CM Jagan: యాక్టర్ జగన్.. ఎన్నికల లబ్ధికి ఉత్తుత్తి శిబిరాలు
ఒంగోలు నగరంలోని మంగమూరు రోడ్డు మిలటరీ కాలనీకి చెందిన రమణమ్మ అనే మహిళ ఇటీవల బిడ్డకు జన్మనిచ్చింది. పదో వారంలో వ్యాక్సిన్ వేయించడానికి పట్టణ ఆరోగ్య కేంద్రానికి వెళ్లగా.. అక్కడి సిబ్బంది స్టాక్ లేదని చెప్పారు.
మందుల్లేకుండానే వైద్య చికిత్సలు
ప్రజలతో వైకాపా సర్కారు ఆటలు
జగన్నాటకంలా ‘ఫ్యామిలీ డాక్టర్’ తీరు
ఒంగోలు నగరంలోని మంగమూరు రోడ్డు మిలటరీ కాలనీకి చెందిన రమణమ్మ అనే మహిళ ఇటీవల బిడ్డకు జన్మనిచ్చింది. పదో వారంలో వ్యాక్సిన్ వేయించడానికి పట్టణ ఆరోగ్య కేంద్రానికి వెళ్లగా.. అక్కడి సిబ్బంది స్టాక్ లేదని చెప్పారు. మళ్లీ వారం తర్వాత వెళ్లినప్పటికీ అదే సమాధానం ఎదురైంది. ప్రైవేట్గా వ్యాక్సిన్ వేయించుకునే ఆర్థిక స్తోమత లేక ఆమె దిక్కుతోచని స్థితిలో ఉండిపోయింది. ఇలా నిత్యం అనేకమంది పిల్లలకు అవసరమైన వ్యాధి నిరోధక టీకాల కోసం ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు. నిర్ణీత షెడ్యూల్ ప్రకారం వేయించకపోతే పిల్లలకు అనారోగ్య సమస్యలు వస్తాయని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
న్యూస్టుడే, ఒంగోలు నగరం
రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా చెప్పుకొంటున్న ఫ్యామిలీ డాక్టర్ విధానం, ఆరోగ్య సురక్షా అమలు తీరు ఆచరణలో ఓ నాటకాన్ని తలపిస్తున్నాయి. ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ రెండు విధానాలను అమలులోకి తెచ్చింది. పాత సీసాలో కొత్త మందు పోసినట్లు ఫ్యామిలీ డాక్టర్ విధానం కొనసాగుతోంది.
రోగులంటూ ఆధార్ నంబర్ల నమోదు...
గతంలో 104 ద్వారా అందించిన సేవలకే కొత్త పేరు పెట్టి వైకాపా ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. ఫ్యామిలీ డాక్టర్ విధానంలో ప్రతి పీహెచ్సీకి ఇద్దరు వైద్యుల్ని నియమించింది. వీరిలో ఒకరు నెలలో ఒకసారి గ్రామానికి మొబైల్ వాహనంలో వెళ్లి వైద్యసేవలందించాల్సి ఉంటుంది. అవసరమైన మందులు లేకుండానే ఈ కార్యక్రమం నామమాత్రంగా నడుపుతోంది. చిన్నపిల్లలకు అవసరమైన యాంటీ బయాటిక్స్ మందులు అందుబాటులో లేవు. కొన్ని సందర్భాల్లో జ్వరానికి వాడే పారాసిటిమల్ మాత్రలు కూడా ఉండటం లేదు. గ్రామాలకు వెళ్లిన వైద్యులు.. ఉన్నతాధికారులకు తప్పుడు ప్రోగ్రెస్ రిపోర్టులు సమర్పించి మమ అనిపిస్తున్నారు. ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో ప్రతి గ్రామానికి పీహెచ్సీ వైద్యాధికారులతో పాటు స్పెషలిస్టు వైద్యులు వెళ్లాల్సి ఉంది. గత కొన్ని నెలలుగా వారెవరూ కానరావడం లేదు. ప్రతి శిబిరంలో కనీసం 300 మందికి సేవలందించాలని లక్ష్యం విధించారు. మందుల్లేక రోగులు రాకపోవడంతో వారి గ్రామాల్లో ప్రజల ఆధార్ నంబర్లు సేకరించి పరీక్షలు, వైద్యం అందించినట్లు ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు.
గోళీలకూ చాలని బడ్జెట్...
ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి మూడు నెలలకు సరిపోయేలా ఏటా నాలుగు సార్లు మందులు అందజేయాల్సి ఉంటుంది. పీహెచ్సీలో నమోదయ్యే ఓపీల సంఖ్యను బట్టి రూ.40 వేల నుంచి రూ.2 లక్షల విలువైన మందులు ఇవ్వాలి. ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ మొదటి వారంలో ఇవ్వాల్సిన మందులు ఇంతవరకు పీహెచ్సీలకు ఇవ్వలేదు. గిద్దలూరు మండలం రాజుపాలెం, కొనకనమిట్ల, తాళ్లూరు మండలం గంగవరం, మద్దిపాడు వంటి కేంద్రాల్లో ఓపీలు రోజుకు 40 వరకు వస్తాయి. దీంతో వారికి కేటాయించిన బడ్జెట్ సరిపోక మందులు బయట తెచ్చుకోమని సూచిస్తున్నారు.
పురిటి బిడ్డల ఆరోగ్యంతో చెలగాటం...
పీహెచ్సీలు, సీహెచ్సీలు, ఏరియా ఆసుపత్రులు, జీజీహెచ్కి సెంట్రల్ డ్రగ్ స్టోర్ ద్వారా వ్యాక్సిన్లు సరఫరా అవుతాయి. వాటిని డీఎంహెచ్వో పరిధిలోని వ్యాక్సిన్ నిల్వ కేంద్రంలో భద్రపరచి కోల్డ్ స్టోరేజి బాక్సుల్లో పీహెచ్సీలకు పంపుతారు. మార్చి 15 తర్వాత ఎక్కడా వ్యాక్సిన్లు అందుబాటులో లేవు. పిల్లలకు హెపటైటిస్, కోరింత దగ్గు వంటివి రాకుండా అయిదు రకాల వ్యాధులకు ఉపయోగపడే పెంటావాలెంట్ వ్యాక్సిన్ ప్రవేశపెట్టారు. వీటిని పుట్టిన బిడ్డలకు ఆరు, పది, 14వ వారాల్లో షెడ్యూల్ ప్రకారం వేయాలి. అదేవిధంగా డిప్తీరియా, పర్ట్యూసిస్, టెటనస్ రాకుండా డీపీటీ వ్యాక్సిన్ నిర్ణీత నెలల్లో వేయాలి. ఈ రెండూ ప్రస్తుతం అందుబాటులో లేవు. వీటిని వేయించడానికి ఆసుపత్రికి పిల్లల్ని తీసుకొచ్చిన వారు నిరాశగా వెనుతిరుగుతున్నారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో వీటి ఖరీదు రూ.3 వేల వరకు ఉంటుంది. ఇంత ప్రాధాన్యత కలిగిన టీకాలను అందుబాటులో ఉంచకుండా పిల్లల ఆరోగ్యంతో ప్రభుత్వం ఆటలాడుకుంటోంది. దీనిపై డీఎంహెచ్వో డాక్టర్ ఎస్.రాజ్యలక్ష్మిని వివరణ కోరగా.. ప్రతిపాదనలు పంపామమని, త్వరలో సరఫరా అవుతాయన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏలికే ‘ఇంటి’కి పట్టిన శని
[ 02-05-2024]
సీఎం జగన్ చెప్పే కట్టుకథలకు జగనన్న కాలనీలే నిలువెత్తు నిదర్శనం. ఇళ్లు కాదు ఊళ్లంటూ మైకులు పగిలేలా అరిచి చెప్పారు. రొచ్చుగుంతలు, రాళ్లగుట్టలు, శ్మశానాల చెంత, చెరువులు, లోతట్టు ప్రాంతాల్లో స్థలాలు సేకరించారు. -
వైకాపా మద్యమా.. మాకేం కనిపించదు
[ 02-05-2024]
‘రాష్ట్రంలో దశలవారీగా మద్య నిషేధం విధిస్తాం. మద్యం ముట్టుకోవాలంటేనే భయం పుట్టేలా చేస్తాం. కేవలం ఫైవ్ స్టార్ హోటళ్లకే పరిమితం చేస్తాం. పూర్తిగా మద్యనిషేధం విధించిన తర్వాతే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడిగేందుకు మీ ముందుకొస్తాం.. -
సార్వత్రిక రణం.. హోరెత్తుతున్న ప్రచారం
[ 02-05-2024]
సార్వత్రిక ఎన్నికలకు మరో 11 రోజులే గడువుంది. దీంతో అన్ని పార్టీలకు చెందిన అభ్యర్థులు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. వీరికితోడుగా ఆయా పార్టీల అధినేతలు జిల్లాకు వరుస కడుతున్నారు. -
అధికారాంతమునా అరాచకం
[ 02-05-2024]
ఎన్నికల వేళా వైకాపాలోని భూ బకాసురుల ఆగడాలకు అడ్డుకట్ట పడటం లేదు. విలువైన భూములపై కన్నేస్తున్నారు. అధికారం చేతిలో ఉన్నప్పుడే వాటిలో పాగా వేసేందుకు తహతహలాడుతున్నారు. -
అయిదేళ్లలో కుమ్ముడు
[ 02-05-2024]
గుట్టుగా దాచుకున్న సంపదను అభ్యర్థులు నామపత్ర సమర్పణ వేళ కొంతైనా వెల్లడించాల్సి వచ్చింది. నామపత్ర సాక్షిగా వైకాపా అభ్యర్థులు భారీగానే ఆస్తులు పోగేసుకున్నట్టు తేటతెల్లమైంది. వలస పక్షుల్లా వాలిన మేరుగు నాగార్జున, చెవిరెడ్డి మూడు రెట్లు, మంత్రి సురేష్ రెట్టింపు సంపద కూడబెట్టుకున్నారు. -
జల‘కల’ భగ్నం
[ 02-05-2024]
వ్యవసాయ ఉత్పాదకత పెంపులో భాగంగా రైతులకు ఉచితంగా వ్యవసాయ బోర్లు వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్ జలకళ పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. అందులో భాగంగా చిన్న, సన్నకారు రైతులకు చెందిన పంట పొలాల్లో ఉచితంగా అమర్చాలన్నదే పథకం ఉద్దేశం. -
ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్ సీట్లూ వదలొద్దు
[ 02-05-2024]
ఓటర్లను ప్రభావితం చేసేలా నగదు, మద్యం, ఇతర వస్తువులు పంపిణీ చేపట్టకుండా పటిష్ఠ నిఘా అవసరమని ఎన్నికల వ్యయ ప్రత్యేక పరిశీలకులు నీనా నిగమ్ సూచించారు. -
నిరుద్యోగ యువత వేసే మార్కులు సున్నా
[ 02-05-2024]
ప్రోగ్రెస్ కార్డు మీ ముందుంచుతున్నాను.. మార్కులు మీరే వేయాలంటూ పదే పదే చెబుతున్న సీఎం జగన్కు నిరుద్యోగ యువతగా తామిచ్చేది సున్నా అని పాదయాత్ర బృందం సభ్యులు ఎద్దేవా చేశారు. -
జై చెన్నకేశవా.. జైజై చెన్నకేశవా
[ 02-05-2024]
నాలుగు యుగాల దేవుడిగా భక్తుల నుంచి పూజలందుకునే మార్కాపురం పట్టణంలోని శ్రీలక్ష్మీచెన్నకేశవస్వామి రథోత్సవం బుధవారం రాత్రి అత్యంత వైభవంగా సాగింది. తొలుత శ్రీదేవి, భూదేవి సమేత స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు. -
ఓటమి భయం.. తపాలా ఓట్లకు గాలం
[ 02-05-2024]
ఓటమి భయం వైకాపాను వెంటాడుతోంది. ఉద్యోగుల్లో ఆ పార్టీపై పూర్తి వ్యతిరేకత ఉండటం అభ్యర్థులను బెంబేలెత్తిస్తోంది. దీంతో ప్రలోభాల పరంపరను మరింత ముమ్మరం చేసింది. తమ నాయకుల ద్వారా ఆ పార్టీలోని కొందరు అనుకూల ఉద్యోగ, ఉపాధ్యాయులతో ఇతరుల ఓట్లకు గాలం వేస్తోంది. -
కబ్జా చెరలో చారిత్రక దుర్గం
[ 02-05-2024]
చారిత్రక కనిగిరి దుర్గానికీ దొంగపట్టా సృష్టించి ఆక్రమించుకుంటున్నారని స్థానికులు వాపోతున్నారు. నాటి రాజసానికి నిలువెత్తు నిదర్శనంగా ఉన్న కోటను, కొండరాళ్లను ధ్వంసం చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. -
వైకాపా నేత అయినాబత్తిన తెదేపాలో చేరిక
[ 02-05-2024]
ఒంగోలులో బుధవారం జరిగిన ఓ కార్యక్రమంలో వైకాపా నాయకుడు, ఏఎంసీ మాజీ ఛైర్మన్ అయినాబత్తిన ఘనశ్యామ్ తెదేపాలో చేరారు. -
పన్ను పెంపు.. బాదుడే బాదుడు
[ 02-05-2024]
ఇంటి పన్నుల నోటీసులు చూసి పట్టణవాసులు హడలిపోతున్నారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆస్తి విలువ ఆధారిత పన్ను పెంపు విధానంతో ఇంటి యజమానులపై ప్రతి ఏడాది అదనపు భారం పడుతోంది. -
వైకాపా దర్శి అభ్యర్థి ఎదుటే బాహాబాహీ
[ 02-05-2024]
వర్గ విబేధాలు వైకాపాను వీడటం లేదు. అన్ని నియోజకవర్గాల్లోనూ నాయకులు వేరు కుంపట్లుగా ఏర్పడ్డారు. ఒకరిపై ఒకరు తరచూ విమర్శలు చేసుకోవడంతో పాటు ఏదేని సందర్భం వస్తే గిట్టని వారిపై దాడులకూ తెగబడుతున్నారు. -
కార్మికుల పనివేళలు రీ షెడ్యూల్ చేయాలి
[ 02-05-2024]
జిల్లాలో ఉష్ణోగ్రతలు, వడగాలులు అధికంగా ఉన్నందున వివిధ రంగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికుల పనివేళలను రీ షెడ్యూల్ చేయాలని కార్మికశాఖ ఉప కమిషనర్ ఎస్.శ్రీనివాస్ కుమార్ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
50MP సెల్ఫీ కెమెరాతో వివో కొత్త ఫోన్.. 4 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్స్
-
పింఛను దారులను అష్టకష్టాలు పెడుతున్న జగన్
-
చెన్నైకి షాక్ తప్పదా.. ఐదుగురు బౌలర్ల గైర్హాజరీపై ఫ్లెమింగ్ ఏమన్నాడంటే?
-
4 కంటైనర్లలో రూ.2వేల కోట్లు పట్టివేత!
-
సిద్ధార్థ్తో నిశ్చితార్థం.. అందుకే వెల్లడించాల్సి వచ్చింది: అదితిరావు
-
లైంగిక దౌర్జన్యం కేసు.. ప్రజ్వల్ రేవణ్ణపై లుక్అవుట్ నోటీసు