వ్యూహం.. ప్రతివ్యూహం..
జిల్లాలో వైకాపా బాధ్యతలను తిరుపతి జిల్లా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డికి అధిష్ఠానం కట్టబెట్టింది. ఈ చర్యను నిరసిస్తూ మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి మరోసారి అలకపాన్పు ఎక్కారు.
చెవిరెడ్డికి జిల్లా సమన్వయ బాధ్యతలు
హైదరాబాద్లో బాలినేని మంతనాలు
శ్రీనివాసరెడ్డి, భాస్కర్రెడ్డి
ఒంగోలు నేరవిభాగం, న్యూస్టుడే: జిల్లాలో వైకాపా బాధ్యతలను తిరుపతి జిల్లా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డికి అధిష్ఠానం కట్టబెట్టింది. ఈ చర్యను నిరసిస్తూ మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి మరోసారి అలకపాన్పు ఎక్కారు. బుధవారం రాత్రి హుటాహుటిన హైదరాబాద్ వెళ్లిన ఆయన.. అక్కడే తన అనుయాయులతో భవిష్యత్తు కార్యాచరణపై మంతనాలు సాగిస్తున్నారు.
సాయంత్రానికి మారిన కథ...: ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసులురెడ్డి విషయంలో బాలినేని తొలుత మెత్తబడ్డట్టే కనిపించారు. ఎంపీ అభ్యర్థిగా ఎవరిని ఎంపిక చేసినా తనకేం బాధ లేదని చెప్పారు. అదే రోజు సాయంత్రానికి కథ మారిపోయింది. ఎంపీ స్థానం వరకు మాత్రమే చెవిరెడ్డికి బాధ్యతలు అప్పగిస్తామని తొలుత చెప్పిన పార్టీ పెద్దలు.. సాయంత్రానికి జిల్లా మొత్తం సమన్వయ బాధ్యతల్ని ఆయనకు కేటాయించారు. బాపట్ల పార్లమెంట్ స్థానంలోని సంతనూతలపాడును కూడా ఆయనకే అప్పగించారు. ఈ నిర్ణయంతో బాలినేని ఖిన్నులయ్యారు. అధిష్ఠానంపై కినుక వహించి హుటాహుటిన హైదారాబాద్ వెళ్లారు.
తాడేపల్లి కేంద్రంగా కుట్రలంటూ..!: ఒంగోలు ఎంపీ స్థానం ఎవరికనేది తేల్చకుండా వైకాపా అధిష్ఠానం వ్యూహాత్మకంగా వ్యవహరించింది. దీంతో బాలినేనిలో మరింత అనుమానం మొదలైందనే చర్చ పార్టీ వర్గాల్లో సాగుతోంది. మాగుంటకు నిరాకరించి ఆయన స్థానంలో చెవిరెడ్డి పేరును తాడేపల్లి ప్యాలెస్ ప్రతిపాదించింది. తొలుత ఈ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకించిన బాలినేని చివరకు అంగీకరించారు. అదే సమయంలో ఆయనకు జిల్లా బాధ్యతలు మెలిక పెట్టడం, ఎంపీ సీటుపై స్పష్టత ఇవ్వకపోవడంతో తెర వెనుక ఏవో మంతనాలు సాగుతున్నాయనేది బాలినేని భావన. తాను మొదటి నుంచీ వ్యతిరేకిస్తున్న తన బావ వై.వి.సుబ్బారెడ్డి చక్రం తిప్పి తన కుమారుడు విక్రాంత్రెడ్డిని తెర మీదకు తెచ్చే అవకాశం ఉందని అనుమానించారు. తన ప్రాభవం తగ్గించేందుకు తాడేపల్లి కేంద్రంగా కుట్ర చేస్తున్నారని అసహనానికి గురయ్యారు. హుటాహుటిన హైదరాబాద్ వెళ్లిపోయారు. అక్కడే మకాం వేసి తన రాజకీయ భవిష్యత్తుపై కీలక అనుచరులతో మంతనాలు సాగిస్తున్నారు. బాలినేని హైదరాబాద్లో ఉండగానే ఒంగోలులో ఇళ్ల స్థలాల భూసేకరణ నిమ్తితం మంజూరైన రూ.126 కోట్ల నిధులను రైతుల ఖాతాలో జమ కావడం గమనార్హం. ఈ వ్యూహ, ప్రతివ్యూహాలు.. అనూహ్య పరిణామాలు అధికార పార్టీ శ్రేణులను అయోమయానికి గురిచేస్తున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐపీఎల్ అంటూ కోతలు.. రోడ్ల మీదే ఆటలు
[ 29-04-2024]
ముఖ్యమంత్రి మైదానంలోకి దిగగానే ఆయనలోని క్రికెటర్ బయటకొస్తాడు.. స్టాన్స్ ఎలా తీసుకోవాలి..ఫుట్వర్క్ ఎలా ఉండాలి..డ్రైవ్ ఎలా కొట్టాలంటూ తోటి మంత్రులతో ఆటలాడుకుంటారు. -
అన్నం పెట్టే చదువులకు.. అన్నే ఓ చెద
[ 29-04-2024]
వైకాపా ప్రభుత్వం.. పేదలూ బడుగు బలహీన వర్గాల పిల్లలెక్కువగా చదువుకునే ప్రభుత్వ బడుల ఉసురు తీసింది. ప్రపంచ స్థాయి విద్య, టోఫెల్, బైజూస్ అంటూ జగన్ ఊదరగొట్టారు. పాఠశాలల రూపురేఖలను మార్చేస్తున్నానంటూ -
గద్దెనెక్కి గొప్పలు.. గోతులతోనే ముగింపు
[ 29-04-2024]
తాళ్లూరు, దర్శి, ముండ్లమూరు, చీమకుర్తి ప్రాంతాలకు ప్రస్తుతం మద్దిపాడు మండలంలోని ఉపకేంద్రం నుంచి విద్యుత్తు సరఫరా అవుతోంది. దీంతో తరచూ అవాంతరాలు తలెత్తుతూ సమస్యలు ఎదురవుతున్నాయి. -
3న జిల్లాకు జనసేనాని
[ 29-04-2024]
జనసేన అధినేత పవన్ కల్యాణ్ మే 3న జిల్లాలో పర్యటించనున్నారు. ఆ రోజున గిద్దలూరు, దర్శి, ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిర్వహించనున్న ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొననున్నారు. -
తెదేపా అధినేత పర్యటన వాయిదా
[ 29-04-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మే 3, 4 తేదీల్లో జిల్లాలో పర్యటించనున్నారు. -
69,918 మందికి ఇళ్ల వద్దే పింఛను
[ 29-04-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నియమావళి దృష్ట్యా వైకాపా కార్యకర్తలుగా భావిస్తున్న గ్రామ, వార్డు వాలంటీర్లను సామాజిక పింఛన్ల పంపిణీ బాధ్యత నుంచి ఈసీ తప్పించింది. -
జనం ‘చెవి’లో ప్రలోభాల పువ్వులు
[ 29-04-2024]
రాజకీయ బదిలీపై రాయలసీమ నుంచి నుంచి అధిష్ఠానం ఆ నేతను జిల్లాకు బలవంతంగా పంపింది. వస్తూనే ఏకంగా జిల్లా పోలీసు బాస్నే వెంట తెచ్చుకున్నారు. -
వైకాపాకు ఓట్లేయాలని చర్చిలో ప్రసంగం
[ 29-04-2024]
ఎన్నికల్లో ఎలాగైనా గెలుపొందాలనే లక్ష్యంతో వైకాపా నాయకులు ఎన్ని అడ్డదారులైనా తొక్కడానికి వెనుకాడడం లేదు. కొండపి మండలంలో ఆదివారం రాత్రి జరిగిన సంఘటనే ఇందుకు నిదర్శనం. -
జిల్లాలో సైకిల్ జోరు
[ 29-04-2024]
ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెదేపాలో చేరికలు జోరందుకున్నాయి. వైకాపాకు చెందిన పలువురు నేతలు, అభిమానులు సైకిలెక్కుతున్నారు. -
తగాదా అడ్డుకోబోతే కడతేర్చారు
[ 29-04-2024]
సోదరి కుటుంబంలో తగాదాను అడ్డుకోబోయిన తమ్ముడు కత్తిపోట్లకు గురై మృతిచెందాడు. దర్శి మండలం రాజంపల్లిలో ఆదివారం ఈ విషాద సంఘటన చోటు చేసుకుంది. -
వైకాపా పాలనకు చరమగీతం పాడాలి
[ 29-04-2024]
బీసీల సంక్షేమానికి తెదేపా కట్టుబడి ఉందని మాజీ ఎమ్మెల్యే, గిద్దలూరు నియోజకవర్గ తెదేపా అభ్యర్థి ముత్తుముల అశోక్రెడ్డి పేర్కొన్నారు. -
అత్యవసరంపై.. అంతులేని నిర్లక్ష్యం
[ 29-04-2024]
అర్థవీడుకు అత్యవసర సేవలు దూరమాయ్యాయి. ఏళ్ల కాలంగా ఉన్న ఒక్క అత్యవసర వాహనం అర్థవీడుకు పరిమితమైంది. లోయ గ్రామీణులకు అత్యవసర వైద్యం అందాలన్న..
తాజా వార్తలు (Latest News)
-
శంషాబాద్ ఎయిర్పోర్టు పరిసరాల్లో చిరుత కోసం కొనసాగుతున్న గాలింపు
-
భారీ ధరకు ‘తండేల్’ ఓటీటీ రైట్స్.. చైతూ కెరీర్లో బిగ్ డీల్
-
భారత్లో నథింగ్ ఫోన్ 2ఏ స్పెషల్ ఎడిషన్.. ధర, ఫీచర్లివే..!
-
ఛేజింగ్కి వస్తే... హైదరా‘బాధ’ తప్పదా?
-
కెనడా ప్రధాని ట్రూడో సమక్షంలో.. ‘ఖలిస్థానీ’ నినాదాలు
-
బాలీవుడ్ స్టార్స్తో ఎన్టీఆర్.. వీడియో వైరల్