డ్రైవర్లు... అల్లాడుతున్నారు!
వేసవి వేడిమితో ఉక్కిరి బిక్కిరి
సిబ్బందికి కొరవడిన సౌకర్యాలు
ఎండ వేడిమిని తాళలేక తలకు రుమాలుతో విధుల్లో..
న్యూస్టుడే, పాలకొండ/ గ్రామీణంః బత్తిలి నుంచి శ్రీకాకుళం వైపు ఆర్టీసీ బస్సు వెళ్తున్న సమయంలో ఎండ తీవ్రతకు వడదెబ్బ తగిలి డ్రైవర్ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. బస్సు అదుపు తప్పే ముందే ప్రయాణికులను అప్రమత్తం చేయడంతో ప్రాణాపాయం తప్పినట్లయింది. ఈ ఘటన భామిని మండలంలో ఆదివారం చోటు చేసుకుంది.
వేసవి తీవ్రత పెరిగింది. నిత్యం 40 డిగ్రీలు దాటి గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం 9 గంటల నుంచే ఎండలు మండిపోతున్నాయి. అత్యవసర పనులుంటే తప్ప ప్రజలు బయటకు వచ్చే పరిస్థితులు లేవు. ఇటువంటి వేడిమి వాతావరణంలోనూ ఆర్టీసీ బస్సుల్లో సిబ్బంది అగ్గి కుంపటిపై విధులు నిర్వహించాల్సి వస్తోంది. అయితే బస్సుల్లో గానీ, ఆర్టీసీ సముదాయాల్లో గానీ వారికి ప్రత్యేక సౌకర్యాలు కల్పించడం వట్టిమాటే అవుతోంది.
ఇదీ పరిస్థితి..
పాలకొండ డిపోలో డ్రైవర్లు, కండక్టర్లు కలిపి 300 మంది, సాలూరులో 230, పార్వతీపురంలో 284, విజయనగరంలో 405, ఎస్.కోటలో 162 మంది ఉన్నారు. ్ర వేసవి కాలంలో రోజూ 8 గంటలు విధులు నిర్వహించేందుకు ఆపసోపాలు పడుతున్నారు. ప్రధానంగా చోదకులు ఎండ తీవ్రత, ఇంజిన్ నుంచి వచ్చే వేడిమితో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ్ర ఆర్టీసీ బస్సుల్లో గాని, ప్రయాణ ప్రాంగణాల్లో ప్రత్యేకంగా సిబ్బందికి ఎటువంటి సౌకర్యాలు ఉండడంలేదు. గమ్యస్థానం నుంచి తిరిగి బస్స్టేషన్కు చేరుకునేటప్పుడు కాస్త విరామం దొరుకుతుంది. ఈ సమయంలో సేద తీరేందుకు ఆర్టీసీ కాంప్లెక్సుల్లో విశ్రాంతి గదులు లేవు. ప్రయాణికులు నిరీక్షించే బెంచీలపైనే వీరూ సేదతీరాల్సి వస్తోంది. ప్రత్యేక వసతి, తాగునీరు అందుబాటులో లేక పోవడంతో అవస్థలు పడుతున్నారు. గాలి ఆడని బస్సుల్లోనే కొందరు సిబ్బంది భోజనాలు చేస్తున్నారు. మహిళా కండక్టర్లు పడుతున్న బాధలు వర్ణనాతీతం.
సౌకర్యాలు కల్పించాలి
ఆర్టీసీ కాంప్లెక్సుల్లోనైనా సిబ్బందికి కనీస సౌకర్యాలు కల్పించాలి. వేసవి కాలంలో ఎండల్లో విధులు నిర్వహించడం కష్టంగా ఉంది. బస్టాండుకు చేరుకున్నాక.. కాసేపైనా విశ్రాంతి తీసుకునేందుకు వసతి ఉండాలి. తాగునీరు, మరుగుదొడ్డి సౌకర్యాలు మెరుగు పర్చాలి.
బీకేమూర్తి, ఈయూ జోనల్ కార్యదర్శి
ఆరోగ్య జాగ్రత్తలపై అవగాహన
వేసవిలో విధులు నిర్వహించే సిబ్బంది తరచూ నీరు తాగాలని చెబుతున్నాం. విధుల్లో అలసటగా ఉంటే అక్కడే బస్సును నిలిపి కొంత సమయం విశ్రాంతి తీసుకునేలా సూచించాం. ఓఆర్ఎస్ ప్యాకెట్ల పంపిణీకి చర్యలు చేపడుతున్నాం. స్వచ్ఛంద సంస్థల సహకారంతో మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు నిర్ణయించాం.
పి.వెంకటేశ్వరరావు, డిపో మేనేజరు, పాలకొండ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భూచోడి సర్వే మాయ
[ 06-05-2024]
అన్నదాతలకు మేలు చేకూర్చేదిగా జగన్ చెబుతున్న ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మాయ వెనుక అసలు కథకు మూలం.. భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి ఉద్దేశించిందన్న రీసర్వే. ఉమ్మడి జిల్లాలో 2020 డిసెంబరులో ఈ పన్నాగానికి తెరలేపారు. -
కర్కశ పాలనలో రక్కసి రోడ్లు
[ 06-05-2024]
ఎన్నికలకు ముందు దారులేస్తామని మాటిచ్చిన పాలకులు.. అధికారంలోకి రాగానే వారి జగనన్న పాలనను చూసి.. అన్నీ వదిలేశారు.. అభివృద్ధి మాటే మరిచారు. ప్రజాందోళనలతో కొన్నిచోట్ల పనులు ప్రారంభించేందుకు అధికారులు ముందుకు రాగా.. -
పునరావాసంలో జగన్మోసం
[ 06-05-2024]
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి భూములు ఇచ్చిన నిర్వాసితుల బాగోగులు పాలకులకు పట్టడం లేదు. పుట్టినగడ్డ నుంచి పునరావాస కాలనీలకు తరలించినా.. మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారించడం లేదు. -
ఆశలు అడియాసలు చేశావ్ జగనన్న
[ 06-05-2024]
ఆశా కార్యకర్తల్లో వివిధ కారణాలతో చనిపోయిన వారంతా 30 నుంచి 50 ఏళ్ల లోపు వాళ్లే. వీరిలో కొంతమందికి భర్తలు లేరు. పెళ్లీడుకు వచ్చిన ఆడపిల్లలు, ఇంకా చదువుకుంటున్న పిల్లలు ఉన్నారు. -
పాలవలస కుటుంబానికి చుక్కెదురు!
[ 06-05-2024]
వీరఘట్టం మండలంలోని పనసనందివాడలో ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ కుటుంబానికి చుక్కెదురైంది. గత కొన్నేళ్లుగా ఆ కుటుంబానికి, వైకాపాకు ఈ గ్రామం పట్టుకొమ్మగా ఉండేది. -
ఓటెత్తిన ఉద్యోగులు
[ 06-05-2024]
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ జిల్లాలో ఆదివారం ప్రారంభమైంది. నాలుగు నియోజకవర్గాల్లో వివిధ హోదాల్లో ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న 6,818 మంది ఉద్యోగులు బ్యాలెట్లు పొందారు. -
ప్రైవేటు ఉద్యోగులకు ఎన్నికల విధులు
[ 06-05-2024]
ఈ ఎన్నికల్లో ఎన్నడూ లేని విధంగా ప్రైవేటు ఉద్యోగులను విధుల్లోకి తీసుకుంటున్నారు. పార్వతీపురం పట్టణంలో వివిధ ప్రైవేటు కళాశాలలు, ఐటీఐల్లో పనిచేస్తున్న వారు విధులకు హాజరుకావాలని ఆదేశాలు ఇచ్చారు. -
రాక్షస పాలన వారంలో ముగుస్తుంది
[ 06-05-2024]
రానున్న మరో వారం రోజుల్లో రాక్షస పాలన ముగుస్తుందని, ప్రజలంతా ఓటు అనే బలమైన ఆయుధంతో గద్దె దింపుతారని మాజీ మంత్రి, చీపురుపల్లి ఎన్డీయే కూటమి అభ్యర్థి కిమిడి కళా వెంకట్రావు అన్నారు. -
చేనేత కార్మికులకు తెదేపాతోనే భవిత
[ 06-05-2024]
చేనేత కార్మిక కుటుంబాలకు కూటమి అండగా ఉంటుందని రాజాం కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కోండ్రు మురళీమోహన్ అన్నారు. పట్టణానికి చెందిన చేనేత కార్మికుల నాయకుడు నల్లశ్రీను ఆధ్వర్యంలో లచ్చయ్యపేట, -
ఇండియా కూటమితోనే గిరిజనులకు న్యాయం
[ 06-05-2024]
నిత్యం ప్రజా సమస్యలపై పోరాడుతున్న సీపీఎంకు గిరిజన సమస్యలు తెలుసునని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యురాలు బృందాకారట్ పేర్కొన్నారు. -
ప్రజల ఆస్తులు కొల్లగొట్టేందుకు టైటిలింగ్ చట్టం
[ 06-05-2024]
ల్యాండ్ టైటిలింగ్ చట్టం ముసుగులో పట్టపగలు దోపిడీకి జగన్మోహన్రెడ్డి తెరలేపారని మాజీ ఎంపీ, అరకు కూటమి ఎంపీ అభ్యర్థిని కొత్తపల్లి గీత విమర్శించారు.