logo

స్ట్రాంగ్‌ రూంలు సిద్ధం చేయండి

ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద స్ట్రాంగ్‌ రూంలను సిద్ధం చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ నాగలక్ష్మి ఆదేశించారు

Published : 24 Apr 2024 05:06 IST

మాట్లాడుతున్న కలెక్టర్‌ నాగలక్ష్మి, చిత్రంలో జేసీ, డీఆర్వో తదితరులు

విజయనగరం ఉడాకాలనీ, న్యూస్‌టుడే: ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద స్ట్రాంగ్‌ రూంలను సిద్ధం చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ నాగలక్ష్మి ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో స్ట్రాంగ్‌ రూంలు, లెక్కింపు కేంద్రాలు, రిసెప్షన్‌ సెంటర్లలో ఏర్పాట్లపై నోడల్‌, వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహి ంచారు. ప్రత్యేక కౌంటర్‌లో ఈవీఎంలు, సాధారణ కౌంటర్లలో ఇతర ఎన్నికల సామగ్రిని భద్రపరచాలని, వేసవిని దృష్టిలో ఉంచుకుని అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. విద్యుత్తు సరఫరాకు అంతరాయం లేకుండా చూడాలని, గేటు వద్దే హెల్ప్‌ డెస్క్‌లు ఏర్పాటు చేయాలని సూచించారు. జేసీ కార్తీక్‌, సహాయ కలెక్టర్‌ వెంకట త్రివినాగ్‌, డీఆర్వో అనిత, ఆర్డీవో సూర్యకళ పాల్గొన్నారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని