విశ్వేశ్వరయ్యను వీడని శాపం..!
నరసన్నపేట నియోజకవర్గ కేంద్రానికి కూరగాయల మార్కెట్ కరవైంది. పాలకులు ప్రజల అవసరాలను పట్టించుకోకకపోవడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది.
వినియోగంలోకి రాని కూరగాయల మార్కెట్
నిధుల్లేక చేతులెత్తేసిన పంచాయతీ
న్యూస్టుడే, నరసన్నపేట
శిథిలమైన దుకాణ సముదాయం
నరసన్నపేట నియోజకవర్గ కేంద్రానికి కూరగాయల మార్కెట్ కరవైంది. పాలకులు ప్రజల అవసరాలను పట్టించుకోకకపోవడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది. నరసన్నపేట ఎమ్మెల్యే దీని నిర్మాణాలకు తోడ్పడతారని ఎన్నో ఆశలు పెట్టుకున్న మేజర్ పంచాయతీ ప్రజల కల నెరవేరడం లేదు. మరోవైపు ఈ సమస్యను పరిష్కరించేందుకు గ్రామ పంచాయతీ వద్ద నిధుల లేమి వెంటాడుతుండటంతో విశ్వేశ్వరయ్య కూరగాయల మార్కెట్ రెండు దశాబ్దాలుగా నిరుపయోగంగా ఉంది. ప్రస్తుతం కూరగాయల దుకాణ సముదాయాలు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. పూర్తిగా ప్రారంభానికి నోచుకోకుండానే శిథిలావస్థకు చేరింది. ప్రభుత్వాలు మారినపుడల్లా ఈ సమస్యకు మోక్షం కలుగుతుందని ఎదురుచూస్తున్నారు.
నరసన్నపేటలో 2001 జనవరి 13న కూరగాయల దుకాణాలు అగ్నిప్రమాదానికి గురయ్యాయి. అప్పట్లో ఈ ప్రమాదంలో 8 దుకాణాలు కాలిపోగా, ప్రభుత్వం డీఆర్డీఏ నుంచి నిధులు సమకూర్చి పక్కా దుకాణ సముదాయన్ని నిర్మించింది. విశ్వేశ్వరయ్య కూరగాయల మార్కెట్ పేరుతో 52 దుకాణాలను నిర్మించి ఒకేచోట కూరగాయాల వ్యాపారాలకు స్థానం కల్పించారు. దాదాపు రూ.10 లక్షలతో నిర్మించిన విశ్వేశ్వరయ్య కూరగాయల మార్కెట్ 2003 ఆగస్టు 23న ప్రారంభించారు. నాటి నుంచి ఈ దుకాణ సముదాయం వివాదాల్లో చిక్కుకుంది. నిర్మాణంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో వ్యాపారులు దుకాణాల వినియోగానికి ఆసక్తి చూపలేదు. ముందు వరుసలో ఉన్న దుకాణాలకే వ్యాపారులు మొగ్గుచూపడంతో వెనుక వరుస దుకాణాలు నిరుపయోగంగా మారాయి. మరోవైపు వ్యాపారుల నుంచి లబ్ధిదారుల వాటాగా రూ.10వేలు వసూలు చేశారు. భవనాలు శిథిలావస్థకు చేరడంతో పలుమార్లు మరమ్మతులు చేసినా ఫలితం లేకపోయింది. దీంతో వ్యాపారులు న్యాయం చేయాలని లోకాయుక్తను ఆశ్రయించారు.
రోడ్ల పైనే దుకాణాలు
నరసన్నపేటలో రోడ్డంతా కూరగాయల దుకాణాలు వెలిశాయి. కాలేజీ రోడ్డుకు ఇరువైపులా గుత్త దకాణాలతో పాటు తోపుడుబళ్ల వ్యాపారాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. బజారులోని విశ్వేశ్వరయ్య కూరగాయల మార్కెట్కు వెళ్లి కొనేవారే లేకపోవడంతో కూరగాయల మార్కెట్తో పాటు ఇతర వ్యాపారాలు పడిపోయాయి. నిరుపయోగంతో పందులు, కుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. ఈ దుకాణ సముదాయాన్ని వినియోగంలోకి తేవాలంటే రూ.కోట్లు అవసరం ఉంటుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. దుకాణ సముదాయన్ని పూర్తిగా తొలగించి రైతుబజారులా మారిస్తేనే వినియోగంలోకి వస్తుంది. ఇక గ్రామ పంచాయతీ వద్ద నిధుల లేమితో ఈ మార్కెట్ ఊసెత్తడం లేదు. పంచాయతీ వద్ద అందుబాటులో ఉన్న నిధులు కేవలం మార్కెట్ నిర్వహణకే సరిపోతోంది. ప్రభుత్వం ముందుకొచ్చి ఈ దుకాణ సముదాయాన్ని పునర్ నిర్మించాల్సి ఉంది. ఇటీవల ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నరసన్నపేట వచ్చినప్పుడు కూడా ఈ కూరగాయల మార్కెట్ ఊసెత్తకపోవడం గమనార్హం.
వ్యాపారులు ఆసక్తి చూపడంలేదు
రోడ్లపై ఉన్న కూరగాయల మార్కెట్ వల్ల విశ్వేశ్వరయ్య కూరగాయల మార్కెట్లో వ్యాపారులు చేసేందుకు లబ్ధిదారులు ఆసక్తి చూపడం లేదు. ప్రభుత్వం చొరవ చూపితేనే సమస్య పరిష్కారమవుతుంది. రెండు దశాబ్దాలుగా మార్కెట్పై ఆశలు నీరుగారిపోయాయి. విశాలమైన స్థలం ఉన్నా సరైన కూరగాయల మార్కెట్ లేదు.
అప్పారావు, శాంతామణి కూరగాయల వ్యాపారుల సంఘం కార్యదర్శి
నిధుల్లేక చేయలేకపోతున్నాం..
గ్రామ పంచాయతీని నిధుల సమస్య వెంటాడుతోంది. రూ.కోట్లు ఖర్చు చేస్తేనే విశ్వేశ్వరయ్య కూరగాయల మార్కెట్ను వినియోగంలోకి తీసుకురాగలం. కాలేజీ రోడ్డుకు ఇరువైపులా ఉన్న దుకాణాలను అడ్డుకోవాల్సి ఉంది.
బూరెళ్ల శంకరరావు, సర్పంచి, నరసన్నపేట
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జనం జాగాలపైకి జ‘గన్’..!
[ 05-05-2024]
వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత భూఆక్రమణలకు కొదవ లేకుండా పోయింది. ఖాళీ జాగా కనిపిస్తే అధికార మదంతో కబ్జా చేసేస్తున్నారు. ప్రశ్నిస్తే వివాదాలకు దిగుతున్నారు. ఇలాంటి తరుణంలో ప్రజల ఆస్తులకు రక్షణ లేకుండా చేసేందుకు జగన్ కొత్త ఎత్తుగడతో జనాల ముందుకు వస్తున్నారు. -
ప్రతి మహిళకు నెలకు రూ.1,500
[ 05-05-2024]
‘వైకాపా పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడ్డారు. కేసులతో వేధింపులకు గురిచేసి భయానక వాతావరణాన్ని సృష్టించారు. ఏటా జాబ్ క్యాలెండర్ అంటూ ప్రకటించి నిరుద్యోగ యువతను మోసం చేశారు. -
‘దీవెన’ పేరుతో దగా!
[ 05-05-2024]
జడ్పీ, ఇతర సమావేశాల్లో ప్రజాప్రతినిధులకు అధికారులు ఇచ్చే వివరాల్లో వసతి దీవెన రెండు విడతలకు ఒకసారే ఇచ్చారని నమోదు చేస్తున్నారు. ప్రభుత్వం విద్యార్థులందరికీ రెండో విడత జమ చేయనట్లే లెక్క. -
పోర్టు నిర్వాసితులకు న్యాయం చేస్తాం
[ 05-05-2024]
వైకాపా నాయకులు పోర్టు నిర్మాణం పేరుతో ఈ ప్రాంత సహజ వనరులను దోచుకుంటున్నారని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు, టెక్కలి ఎమ్మెల్యే అభ్యర్థి కింజరాపు అచ్చెన్నాయుడు ఆరోపించారు. -
పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రారంభం
[ 05-05-2024]
జిల్లాలో సార్వత్రిక ఎన్నికల పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ శనివారం ప్రారంభమైంది. మొత్తం 8 నియోజకవర్గాల పరిధిలో ప్రక్రియ నిర్వహించారు. -
చంద్రబాబుతోనే ప్రగతి సాధ్యం
[ 05-05-2024]
తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబును ముఖ్యమంత్రి చేస్తేనే రాష్ట్రం ప్రగతి బాటలో పయనిస్తుందని సినీ నటుడు నారా రోహిత్ పేర్కొన్నారు. జిల్లాలో శనివారం ఆయన పర్యటించారు. -
అవే బాధలు.. అందలేదు డబ్బులు
[ 05-05-2024]
పింఛను ఇబ్బందులు ఇంకా తీరలేదు. ఇప్పటికీ వృద్ధులు బ్యాంకుల వద్ద పడిగాపులు కాస్తున్నారు. మేడలపై ఉన్న బ్యాంకులు ఎక్కలేక ఇబ్బందులు పడుతున్నారు. -
ఎత్తిపోతలపై కన్నెత్తి చూడని ప్రభుత్వం..!
[ 05-05-2024]
కాలువల సదుపాయం లేని వ్యవసాయ భూములకు ఎత్తిపోతల పథకాలే శరణ్యం. దీనిని గుర్తించిన తెదేపా ప్రభుత్వ వాటికి అధిక ప్రాధాన్యం ఇచ్చింది. నిధుల మంజూరుతో పాటు, నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టడంతో అన్నదాతల సాగునీటి ఇబ్బందులు తీరాయి. -
ఒకేసారి ఇద్దరు,ముగ్గురు ఓటు
[ 05-05-2024]
ఉద్యోగుల పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ శనివారం గందరగోళంగా సాగింది. నరసన్నపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో నాలుగు మండలాల ఉద్యోగుల కోసం పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా, ఉదయం నుంచే ఉద్యోగుల తాకిడి పెరిగింది. -
డిగ్రీ సప్లిమెంటరీ పరీక్ష షెడ్యూల్లో స్వల్ప మార్పులు
[ 05-05-2024]
బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయం పరిధిలోని అనుబంధ డిగ్రీ కళాశాలలకు చెందిన విద్యార్థుల సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్లో స్వల్ప మార్పులు చేసినట్లు