logo

‘నా భర్తకి 500 మంది మహిళలతో సంబంధం’.. కోర్టులో భార్య పిటిషన్‌

తన భర్తకు 500 మహిళలతో సంబంధం ఉందని ఓ మహిళ మద్రాసు హైకోర్టు మదురై ధర్మాసనంలో పిటిషన్‌ దాఖలు చేసిన ఘటన కలకలం సృష్టించింది.

Updated : 01 Feb 2024 08:33 IST

ప్యారిస్‌, న్యూస్‌టుడే: తన భర్తకు 500 మహిళలతో సంబంధం ఉందని ఓ మహిళ మద్రాసు హైకోర్టు మదురై ధర్మాసనంలో పిటిషన్‌ దాఖలు చేసిన ఘటన కలకలం సృష్టించింది. తంజావూరుకి చెందిన ఆర్తి మదురై ధర్మాసనంలో దాఖలు చేసిన పిటిషన్‌లో.. తనకు వివేక్‌రాజ్‌తో వివాహమైందని, ఇద్దరం కలిసి జీవిస్తున్నట్లు పేర్కొన్నారు. భర్త సెల్‌ఫోన్‌ చూడగా అందులో పలు అసభ్యకర వీడియోకాల్‌ స్క్రీన్‌షాట్‌లు, అసభ్యకర ఫొటోలు ఉన్నట్లు తెలిసిందన్నారు. 500 నుంచి 1000 వరకు అసభ్యకర వీడియోలు ఉన్నాయన్నారు. భర్త, తల్లిదండ్రులను అడగ్గా బయట ఎవరికీ చెప్పకూడదని బెదిరించినట్లు తెలిపారు. తాను రెండు నెలల గర్భంతో ఉన్నప్పుడు తనపై దాడిచేయడంతో అబార్షన్‌ అయిందని, తంజావూరు ఆల్‌ ఉమెన్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు చేపట్టలేదని తెలిపారు. సీబీసీఐడీ దర్యాప్తు చేపట్టేలా చూడాలన్నారు. ఈ పిటిషన్‌ మంగళవారం జస్టిస్‌ సుకుమార గురు ఎదుట విచారణకు వచ్చింది. తంజావూరు ఎస్పీ, సీబీసీఐడీ జవాబివ్వాలని ఉత్తర్వులు ఇచ్చి విచారణ వాయిదా వేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని