్న, కల్యాణ్ సింగ్, అదపాక తిరుపతి, రావి శ్రీనివాస్ ఆధ్వర్యంలో మరో 25 కుటుంబాలు చేరాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అన్నను మించిన అన‘కొండ’లు
[ 29-04-2024]
మృత్యుదూతగా పేరొందాడు నాటి యమకింకరుడు.. కంకరను బొక్కేసే నాయకులను వెనకుండి నడిపిస్తున్నాడు నేటి యమకంకరుడు జగన్.. ఆయన అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అదేపనిగా తవ్వకాలు ప్రారంభించిన కొందరు కేటుగాళ్లు ఈ ఐదేళ్ల కాలంలో పెద్దపెద్ద కొండలనే కరిగించేశారు. -
సర్కారు వారి గూడు పుఠాణి
[ 29-04-2024]
ఐదేళ్ల పాలన పూర్తయింది.. అయినా చాలా చోట్ల నిర్మాణాలు పూర్తి చేయలేదు. ఎన్నికల ముందు విజయనగరం, సాలూరులో హడావుడిగా కొన్ని చోట్ల అప్పగించి చేతులు దులుపుకొన్నారు. -
జగన్.. ఈ పాపం నీదే
[ 29-04-2024]
విజయనగరం జిల్లా వంగర, మన్యం జిల్లాలోని బలిజిపేట మండలాల్లో ఉన్న 17 గ్రామాలకు ప్రధాన సాగునీటి వనరును నేను.. దాదాపు 8 వేల ఎకరాలకు పైగా తడివ్వాల్సిన బాధ్యత నాది.. నా ఆయకట్టు పరిధిలో బంగారం పండే పొలాలున్నాయి.. -
రాష్ట్ర భవిష్యత్తు కోసమే కూటమి
[ 29-04-2024]
రాష్ట్ర భవిష్యత్తు కోసమే మూడు పార్టీలు కలిసి పనిచేస్తున్నాయని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు పూసపాటి అశోక్గజపతిరాజు అన్నారు. ఆదివారం రాత్రి విజయనగరంలోని పుత్సలవీధి, పూల్బాగ్ కాలనీల్లో నిర్వహించిన బహిరంగ సభల్లో ఆయన మాట్లాడారు. -
ప్రభుత్వ వైద్య రంగాన్ని బలోపేతం చేయాలి
[ 29-04-2024]
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ వైద్య రంగాన్ని బలోపేతం చేయాలని, అదే సమయంలో ప్రైవేటు వైద్యాలయాలను ఆదుకోవాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) జాతీయ అధ్యక్షుడు డా.ఆర్వీ.అశోకన్ అన్నారు. -
ఓటు వినియోగంతో ప్రశ్నించే హక్కు
[ 29-04-2024]
రాబోయే ఎన్నికల్లో ప్రతిఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, అప్పుడే నాయకులను ప్రశ్నించే హక్కు లభిస్తుందని మెప్మా సీఎంఎం సన్యాసిరావు అన్నారు. -
సమన్వయంతో పనిచేయాలి
[ 29-04-2024]
ఎన్నికల సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారిణి, కలెక్టర్ నాగలక్ష్మి ఆదేశించారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో ఆదివారం జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. -
5, 6, 7వ తేదీల్లో పోస్టల్ బ్యాలెట్
[ 29-04-2024]
సాధారణ ఎన్నికల నిర్వహణలో భాగంగా పోలింగ్ సిబ్బందికి విధుల కేటాయింపు రెండో విడత ప్రక్రియ ఆదివారం పూర్తి చేశారు. -
గొంతు తడిపే ఆలోచనుందా..?
[ 29-04-2024]
వేసవి ఆరంభంతోనే ఆ 44 గ్రామాల్లో దాహార్తి మొదలవుతుంది. నీటి కోసం కోటి పాట్లు పడాల్సిన పరిస్థితి. తోడుదామంటే బావుండదు.. వెళ్దామంటే బోరు కనిపించదు.. -
తెదేపా విశాఖ ఉత్తర పరిశీలకుడిగా రవిశేఖర్
[ 29-04-2024]
విశాఖ తెదేపా ఉత్తర నియోజకవర్గ పరిశీలకుడిగా సువ్వాడ రవిశేఖర్ను ఆ పార్టీ అధిష్ఠానం ఆదివారం నియమించింది. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నియోజకవర్గం పరిశీలకుడిగా ఆయన ఉన్నారు. -
కంకర గుటకాయ స్వాహా
[ 29-04-2024]
కొండలు.. గుట్టలు.. అనే తేడా లేదు.. ఎక్కడ మట్టి కనిపిస్తే అక్కడ తవ్వేస్తాం.. ఎర్రమట్టిని అమ్మేస్తాం.. అడిగితే దౌర్జన్యానికి దిగుతాం.. అన్న రీతిలో నడుస్తోంది గరివిడి, గజపతినగరం నియోజకవర్గాల్లో అక్రమ తవ్వకాల పరిస్థితి. -
ఇళ్లన్నావ్.. రోడ్డున పడేశావ్
[ 29-04-2024]
పేదల సొంతింటి కల నెరవేరుస్తామని ఆశలు పెంచి, హామీలు గుప్పించిన జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన తర్వాత మోసం చేశారు. ఐదేళ్లుగా సొంత గూడులేని వారి గోడును పట్టించుకోకుండా నిర్లక్ష్య వైఖరి అవలంబించారు. -
చంద్రబాబుతోనే సంక్షేమం
[ 29-04-2024]
రాష్ట్రంలో ప్రజల సంక్షేమం చంద్రబాబుతోనే సాధ్యమని కూటమి అభ్యర్థి బేబినాయన అన్నారు. రానున్న ఎన్నికల్లో గెలిపించాలని కోరారు.
తాజా వార్తలు (Latest News)
-
హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో పాలస్తీనా జెండా కలకలం
-
జైల్లో కేజ్రీవాల్ను చూసేందుకు భార్యకు అనుమతి నిరాకరణ..!
-
రిజర్వేషన్ల రద్దుపై అమిత్ షా నకిలీ వీడియో.. దిల్లీలో కేసు నమోదు
-
మ్యాచ్ పరిస్థితి గురించి వారికేం తెలుసు?: స్ట్రైక్రేట్పై కామెంట్లకు విరాట్ కౌంటర్
-
వైవిధ్య చిత్రాలు వచ్చేస్తున్నాయ్.. ఈ వారం థియేటర్/ఓటీటీ చిత్రాలివే!
-
లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,505