దప్పిక తీరే దారేది జగన్..!
ప్రతీ గ్రామానికి రక్షిత తాగునీరు అందించాలన్న లక్ష్యంతో తెదేపా హయాంలో 2017 డిసెంబరు నెలలో వంశధార నదిలో అచ్యుతాపురం వద్ద శ్రీముఖలింగం తాగునీటి ప్రాజెక్టు పనులు ప్రారంభించారు.
పూర్తికాని శ్రీముఖలింగం తాగునీటి పథకం పనులు
అయిదేళ్లుగా లక్ష్యాన్ని నీరుగార్చిన వైకాపా సర్కారు
న్యూస్టుడే, జలుమూరు, సారవకోట
ప్రతీ గ్రామానికి రక్షిత తాగునీరు అందించాలన్న లక్ష్యంతో తెదేపా హయాంలో 2017 డిసెంబరు నెలలో వంశధార నదిలో అచ్యుతాపురం వద్ద శ్రీముఖలింగం తాగునీటి ప్రాజెక్టు పనులు ప్రారంభించారు. జలుమూరు, సారవకోట మండలాల పరిధిలోని 93 గ్రామాల్లోని 73,983 మందికి తాగునీరు అందించాలన్న లక్ష్యంతో అప్పటి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. మొదటి విడతలో రూ.28 కోట్లు విడుదలయ్యాయి. వాటితో అధికారులు పనులు చేయించి రెండు మండలాల్లోని 47 గ్రామాల ప్రజలకు తాగునీరందించారు. రెండో విడతలో రూ.20 కోట్లతో ప్రతిపాదనలు పంపించారు. ఇంతలో ఎన్నికలు రావడం, అనంతరం వైకాపా ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత రెండో విడత నిధులు సైతం మంజూరయ్యాయి. పనులు ప్రారంభించి నేటికి అయిదేళ్లు అవుతున్నా ఇప్పటికీ పూర్తికాలేదు. రెండో విడతలో 46 గ్రామాలకు తాగునీరు అందించాల్సి ఉండగా నిర్మాణాలు నత్తనడకన సాగుతున్నాయి.
ఎదురుచూపులే మిగిలాయి
జలుమూరు మండలంలో 18, సారవకోట మండలంలో 17 ట్యాంకుల నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి. దీంతో తాగునీటి ఇబ్బందులు తీరుతాయని ఆశించిన ప్రజలకు ఎదురుచూపులే మిగిలాయి. పథకం వద్ద మోటార్లు తరచూ మొరాయిస్తుండటంతో పనులు పూర్తయిన గ్రామాల ప్రజలకు సైతం తాగునీటి కష్టాలు ఎదురవుతున్నాయి. అధికారులు ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. కనీసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు అయినా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. జలుమూరు మండలంలోని రావిపాడు, హరికృష్ణమ్మపేట, పెద్దదూగాం, దరివాడ, చిన్ననామాలపేట, సారవకోట మండలంలోని సారవకోట, పద్మాపురం తదితర గ్రామాల్లో నీటి ట్యాంకులు అసంపూర్తిగా ఉన్నాయి.
20 రోజుల్లో తాగునీరు అందిస్తాం
- జె.సుదర్శనరావు, డీఈఈ గ్రామీణ తాగునీటి విభాగం
మొదటి విడతలోని 47 గ్రామాలకు పూర్తిస్థాయిలో తాగునీరు అందిస్తున్నాం. రెండో విడతలో 46 గ్రామాలకు అందించాల్సి ఉన్నప్పటికీ కొన్ని గ్రామాలకు మాత్రమే అందించాం. జలుమూరు మండలంలో 18, సారవకోట మండలంలో 17 ట్యాంకులు పనులు జరుగుతున్నాయి. మరో 20 రోజుల్లో పనులు పూర్తి చేసి ప్రాజెక్టు పరిధిలోని 93 గ్రామాలకు తాగునీరు అందించేలా చర్యలు చేపడుతున్నాం.
ఎప్పటికి పూర్తవుతాయో..
- బమ్మిడి అప్పలనరసమ్మ, హరికృష్ణమ్మపేట
శ్రీముఖలింగం ప్రాజెక్టు ద్వారా తాగునీరు వస్తుందని ఆశపడినా, చివరికి నిరాశే మిగిలింది. మా గ్రామంలో రక్షిత మంచినీటి ట్యాంకు పనులు రెండు సంవత్సరాలుగా కొనసాగుతూనే ఉన్నాయి. ఎప్పటికి పూర్తవుతాయో తెలియని పరిస్థితి. ఇంటి వద్ద ఉన్న బావుల నీరు తాగడానికి ఉపయోగిస్తున్నాం. బావులు లేని కుటుంబాలు పక్కింటి వారిపై ఆధారపడుతున్నారు. ఇతర అవసరాలకు చెరువు నీరే గతి. మా కష్టాలు తీరే దారి కనిపించడం లేదు.
పైపులైను వేసి వదిలేశారు
- సాయిలక్ష్మి, సారవకోట
తెదేపా హయాంలో మంచినీటి పథకం మంజూరైంది. శ్రీముఖలింగం తాగునీటి ప్రాజెక్టు ద్వారా తాగునీరు అందించేందుకు పైపులు లైను వేసి వదిలేశారు. ట్యాంకు నిర్మాణ పనులు చేపట్టారు. తాగునీరు వస్తుందని, సమస్య పరిష్కారమవుతుందని ఐదేళ్లుగా ఎదురు చూస్తున్న ఫలితం లేకుండా పోయింది. సారవకోటలో పురాతన మంచినీటి పథకం ఉంది. రోజుకు అరగంట సమయం మాత్రమే నీరు సరఫరా చేస్తున్నారు. దీంతో తాగునీటి కష్టాలు తప్పడం లేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగనన్న మాయ‘దారి’ పాలన..!
[ 29-04-2024]
వైకాపా పాలకులు అయిదేళ్ల పాటు కళ్లకు గంతలు కట్టుకున్నారేమో.. అందుకే రోడ్లపై అడుగడుగునా ఏర్పడిన గుంతలు వారికి కనిపించలేదు. పల్లెదారులు రాళ్లు తేలినా పట్టించుకోలేదు. -
తెదేపాలోకి వరం కుటుంబం
[ 29-04-2024]
-
ఐదేళ్లలో జిల్లాకు ఏం చేశారు..
[ 29-04-2024]
వైకాపా ప్రభుత్వం ఐదేళ్లలో జిల్లాకు ఏం చేసిందని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నిలదీశారు. టెక్కలి ఇందిరా కూడలిలో ఆదివారం నిర్వహించిన న్యాయయాత్ర సభలో ఆమె మాట్లాడారు. -
పచ్చదనం గాలికొదిలేశారు.. ప్రజాధనం వృథా చేశారు..!
[ 29-04-2024]
జగనన్న ఏలుబడిలో మొక్కలకూ రక్షణ కరవైంది. పచ్చదనాన్ని పెంపొందించాలనే లక్ష్యంతో ఆర్భాటంగా ప్రారంభించిన ‘జగనన్న హరిత నగరాలు-గ్రీన్ సీటీ ఛాలెంజ్’ కార్యక్రమం ఆదిలోనే తుస్సుమంది. -
ఉద్దానం రైతులను ఏం ఉద్ధరించారు..
[ 29-04-2024]
ఉద్దానం ఈ పేరు చెప్పగానే వెంటనే గుర్తొచ్చేది పలాస ప్రాంతం. ఉద్యాన పంటలకు పేరు పొందిన ఈ ప్రాంతంలో వర్షాభావంతో రైతులు ప్రస్తుతం గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. -
తెదేపా, భాజపాలోకి భారీగా చేరికలు
[ 29-04-2024]
జి.సిగడాం మండలంలో వైకాపాకు కంచుకోటగా ఉన్న వాండ్రంగి గ్రామంలో వైకాపాకు ఎదురుదెబ్బ తగిలింది. -
మాజీ సైనికుల కోసం ప్రత్యేక కార్పొరేషన్
[ 29-04-2024]
జిల్లాలోని మాజీ సైనికోద్యోగుల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని ఎంపీ కింజరాపు రామ్మెహన్నాయుడు ప్రకటించారు. -
సీఎం సభలో విద్యుత్తు స్తంభాలు పడి ఇద్దరికి గాయాలు
[ 29-04-2024]
ఈ నెల 24న టెక్కలి సమీపంలో జరిగిన సిద్ధం బహిరంగ సభలో లైటింగ్ పోల్స్ మీద పడి ఇద్దరు గాయపడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. -
పిల్లల చదువులపై పక్షపాతమెందుకు..?
[ 29-04-2024]
విద్యా వ్యవస్థను మెరుగుపర్చేందుకు, పాఠశాల భవనాలను బాగు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వ నాడు- నేడు పథకం ద్వారా నిధులు మంజూరు చేసింది. -
అడ్డదారిలో అద్దెకు..!
[ 29-04-2024]
కాశీబుగ్గ నడిబొడ్డున రూ.కోట్లు విలువ చేసే స్థలమది. గతంలో గ్రామ పరిపాలనాధికారుల (వీఆర్వో) సంఘానికి కేటాయించారు.
తాజా వార్తలు (Latest News)
-
అప్పట్లో.. 4 సెకన్లు ఆలస్యంగా చంద్రయాన్ 3.. ఎందుకంటే!
-
ఏపీ సీఎం జగన్ సతీమణి భారతికి ఎన్నికల ప్రచారంలో చేదు అనుభవం
-
సొంతగడ్డపై చెలరేగిన కోల్కతా.. దిల్లీపై ఘన విజయం
-
ఆ సినిమా చూశాక వ్యాక్సింగ్ మానేశా: తమన్నా
-
నదిలో ఈతకు వెళ్లి ఐదుగురు బీటెక్ విద్యార్థులు మృతి
-
పెళ్లి పత్రికలో ‘మోదీ’ ప్రస్తావన.. చిక్కుల్లో నవ వరుడు!