YSRCP: గెలవలేం! మార్చేద్దాం!!
ఒంగోలు నగరం, న్యూస్టుడే: ఎన్నికల షెడ్యూల్ అతి సమీపంలోకి చేరుకుంటున్న కొద్దీ రాజకీయ పరిణామాలు వేడెక్కుతున్నాయి.
నష్ట నివారణకు వైకాపా సరికొత్త తంత్రం
గిద్దలూరుకు బాలినేని, ఒంగోలుకు బలరాం!
పరిశీలనలో లేని ప్రజాప్రతినిధుల అదృశ్యం
ఈనాడు, ఒంగోలు: ఒంగోలు నగరం, న్యూస్టుడే: ఎన్నికల షెడ్యూల్ అతి సమీపంలోకి చేరుకుంటున్న కొద్దీ రాజకీయ పరిణామాలు వేడెక్కుతున్నాయి. గెలుపు గాలి వీయడం లేదంటూ నష్ట నివారణ పేరుతో పలు నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులకు వైకాపా అధిష్ఠానం తెర లేపింది. గెలవలేం.. తప్పదు మార్చేద్దామంటూ కుండబద్దలు కొడుతోంది. ఇందులో భాగంగానే యర్రగొండపాలెం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న మంత్రి ఆదిమూలపు సురేష్ను కొండపికి, ఇప్పటి వరకు అక్కడ సమన్వయకర్తగా వ్యవహరించిన వరికూటి అశోక్బాబును బాపట్ల జిల్లా వేమూరుకు మార్చింది. వేమూరు నుంచి ఎన్నికైన మంత్రి మేరుగు నాగార్జునకు సంతనూతలపాడు బాధ్యతలు అప్పగించింది. తాజాగా ఇతర నియోజకవర్గాల్లోనూ సిట్టింగ్లను సాగనంపి కొత్త వారిని ఎంపిక చేసేందుకు జోరుగా చర్చలు సాగుతున్నాయి. ఇందులో భాగంగా తాడేపల్లి నుంచి కొందరికి కబురందింది. ఈ అంశంపై మాజీ మంత్రి శిద్దా రాఘవరావు, గిద్దలూరు ఎమ్మెల్యే అన్నారాంబాబు, బాపట్ల జిల్లా చీరాల ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తితో అధిష్ఠానం మాట్లాడినట్లు సమాచారం. నేడో రేపో మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డితోనూ భేటీ కానున్నట్లు తెలిసింది. ఈ పరిణామాల నేపథ్యంలో వైకాపా రీజినల్ సమన్వయకర్త, ఎంపీ విజయసాయిరెడ్డిని బాలినేని హైదరాబాద్లో శనివారం కలిసి మాట్లాడినట్లు సమాచారం. వైకాపా అధిష్ఠానం చేపడుతున్న చర్యలు ఇప్పుడు ఆ పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. శ్రేణులను కలవరపాటుకు గురిచేస్తూ రోజు రోజుకీ అలజడి రేపుతున్నాయి.
సిట్టింగ్లకు అనేక అవరోధాలు...: జిల్లాలోని అధికార పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలపై అవినీతి ఆరోపణలతో పాటు, పార్టీలో లుకలుకలు, వర్గపోరు తీవ్రస్థాయిలో ఉంది. సంతనూతలపాడు, దర్శి, మార్కాపురం, ఒంగోలు, కనిగిరి ఎమ్మెల్యేలపై ఇటీవల కాలంలో అవినీతి ఆరోపణలొచ్చాయి. సంతనూతలపాడులో ఒక వర్గం బహిరంగంగానే తిరుగుబాటు బావుటా ఎగురవేసింది. మరికొందరు ఎమ్మెల్యేలపై శ్రేణుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఈ పరిస్థితుల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జులకు మళ్లీ టిక్కెట్లు ఇస్తే ఓటమి తప్పదని వైకాపా అధిష్ఠానం భావిస్తోంది. ఈ పరిస్థితి నుంచి కాస్తైనా బయట పడాలంటే కొత్త ముఖాలైతే కొంత వరకు నష్టాన్ని పూడ్చుకోవచ్చని భావించి అనూహ్య మార్పులకు శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలో ఒంగోలుకు కరణం బలరామకృష్ణమూర్తి, గిద్దలూరుకు బాలినేని శ్రీనివాసరెడ్డి, మార్కాపురానికి శిద్దా రాఘవరావు, ఉమ్మడి ప్రకాశంలోని చీరాలకు మోపిదేవి వెంకట రమణ, లేకుంటే ఆమంచి కృష్ణమోహన్ పేర్లు ప్రచారంలో ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. ఎంపీ మాగుంట తనయుడు రాఘవరెడ్డిని మార్కాపురానికి, బాలినేని తనయుడు ప్రణీత్రెడ్డికి గిద్దలూరు ఇచ్చి బాలినేని, మాగుంట పోటీకి దూరంగా ఉంటారనే చర్చ కూడా ఆ పార్టీ వర్గాల్లో నడుస్తోంది. ఆయా ప్రతిపాదనలకు సిట్టింగ్లు అంగీకరిస్తారా లేదా అనేది వేచిచూడాల్సి ఉంది.
కక్క లేక.. మింగుడు పడక...
ఈ పరిస్థితులు అధికార పార్టీలో తీవ్ర అసంతృప్తులు, అసమ్మతులను తారస్థాయికి చేర్చేలా పరిణమించాయి. తమకు చోటుచేసుకున్న పరాభవంపై కొందరు బహిరంగంగా మాట్లాడుతుండగా.. మరికొందరు లోలోన కుమిలి పోతున్నారు. ఇంకొందరైతే ఏకంగా నియోజకవర్గాలను వీడి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. విజయవాడ, హైదరాబాద్లో ఉంటూ ముఖ్య నేతలతో పైరవీలు చేయించుకుంటున్నారు. సమన్వయకర్తగా నాగార్జునను నియమించినప్పటి నుంచే సంతనూతలపాడు ఎమ్మెల్యే సుధాకర్బాబు అజ్ఞాతంలోకి వెళ్లారు. అదే సమయంలో మేరుగ నాగార్జున అక్కడ పోటీకి సన్నాహాలు చేసుకునే పనిలో పడ్డారు. కొండపి సమన్వయకర్తగా నియమితులైన మంత్రి సురేష్.. అధిష్ఠానం నిర్ణయాన్ని ధిక్కరించలేక ఎక్కడైనా సై అంటూ ప్రకటనలు చేస్తున్నారు. అదే సమయంలో తాను ప్రాతినిథ్యం వహిస్తున్న యర్రగొండపాలేన్ని వీడటం ఇష్టం లేక ద్వితీయశ్రేణి నాయకులతో రాజీనామా నాటకాలకు తెర లేపారనే విమర్శలు వచ్చాయి. ఎన్నికల షెడ్యూల్ అతి సమీపంలోకి వచ్చిన నేపథ్యంలో ఎవరికి టిక్కెట్ దక్కుతుందో తెలియక నేతలు ఆందోళనతో కాలం గడుపుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐపీఎల్ అంటూ కోతలు.. రోడ్ల మీదే ఆటలు
[ 29-04-2024]
ముఖ్యమంత్రి మైదానంలోకి దిగగానే ఆయనలోని క్రికెటర్ బయటకొస్తాడు.. స్టాన్స్ ఎలా తీసుకోవాలి..ఫుట్వర్క్ ఎలా ఉండాలి..డ్రైవ్ ఎలా కొట్టాలంటూ తోటి మంత్రులతో ఆటలాడుకుంటారు. -
అన్నం పెట్టే చదువులకు.. అన్నే ఓ చెద
[ 29-04-2024]
వైకాపా ప్రభుత్వం.. పేదలూ బడుగు బలహీన వర్గాల పిల్లలెక్కువగా చదువుకునే ప్రభుత్వ బడుల ఉసురు తీసింది. ప్రపంచ స్థాయి విద్య, టోఫెల్, బైజూస్ అంటూ జగన్ ఊదరగొట్టారు. పాఠశాలల రూపురేఖలను మార్చేస్తున్నానంటూ -
గద్దెనెక్కి గొప్పలు.. గోతులతోనే ముగింపు
[ 29-04-2024]
తాళ్లూరు, దర్శి, ముండ్లమూరు, చీమకుర్తి ప్రాంతాలకు ప్రస్తుతం మద్దిపాడు మండలంలోని ఉపకేంద్రం నుంచి విద్యుత్తు సరఫరా అవుతోంది. దీంతో తరచూ అవాంతరాలు తలెత్తుతూ సమస్యలు ఎదురవుతున్నాయి. -
3న జిల్లాకు జనసేనాని
[ 29-04-2024]
జనసేన అధినేత పవన్ కల్యాణ్ మే 3న జిల్లాలో పర్యటించనున్నారు. ఆ రోజున గిద్దలూరు, దర్శి, ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిర్వహించనున్న ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొననున్నారు. -
తెదేపా అధినేత పర్యటన వాయిదా
[ 29-04-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మే 3, 4 తేదీల్లో జిల్లాలో పర్యటించనున్నారు. -
69,918 మందికి ఇళ్ల వద్దే పింఛను
[ 29-04-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నియమావళి దృష్ట్యా వైకాపా కార్యకర్తలుగా భావిస్తున్న గ్రామ, వార్డు వాలంటీర్లను సామాజిక పింఛన్ల పంపిణీ బాధ్యత నుంచి ఈసీ తప్పించింది. -
జనం ‘చెవి’లో ప్రలోభాల పువ్వులు
[ 29-04-2024]
రాజకీయ బదిలీపై రాయలసీమ నుంచి నుంచి అధిష్ఠానం ఆ నేతను జిల్లాకు బలవంతంగా పంపింది. వస్తూనే ఏకంగా జిల్లా పోలీసు బాస్నే వెంట తెచ్చుకున్నారు. -
వైకాపాకు ఓట్లేయాలని చర్చిలో ప్రసంగం
[ 29-04-2024]
ఎన్నికల్లో ఎలాగైనా గెలుపొందాలనే లక్ష్యంతో వైకాపా నాయకులు ఎన్ని అడ్డదారులైనా తొక్కడానికి వెనుకాడడం లేదు. కొండపి మండలంలో ఆదివారం రాత్రి జరిగిన సంఘటనే ఇందుకు నిదర్శనం. -
జిల్లాలో సైకిల్ జోరు
[ 29-04-2024]
ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెదేపాలో చేరికలు జోరందుకున్నాయి. వైకాపాకు చెందిన పలువురు నేతలు, అభిమానులు సైకిలెక్కుతున్నారు. -
తగాదా అడ్డుకోబోతే కడతేర్చారు
[ 29-04-2024]
సోదరి కుటుంబంలో తగాదాను అడ్డుకోబోయిన తమ్ముడు కత్తిపోట్లకు గురై మృతిచెందాడు. దర్శి మండలం రాజంపల్లిలో ఆదివారం ఈ విషాద సంఘటన చోటు చేసుకుంది. -
వైకాపా పాలనకు చరమగీతం పాడాలి
[ 29-04-2024]
బీసీల సంక్షేమానికి తెదేపా కట్టుబడి ఉందని మాజీ ఎమ్మెల్యే, గిద్దలూరు నియోజకవర్గ తెదేపా అభ్యర్థి ముత్తుముల అశోక్రెడ్డి పేర్కొన్నారు. -
అత్యవసరంపై.. అంతులేని నిర్లక్ష్యం
[ 29-04-2024]
అర్థవీడుకు అత్యవసర సేవలు దూరమాయ్యాయి. ఏళ్ల కాలంగా ఉన్న ఒక్క అత్యవసర వాహనం అర్థవీడుకు పరిమితమైంది. లోయ గ్రామీణులకు అత్యవసర వైద్యం అందాలన్న..
తాజా వార్తలు (Latest News)
-
అరుదైన ఘనత సాధించిన ‘పొలిమేర2’.. ఆనందంతో దర్శకుడి పోస్ట్
-
మోదీజీ.. ఇంకా మౌనమేనా?: ప్రజ్వల్ అభ్యంతరకర వీడియోలపై ప్రియాంకగాంధీ
-
శంషాబాద్ ఎయిర్పోర్టు పరిసరాల్లో చిరుత కోసం కొనసాగుతున్న గాలింపు
-
భారీ ధరకు ‘తండేల్’ ఓటీటీ రైట్స్.. చైతూ కెరీర్లో బిగ్ డీల్
-
భారత్లో నథింగ్ ఫోన్ 2ఏ స్పెషల్ ఎడిషన్.. ధర, ఫీచర్లివే..!
-
ఛేజింగ్కి వస్తే... హైదరా‘బాధ’ తప్పదా?