logo

Balineni: పోటీ చేస్తానన్నారు.. వైకాపా నుంచే అని చెప్పలేదు: బాలినేని వ్యాఖ్యలపై చర్చ

‘వచ్చే ఎన్నికల్లో నేను, ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఒంగోలు నుంచే పోటీ చేస్తాం’ అని మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు.

Updated : 16 Aug 2023 08:58 IST

ఒంగోలు నేరవిభాగం, న్యూస్‌టుడే: ‘వచ్చే ఎన్నికల్లో నేను, ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఒంగోలు నుంచే పోటీ చేస్తాం’ అని మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ఒంగోలు నగర పాలకసంస్థ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన స్వాతంత్య్ర వేడుకలకు ఎంపీ మాగుంటతో కలిసి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా బాలినేని మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో తాను నియోజకవర్గం మారుతానంటూ వస్తున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. కొందరు కావాలనే ఇటువంటి ప్రచారం చేస్తున్నారని, వాటిని నమ్మొద్దన్నారు. ఒంగోలు ఎమ్మెల్యేగా తాను, ఎంపీగా మాగుంట శ్రీనివాసులురెడ్డి పోటీ చేయటం తథ్యమని తెలిపారు. బాలినేని రాజకీయ భవితవ్యంపై గత కొన్నాళ్లుగా జిల్లా వ్యాప్తంగా చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో బాలినేని తాజాగా ఈ వ్యాఖ్యలు చేశారు. అదే సమయంలో తాను వైకాపా నుంచే పోటీ చేస్తానని మాత్రం స్పష్టత ఇవ్వకపోవడంతో మరోసారి ఆయన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో  చర్చకు తావిచ్చాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని