చివరి గింజ వరకూ కొంటాం
రైతుల నుంచి పూర్తిస్థాయిలో ధాన్యం కొనుగోలు చేయడానికి కట్టుబడి ఉన్నామని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం.విజయసునీత స్పష్టం చేశారు. ఆదిలో కొనుగోళ్లు కొంత నెమ్మదిగా ఉన్నా రెండు వారాల నుంచి వేగంగా జరుగుతున్నాయన్నారు. ‘
రైతుల నుంచి పూర్తిస్థాయిలో ధాన్యం కొనుగోలు చేయడానికి కట్టుబడి ఉన్నామని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం.విజయసునీత స్పష్టం చేశారు. ఆదిలో కొనుగోళ్లు కొంత నెమ్మదిగా ఉన్నా రెండు వారాల నుంచి వేగంగా జరుగుతున్నాయన్నారు. ‘ఈనాడు డిజిటల్’తో ముఖాముఖిలో మరిన్ని విషయాలు వెల్లడించారు.
లక్ష్యాన్ని సమీక్షిస్తాం...
మొత్తం 7.8 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్లు లక్ష్యంగా పెట్టుకున్నాం. దిగుబడులు ఆ మేరకు కనిపించడం లేదు. ఇప్పటివరకూ 2.15 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించాం. లక్ష్యాన్ని సమీక్షిస్తాం. అవసరాన్ని బట్టి మార్పులు చేస్తాం. రైతుల దగ్గరున్న చివరి గింజ వరకూ కొంటాం. ఆందోళన అవసరంలేదు.
మిల్లర్లు తీసుకోవాల్సిందే
అధికారులు, మిల్లర్ల మధ్య తేమ శాతం విషయంలో కొన్నిచోట్ల వ్యత్యాసాలొచ్చినట్లు నా దృష్టికి వచ్చింది. తక్షణమే సంబంధిత మండల అధికారులు, మిల్లర్లతో మాట్లాడాం. కొందరు మిల్లర్లను హెచ్చరించాం. ప్రస్తుతం జిల్లాలో ఎక్కడ ధాన్యం పరిశీలించినా తేమ శాతం 14కి మించట్లేదు. 17 వరకూ అనుమతి ఉంది. ఆర్బీకే సిబ్బంది తేమ శాతం పరీక్షించిన తర్వాత మిల్లర్లు ధాన్యం తీసుకోవాల్సిందే. మరోసారి పరీక్షించి ధాన్యం వెనక్కి పంపించడం కుదరదు.
రంగుమారిన ధాన్యమూ..
రంగుమారిన, తడిసిన ధాన్యం కొనుగోళ్లు ఇప్పటికే ప్రారంభించాం. ఇటీవల వాటిని పరిశీలించడానికి కేంద్ర బృందం క్షేత్రస్థాయికి వచ్చి వెళ్లింది. రైతులెవరికైనా ఇబ్బందులు తలెత్తితే ఫోన్ చేసి సహాయం పొందొచ్ఛు ● చట్టబద్ధ కౌలుదారు, సాగుదారుల నుంచి మాత్రమే ధాన్యం సేకరిస్తున్నాం. ఎలాంటి అనుమతుల్లేకుండా, ఆక్రమించుకుని కొందరు సాగు చేస్తుంటే వారి నుంచి తీసుకోవడం సాధ్యం కాదు.
పరిశీలించి చర్యలు
అగ్ని ప్రమాదాలు ఎలా జరిగాయన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది. పంట కోసిన తర్వాత పరిహారం వర్తించదు. చేతికొచ్చిన ధాన్యం అగ్ని ప్రమాదానికి గురికావడం బాధాకరం. వాటిపై పూర్తి వివరాలు అందిన తర్వాత పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకుంటాం.
ఎంఐజీ పథకానికి మంచి స్పందన
అర్బన్ లేఅవుట్లు కావడంతో ఎంజీఐ పథకానికి మంచి స్పందన ఉంది. ఇప్పటికే వచ్చిన దరఖాస్తుల ఆధారంగా ఎంత భూమి అవసరమనేది లెక్కించాం. దాదాపు 1,585 ఎకరాల అవసరమైంది. భవిష్యత్తులో ఇంకా ఎక్కువ మంది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని అనుకుంటున్నాం. ఆక్రమణలు, అవరోధాలు, కోర్టు కేసులు లేని భూమిని సేకరించాలని స్పష్టమైన ఆదేశాలు వచ్చాయి. ఆ మేరకే క్షేత్రస్థాయిలో తహసీల్దార్లు భూమిని పరిశీలించి ప్రతిపాదనలు పంపించారు. వీలైనంత వరకు పట్టణానికి దగ్గర ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రెట్టింపు సంక్షేమం.. అభివృద్ధికి ప్రాధాన్యం
[ 08-05-2024]
‘జగన్ అయిదేళ్ల పాలనలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రైతులకు సాగునీరివ్వకపోవడంతో తీవ్రంగా నష్టపోయారు. యువతకు ఉద్యోగాలు కల్పించకుండా మోసం చేశారు. ఉద్యోగులను భయాందోళనలకు గురి చేసి వారిని మద్యం దుకాణాల వద్ద కాపలా పెట్టి అడుగడుగునా అవమానించారు. -
చేసింది తక్కువ.. చెప్పింది ఎక్కువ..!
[ 08-05-2024]
జిల్లాను తానే ఉద్ధరించినట్లుగా ముఖ్యమంత్రి జగన్ మంగళవారం ఇచ్ఛాపురం ఎన్నికల ప్రచార సభలో ఊదరగొట్టారు. చెప్పుకోవడానికి ఒక్క పనీ పూర్తి చేయకుండానే.. ఎంతో అభివృద్ధి చేసేశామంటూ డప్పు కొట్టారు. సీఎం ప్రసంగం విని ప్రజలు విస్మయానికి గురయ్యారు. -
హామీని తుంగలో తొక్కేశారు..!
[ 08-05-2024]
ఉద్దానంలో తెల్ల బంగారంగా పిలిచే జీడి పిక్కలకు మద్దతు ధర దక్కక రైతులు కుదేలవుతున్నారు. వారిని ఆదుకుంటామని నమ్మబలికిన వైకాపా ప్రభుత్వం అదిగో ఇదిగో అంటూ అయిదేళ్లు గడిపేసింది. ధరలు క్రమేపీ దిగజారిపోతుండటం.. -
ప్రభుత్వ పథకాలపై ఎన్నికల సంఘం పెత్తనమేంటి?
[ 08-05-2024]
రాష్ట్రంలో అయిదేళ్లుగా అమలు చేస్తున్న ప్రభుత్వ పథకాలపై ఎన్నికల సంఘం పెత్తనమేంటని ఎమ్మెల్సీ, వైకాపా టెక్కలి ఎమ్మెల్యే అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్ ప్రశ్నించారు. టెక్కలిలో మంగళవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. -
పదవులిచ్చిన పేటకు.. దాసన్న ద్రోహం..!
[ 08-05-2024]
అభివృద్ధికి దూరంగా ఉన్న నరసన్నపేట నియోజకవర్గాన్ని ప్రగతి పథంలో నడిపిస్తామని గత ఎన్నికల సమయంలో ధర్మాన కృష్ణదాస్ హామీలు గుప్పించారు. ఆ మాటలు నమ్మిన ప్రజలు ఓట్లు వేసి అందలమెక్కించారు. ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ మంత్రి పదవులు అనుభవించినా సొంత నియోజకవర్గానికి ఆయన పెద్దగా ఒరగబెట్టిందేమీ లేదు. -
చేయూత అందించడానికి చేతులు రాలేదు..!
[ 08-05-2024]
ఎచ్చెర్ల మండలం తమ్మినాయుడుపేటకు చెందిన వి.వైకుంఠరావు వెల్డింగ్ పనిలో నిపుణుడు. కొన్నేళ్ల నుంచి రోజు కూలీగా పని చేస్తున్నాడు. రూ.రెండు మూడు లక్షలతో సొంతంగా దుకాణం ఏర్పాటు చేసుకోవాలని ఉన్నా ఆర్థిక పరిస్థితి బాగాలేక.. అప్పు పుట్టక రోజు ఆశ నెరవేరలేదు. -
మాటకు కట్టుబడి రహదారి నిర్మాణానికి సన్నాహాలు
[ 08-05-2024]
ఆయన ఏ పార్టీలో ఉంటే తనతో పాటే ఆ అయిదు గ్రామాల ప్రజలు ఉంటారు. ఇటీవల వైకాపా నుంచి 2 వేల మందితో తెదేపాలో చేరిన కరగాం సర్పంచి పంగ బావాజీనాయుడు పెద్ద కరగాం గ్రామ శ్మశానవాటికకు రహదారి నిర్మాణానికి సొంత నిధులు వెచ్చిస్తున్నారు. -
చిట్టీవ్యాపారిని చుట్టుముట్టిన బాధితులు
[ 08-05-2024]
టెక్కలిలో చిట్టీల పేరుతో మోసం చేసి పరారైన మహిళ సబితాదేవిని బాధితులు మంగళవారం చుట్టుముట్టారు. ముఖానికి వస్త్రం కట్టుకొని స్థానిక బ్యాంకులో బంగారం ఆభరణాలపై ఉన్న రుణాన్ని రెన్యువల్ చేసుకునేందుకు వచ్చి వెళ్తుండగా ఆమెను గుర్తించి అడ్డుకున్నారు. -
నౌపడలో ఓటర్లకు వైకాపా ప్రలోభం
[ 08-05-2024]
సంతబొమ్మాళి మండలం నౌపడ గ్రామంలో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు వైకాపా కార్యకర్తలు, నాయకులు పావులు కదుపుతున్నారు. పోలింగ్ తేదీ దగ్గరపడుతుండటంతో తమ పార్టీకే ఓటు పడుతోంది అని నిర్ధారించుకున్న ఇళ్లకు వెళ్లి చిట్టీలను ఇస్తున్నారు.