Balineni: ప్యాలెస్తో ఇక తెగతెంపులు!.. తీవ్ర పరాభవానికి నొచ్చుకున్న బాలినేని
నిన్నటి వరకు పార్టీకి పెద్దన్న. తన కనుసైగతో ఉమ్మడి జిల్లా కాంగ్రెస్, వైకాపా రాజకీయాలను నడిపిన నేత. ఒకప్పుడు వైకాపా అధినేత వద్దకు నేరుగా వెళ్లి ముచ్చటించేంత చొరవ.. ఇప్పుడు ఆయన కరుణ కోసం మూడు రోజులపాటు కళ్లు కాయలు కాసేలా ఎదురుచూడాల్సిన అవస్థ. అయినా అధిష్ఠానం మనస్సు కరగలేదు.
ఎంతకీ తెరుచుకోని తాడేపల్లి తలుపులు
అనుయాయులతో మాజీ మంత్రి సమాలోచనలు
న్యూస్టుడే, ఒంగోలు నేరవిభాగం
అయిదుసార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లు మంత్రిగా పనిచేశాను. ఇంతకంటే ఇంకేం కావాలి. కాదూకూడదంటే ఇంట్లో కూర్చుంటా. ఇంత అవమానాల్ని భరించాల్సిన అవసరం లేదు..
జగన్ వేరు రాజశేఖర్రెడ్డి వేరు. ఇద్దరి ఆలోచనా విధానాలకు చాలా తేడా ఉంది. నమ్మినవాళ్లకు, నమ్ముకున్న వాళ్లకు రాజశేఖర్రెడ్డి ఎంతగానో విలువ ఇచ్చేవారు. జగన్కు అటువంటివేమీ లేవు..
నిన్నటి వరకు పార్టీకి పెద్దన్న. తన కనుసైగతో ఉమ్మడి జిల్లా కాంగ్రెస్, వైకాపా రాజకీయాలను నడిపిన నేత. ఒకప్పుడు వైకాపా అధినేత వద్దకు నేరుగా వెళ్లి ముచ్చటించేంత చొరవ.. ఇప్పుడు ఆయన కరుణ కోసం మూడు రోజులపాటు కళ్లు కాయలు కాసేలా ఎదురుచూడాల్సిన అవస్థ. అయినా అధిష్ఠానం మనస్సు కరగలేదు. అవతలి నుంచి పిలుపు అందలేదు. తాడేపల్లి ప్యాలెస్ తలుపులు ఎంతకీ తెరుచుకోలేదు. ఒకవిధంగా అతని ముప్ఫై ఏళ్ల రాజకీయ జీవితంలో ఏనాడూ చవిచూడని ఘోర పరాభవమిది. ఈ పరిణామాలతో మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి చిన్నబోయారు. తీవ్ర అసహనానికి గురయ్యారు. ఆరు నూరైనా జగన్తోనే తమ ప్రయాణం అని పదే పదే ఘంటాపథంగా చెప్పిన ఆయన.. అధిష్ఠానం తనపట్ల వ్యవహరిస్తున్న తీరును తీవ్ర అవమానకరంగా భావించారు. ఇకపై తాడేపల్లి ప్యాలెస్తో చర్చించేది లేదని తేల్చేశారు. మూడు రోజులుగా మకాం వేసిన విజయవాడలోని హోటల్ గదిని ఖాళీ చేశారు. తన దారి తాను చూసుకుంటానంటూ తనయుడు ప్రణీత్ రెడ్డితో సహా హైదరాబాద్కు తిరుగు పయనమయ్యారు. ఈ ఉదంతం ఇప్పుడు జిల్లా రాజకీయాల్లో తీవ్ర ప్రకంపనలు రేపుతోంది.
ఆ రెండు అంశాల పైనే పట్టు...: మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రధానంగా రెండు అంశాలపై పట్టుబడుతున్నారు. ఒంగోలులో ఇళ్లపట్టాల పంపిణీకి రూ.179 కోట్లు కావాలని తొలి నుంచీ కోరుతున్నారు. దీనిపై నిర్ణయం తీసుకుంటారని ఇంతకాలం ధీమాగా ఉన్నారు. సానుకూల స్పందన రాలేదు. ఒంగోలు పార్లమెంట్ స్థానం నుంచి మాగుంట శ్రీనివాసులురెడ్డికి టికెట్ కేటాయించాలని అడుగుతున్నారు. అలా అయితే తన బావ అయిన తితిదే మాజీ ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి జిల్లా రాజకీయాల్లో వేలు పెట్టకుండా నియంత్రించొచ్చని తలిచారు. ఈ రెండు విషయాల్లోనూ బాలినేని పట్టు వీడటం లేదు. ఇందుకు మూడు రోజులుగా విజయవాడలోనే మకాం వేశారు. తనతో సంప్రదింపులు జరుపుతున్న వైకాపా సమన్వయకర్త విజయసాయిరెడ్డితో పాటు సీఎంవో కార్యదర్శి ధనుంజయరెడ్డి, ఇంటెలిజెన్స్ అధికారులతో ఇదే విషయం స్పష్టం చేస్తూ వచ్చారు. సోమ, మంగళవారాల్లో సీఎంవోకు వెళ్లిన బాలినేని.. ఇవే డిమాండ్లను వారి ముందుంచారు.
వెళ్లిపోవడమే ఉత్తమం...: గడిచిన మూడు రోజులుగా పలు జిల్లాలకు చెందిన నేతలతో సీఎం జగన్ మోహన్ రెడ్డి సమావేశమవుతున్నారు. బాలినేనితో ముఖాముఖికి మాత్రం అవకాశం ఇవ్వడం లేదు. దీంతో ఆయన తీవ్రంగా నొచ్చుకున్నట్లు తెలిసింది. ఏదేమైనా జగన్తోనే పయనిద్దామంటూ పదేపదే తండ్రిపై ఒత్తిడి తెస్తున్న బాలినేని తనయుడు ప్రణీత్రెడ్డి కూడా.. తాడేపల్లి ప్యాలెస్ తమ పట్ల వ్యవహరిస్తున్న తీరుకు కలత చెందినట్లు సమాచారం. చివరికి కుమారుడితో పాటు కీలక నాయకులతో బుధవారం సమావేశమైన బాలినేని అవమానాలను భరిస్తూ వేచిచూడటం కంటే వెళ్లిపోవటమే ఉత్తమమనే ఆలోచనకు వచ్చారని తెలిసింది.
ఇకపై చర్చించేది లేదు...: తాడేపల్లిని వీడి హైదరాబాద్ వెళ్లే సమయంలో తన అనుయాయులతో బాలినేని కీలక వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. ‘అయిదుసార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లు మంత్రిగా పనిచేశాను. ఇంతకంటే ఇంకేం కావాలి. కాదూకూడదంటే ఇంట్లో కూర్చుంటా. ఇంత అవమానాల్ని భరించాల్సిన అవసరం లేదు’ అన్నట్లు తెలిసింది. ‘జగన్ వేరు రాజశేఖర్రెడ్డి వేరు. ఇద్దరి ఆలోచనా విధానాలకు చాలా తేడా ఉంది. నమ్మిన వాళ్లకు, నమ్ముకున్న వాళ్లకు రాజశేఖర్రెడ్డి ఎంతగానో విలువ ఇచ్చేవారు. జగన్కు అటువంటివేమీ లేవు..’ అని ఆయన సన్నిహితుల వద్ద వాపోయినట్లు తెలిసింది. ‘మూడు రోజులుగా తాడేపల్లి ప్యాలెస్ పిలుపు కోసం వేచి ఉన్నా పిలవలేదు. ఇక్కడ ఉండీ అనవసరం. హైదరాబాద్ వెళ్లిపోతున్నా.. మళ్లీ ఇక్కడ నుంచి పిలుపు వచ్చినా చర్చించేది లేదు. వచ్చే ఎన్నికల్లో ఒంగోలు నుంచే పోటీ చేయబోతున్నా..’ అని తన సన్నిహితులతో బాలినేని వ్యాఖ్యానించినట్లు సమాచారం.
ఆ ఇద్దరి పయనం ఎటు వైపో..!: తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఎంపీ మాగుంట, ఎమ్మెల్యే బాలినేని రాజకీయ పయనం ఎటు వైపో అనే విషయం జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఎట్టి పరిస్థితుల్లోనూ తన కుమారుడితో రాజకీయ ఆరంగేట్రం చేయించాలని ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి పట్టుదలతో ఉన్నారు. వైకాపా టికెట్ ఇవ్వబోరని ఇప్పటికే ఒక అంచనాకు వచ్చి.. ప్రత్యామ్నాయాలపై సీరియస్గా దృష్టి సారించారు. బాలినేనితో మూడు రోజులపాటు సాగించిన ఏకాంత చర్చల్లోనూ ఇదే అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించినట్లు సమాచారం. ఐ-ప్యాక్ ప్రతినిధులతో సాగిన భేటీలోనూ తమ నిర్ణయాన్ని కుండబద్దలు కొట్టినట్లు తెలిసింది. ఇదే సమయంలో ఎమ్మెల్యే బాలినేని, మాగుంట కోసం గట్టిగానే ప్రయత్నించినా.. పార్టీ పెద్దలు అందుకు ససేమిరా అన్నట్లు సమాచారం. సీఎంను కలిసేందుకు అనుమతి కోరినా ఈ అంశం తప్ప మరింకేదైనా ఉందా..? అనే ప్రశ్న ఎదురైందని.. దీంతో పార్టీ పెద్దల వైఖరిని తెలుసుకున్న బాలినేని తన ప్రతిపాదనకు విలువలేదని గ్రహించి వెనుదిరిగినట్లు చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో బాలినేని ఎటువంటి నిర్ణయం తీసుకోనున్నారు, మాగుంట శ్రీనివాసులురెడ్డి దారెటు అనే చర్చ జోరుగా సాగుతోంది.
మూడో జాబితా.. మరోసారి వాయిదా...: ఇప్పటికే నియోజకవర్గ సమన్వయకర్తల మార్పుతో రెండు జాబితాలు విడుదల చేసిన వైకాపా అధిష్ఠానం తాజా పరిణామాల నేపథ్యంలో మూడో జాబితా విడుదలపై మల్లగుల్లాలు పడుతోంది. మంగళవారమే మూడో జాబితా విడుదల చేస్తారని అంతా ఎదురుచూశారు. అనివార్య కారణాలని చెప్పి బుధవారానికి వాయిదా వేశారు. దీంతో ఒంగోలు మినహాయించి దర్శి, మార్కాపురం, కనిగిరి, గిద్దలూరు నియోజకవర్గ ఆశావహుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. సామాజిక సమీకరణాలు, అలకలు, బుజ్జగింపుల నేపథ్యంలో బుధవారం విడుదలవుతుందని భావించిన మూడో జాబితా కూడా మరోసారి వాయిదా పడింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐపీఎల్ అంటూ కోతలు.. రోడ్ల మీదే ఆటలు
[ 29-04-2024]
ముఖ్యమంత్రి మైదానంలోకి దిగగానే ఆయనలోని క్రికెటర్ బయటకొస్తాడు.. స్టాన్స్ ఎలా తీసుకోవాలి..ఫుట్వర్క్ ఎలా ఉండాలి..డ్రైవ్ ఎలా కొట్టాలంటూ తోటి మంత్రులతో ఆటలాడుకుంటారు. -
అన్నం పెట్టే చదువులకు.. అన్నే ఓ చెద
[ 29-04-2024]
వైకాపా ప్రభుత్వం.. పేదలూ బడుగు బలహీన వర్గాల పిల్లలెక్కువగా చదువుకునే ప్రభుత్వ బడుల ఉసురు తీసింది. ప్రపంచ స్థాయి విద్య, టోఫెల్, బైజూస్ అంటూ జగన్ ఊదరగొట్టారు. పాఠశాలల రూపురేఖలను మార్చేస్తున్నానంటూ -
గద్దెనెక్కి గొప్పలు.. గోతులతోనే ముగింపు
[ 29-04-2024]
తాళ్లూరు, దర్శి, ముండ్లమూరు, చీమకుర్తి ప్రాంతాలకు ప్రస్తుతం మద్దిపాడు మండలంలోని ఉపకేంద్రం నుంచి విద్యుత్తు సరఫరా అవుతోంది. దీంతో తరచూ అవాంతరాలు తలెత్తుతూ సమస్యలు ఎదురవుతున్నాయి. -
3న జిల్లాకు జనసేనాని
[ 29-04-2024]
జనసేన అధినేత పవన్ కల్యాణ్ మే 3న జిల్లాలో పర్యటించనున్నారు. ఆ రోజున గిద్దలూరు, దర్శి, ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిర్వహించనున్న ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొననున్నారు. -
తెదేపా అధినేత పర్యటన వాయిదా
[ 29-04-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మే 3, 4 తేదీల్లో జిల్లాలో పర్యటించనున్నారు. -
69,918 మందికి ఇళ్ల వద్దే పింఛను
[ 29-04-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నియమావళి దృష్ట్యా వైకాపా కార్యకర్తలుగా భావిస్తున్న గ్రామ, వార్డు వాలంటీర్లను సామాజిక పింఛన్ల పంపిణీ బాధ్యత నుంచి ఈసీ తప్పించింది. -
జనం ‘చెవి’లో ప్రలోభాల పువ్వులు
[ 29-04-2024]
రాజకీయ బదిలీపై రాయలసీమ నుంచి నుంచి అధిష్ఠానం ఆ నేతను జిల్లాకు బలవంతంగా పంపింది. వస్తూనే ఏకంగా జిల్లా పోలీసు బాస్నే వెంట తెచ్చుకున్నారు. -
వైకాపాకు ఓట్లేయాలని చర్చిలో ప్రసంగం
[ 29-04-2024]
ఎన్నికల్లో ఎలాగైనా గెలుపొందాలనే లక్ష్యంతో వైకాపా నాయకులు ఎన్ని అడ్డదారులైనా తొక్కడానికి వెనుకాడడం లేదు. కొండపి మండలంలో ఆదివారం రాత్రి జరిగిన సంఘటనే ఇందుకు నిదర్శనం. -
జిల్లాలో సైకిల్ జోరు
[ 29-04-2024]
ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెదేపాలో చేరికలు జోరందుకున్నాయి. వైకాపాకు చెందిన పలువురు నేతలు, అభిమానులు సైకిలెక్కుతున్నారు. -
తగాదా అడ్డుకోబోతే కడతేర్చారు
[ 29-04-2024]
సోదరి కుటుంబంలో తగాదాను అడ్డుకోబోయిన తమ్ముడు కత్తిపోట్లకు గురై మృతిచెందాడు. దర్శి మండలం రాజంపల్లిలో ఆదివారం ఈ విషాద సంఘటన చోటు చేసుకుంది. -
వైకాపా పాలనకు చరమగీతం పాడాలి
[ 29-04-2024]
బీసీల సంక్షేమానికి తెదేపా కట్టుబడి ఉందని మాజీ ఎమ్మెల్యే, గిద్దలూరు నియోజకవర్గ తెదేపా అభ్యర్థి ముత్తుముల అశోక్రెడ్డి పేర్కొన్నారు. -
అత్యవసరంపై.. అంతులేని నిర్లక్ష్యం
[ 29-04-2024]
అర్థవీడుకు అత్యవసర సేవలు దూరమాయ్యాయి. ఏళ్ల కాలంగా ఉన్న ఒక్క అత్యవసర వాహనం అర్థవీడుకు పరిమితమైంది. లోయ గ్రామీణులకు అత్యవసర వైద్యం అందాలన్న..
తాజా వార్తలు (Latest News)
-
లండన్లోనూ డబ్బావాలా ఎఫెక్ట్: ఆనంద్ మహీంద్రా
-
జీవితంపై విరక్తి.. ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య
-
అరుదైన ఘనత సాధించిన ‘పొలిమేర2’.. ఆనందంతో దర్శకుడి పోస్ట్
-
మోదీజీ.. ఇంకా మౌనమేనా?: ప్రజ్వల్ అభ్యంతరకర వీడియోలపై ప్రియాంకగాంధీ
-
శంషాబాద్ ఎయిర్పోర్టు పరిసరాల్లో చిరుత కోసం కొనసాగుతున్న గాలింపు
-
భారీ ధరకు ‘తండేల్’ ఓటీటీ రైట్స్.. చైతూ కెరీర్లో బిగ్ డీల్