7,124 మందికి ఇంటి నుంచే ఓటు!
85 ఏళ్లు దాటినవారు, అర్హులైన దివ్యాంగులకు పోస్టల్ బ్యాలెట్ప్రజాస్వామ్య దేశంలో అయిదేళ్లకోసారి ఓటు అనే వజ్రాయుధంతో పాలకులను ఎన్నుకునే సదావకాశం లభిస్తుంది.
85 ఏళ్లు దాటినవారు, అర్హులైన దివ్యాంగులకు పోస్టల్ బ్యాలెట్ప్రజాస్వామ్య దేశంలో అయిదేళ్లకోసారి ఓటు అనే వజ్రాయుధంతో పాలకులను ఎన్నుకునే సదావకాశం లభిస్తుంది. దీన్ని వినియోగించుకునేందుకు వరుసలో నిలబడాల్సిందే. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటేయాలి. సాంకేతిక పరిజ్ఞానం విస్తృతమైన ప్రస్తుత తరుణంలోనూ ఇదే విధానం కొనసాగుతోంది. ఈ క్రమంలో కొందరు పోలింగ్ కేంద్రాల వరకు వెళ్లలేక హక్కును వినియోగించుకోలేకపోతున్నారు. అలాంటి వారిలో వృద్ధులు, దివ్యాంగులు ఎక్కువగా ఉంటున్నట్లు ఎన్నికల సంఘం గుర్తించింది. పోలింగ్ కేంద్రాల వద్దకు వెళ్లలేని దివ్యాంగులు, 85 ఏళ్లు దాటిన వారు ఈసారి ఇంటి వద్దే ఓటేసే వెసులుబాటు కల్పించింది. ఇందుకు అర్హులు సంబంధిత ఎన్నికల అధికారులకు దరఖాస్తు చేసుకుంటే.. వారు అవకాశమిస్తారు.
న్యూస్టుడే, రణస్థలం
జిల్లావ్యాప్తంగా 18,59,910 మంది ఓటర్లు ఉన్నారు. వారిలో పురుషుల సంఖ్య 9,22,442 మంది, మహిళల సంఖ్య 9,37,329 మందిగా ఉంది. వారిలో దివ్యాంగ ఓటర్లు 4,501, 85 ఏళ్లు దాటినవారు 2,623 మంది ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వారికి ఇంటి వద్దే ఓటింగ్పై అవగాహన కల్పించేందుకు నోడల్ అధికారిగా డ్వామా పీడీ, ఇతర సభ్యులను జిల్లా ఎన్నికల అధికారి నియమించారు.
12డీ ద్వారా దరఖాస్తు..
హో ఓటింగ్కు అర్హులైన దివ్యాంగులు, వృద్ధులు బ్యాలెట్ ద్వారా ఓటు వేసేవారిని ముందుగా బూత్స్థాయి అధికారులు గుర్తించి.. వారి ఇంటికెళ్లి ఫారం -12డీ అందజేస్తారు. దాన్ని పూరించి ఇస్తే ఆ దరఖాస్తులను బీఎల్వోలు రిటర్నింగ్ అధికారికి పంపుతారు. సమగ్రంగా పరిశీలించి నిర్ధారించిన తరువాతే అర్హుల ఇంటికి పోస్టల్ బ్యాలెట్ పంపుతారు. వారిలో ఎవరైనా పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటేస్తామని చెబితే వారికి 12డీ దరఖాస్తులు ఇవ్వరు. పోలింగ్ కేంద్రాల్లోనూ దివ్యాంగులకు ర్యాంపులు, వృద్ధులకు చక్రాల కుర్చీలు అందుబాటులో ఉంటాయి.
రహస్య పద్ధతిలో ఓటింగ్..
ఫారం -12 డీ పూరించి ఇంటి వద్దే ఓటు వేయాలని దరఖాస్తు చేసుకున్నవారి ఇంటికి ఎన్నికల సిబ్బంది మొబైల్ వ్యానులో చేరుకుంటారు. ఇందులో ఇద్దరు పోలింగ్ అధికారులు, వీడియో గ్రాఫర్, మరో రక్షణ అధికారి ఉంటారు. అక్కడ ఓటరుకు పోస్టల్ బ్యాలెట్ అందజేస్తారు. అధికారులు నిర్దేశిత పోలింగ్ కంపార్ట్మెంట్లో ఓటరు రహస్యంగా ఓటు వేసి బ్యాలెట్ పెట్టెలో వేస్తారు. మొత్తం ప్రక్రియను అధికారులు పూర్తిగా చిత్రీకరిస్తారు. సాధారణ ఎన్నికలకు ఒక రోజు ముందుగానే ప్రక్రియ పూర్తి చేస్తారు.
అవగాహనతోనే మెరుగైన పోలింగ్
జిల్లాలో ఇంటి నుంచే ఓటు వేసేందుకు 7,124 మంది అర్హులున్నట్లు అధికారులు తేల్చారు. వారు దరఖాస్తు చేసుకుంటే ఎన్నికల సిబ్బంది ఇళ్లకు వెళ్లాల్సి ఉంది. ఈ విధానంపై జిల్లా యంత్రాంగం ఇప్పటి వరకు పెద్దగా ప్రచారం కల్పిస్తున్న దాఖలాలు కనిపించట్లేదు. అదనపు పోలింగ్ సిబ్బంది అవసరమవుతారని, పోలింగ్ ఒకరోజు ముందే దరఖాస్తుదారుల ఇళ్ల వద్దకు ఎన్నికల సామగ్రి తీసుకెళ్లాల్సి ఉంటుందనే ఉద్దేశంతో అధికారులు సతమతమవుతున్నట్లు తెలిసింది. కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం అర్హులైనవారు ఇంటి వద్దే ఓటు వేసేందుకు కృషి చేస్తే పోలింగ్ శాతం కచ్చితంగా పెరుగుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగనన్న మాయ‘దారి’ పాలన..!
[ 29-04-2024]
వైకాపా పాలకులు అయిదేళ్ల పాటు కళ్లకు గంతలు కట్టుకున్నారేమో.. అందుకే రోడ్లపై అడుగడుగునా ఏర్పడిన గుంతలు వారికి కనిపించలేదు. పల్లెదారులు రాళ్లు తేలినా పట్టించుకోలేదు. -
తెదేపాలోకి వరం కుటుంబం
[ 29-04-2024]
-
ఐదేళ్లలో జిల్లాకు ఏం చేశారు..
[ 29-04-2024]
వైకాపా ప్రభుత్వం ఐదేళ్లలో జిల్లాకు ఏం చేసిందని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నిలదీశారు. టెక్కలి ఇందిరా కూడలిలో ఆదివారం నిర్వహించిన న్యాయయాత్ర సభలో ఆమె మాట్లాడారు. -
పచ్చదనం గాలికొదిలేశారు.. ప్రజాధనం వృథా చేశారు..!
[ 29-04-2024]
జగనన్న ఏలుబడిలో మొక్కలకూ రక్షణ కరవైంది. పచ్చదనాన్ని పెంపొందించాలనే లక్ష్యంతో ఆర్భాటంగా ప్రారంభించిన ‘జగనన్న హరిత నగరాలు-గ్రీన్ సీటీ ఛాలెంజ్’ కార్యక్రమం ఆదిలోనే తుస్సుమంది. -
ఉద్దానం రైతులను ఏం ఉద్ధరించారు..
[ 29-04-2024]
ఉద్దానం ఈ పేరు చెప్పగానే వెంటనే గుర్తొచ్చేది పలాస ప్రాంతం. ఉద్యాన పంటలకు పేరు పొందిన ఈ ప్రాంతంలో వర్షాభావంతో రైతులు ప్రస్తుతం గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. -
తెదేపా, భాజపాలోకి భారీగా చేరికలు
[ 29-04-2024]
జి.సిగడాం మండలంలో వైకాపాకు కంచుకోటగా ఉన్న వాండ్రంగి గ్రామంలో వైకాపాకు ఎదురుదెబ్బ తగిలింది. -
మాజీ సైనికుల కోసం ప్రత్యేక కార్పొరేషన్
[ 29-04-2024]
జిల్లాలోని మాజీ సైనికోద్యోగుల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని ఎంపీ కింజరాపు రామ్మెహన్నాయుడు ప్రకటించారు. -
సీఎం సభలో విద్యుత్తు స్తంభాలు పడి ఇద్దరికి గాయాలు
[ 29-04-2024]
ఈ నెల 24న టెక్కలి సమీపంలో జరిగిన సిద్ధం బహిరంగ సభలో లైటింగ్ పోల్స్ మీద పడి ఇద్దరు గాయపడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. -
పిల్లల చదువులపై పక్షపాతమెందుకు..?
[ 29-04-2024]
విద్యా వ్యవస్థను మెరుగుపర్చేందుకు, పాఠశాల భవనాలను బాగు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వ నాడు- నేడు పథకం ద్వారా నిధులు మంజూరు చేసింది. -
అడ్డదారిలో అద్దెకు..!
[ 29-04-2024]
కాశీబుగ్గ నడిబొడ్డున రూ.కోట్లు విలువ చేసే స్థలమది. గతంలో గ్రామ పరిపాలనాధికారుల (వీఆర్వో) సంఘానికి కేటాయించారు.
తాజా వార్తలు (Latest News)
-
‘బేబీ ఈజ్ ఆన్ ది వే’... సాక్షి ధోనీ ఇన్స్టా స్టోరీ వైరల్
-
కోనసీమ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
-
ఇచ్చింది రూ.50 వేలు.. లాగింది రూ.3.5 లక్షలు
-
ఏపీ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలని ప్రార్థించా: సినీనటి జయప్రద
-
కడప కార్పొరేటర్లపై వైకాపాకు అనుమానాలు!
-
పది బంతుల్లోనే 50 TO 100.. వారి వల్లే ఇది సాధ్యం: విల్ జాక్స్