వేలూర్లో విజయ బావుటా ఎగురవేసేదెవరు?
స్వాతంత్య్ర పోరాటానికి బీజం వేసిన, సిపాయిల తిరుగుబాటుకు వేదికగా నిలిచిన వేలూర్ నియోజకవర్గంలో పోటీ రసవత్తంగా మారింది.
న్యూస్టుడే, రెడ్హిల్స్
స్వాతంత్య్ర పోరాటానికి బీజం వేసిన, సిపాయిల తిరుగుబాటుకు వేదికగా నిలిచిన వేలూర్ నియోజకవర్గంలో పోటీ రసవత్తంగా మారింది. చెన్నై - బెంగళూరు జాతీయ రహదారిలో పాలారు నది ఒడ్డున ఉన్న వేలూర్ నియోజకవర్గంలో ఇప్పటివరకు 18 సార్లు లోక్సభ ఎన్నికలు జరిగాయి. పార్లమెంట్ పరిధిలో వేలూర్, అనైకట్టు, కేవీకుప్పం, గుడియాత్తం, వాణియంబాడి, ఆంబూరు శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిల్లో ముస్లింలు అధిక సంఖ్యలో నివసిస్తున్నారు. అదేవిధంగా క్రైస్తవులు, వన్నియర్లు, ముదలియార్లు, ఆదిద్రావిడ తెగకు చెందిన వారు చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉన్నారు. వేలూర్ లోక్సభ స్థానానికి 1951లో తొలిసారిగా ఎన్నికలు జరిగాయి. అప్పటి నుంచి ఇంతవరకు కాంగ్రెస్ 5 దఫాలు, డీఎంకే 4 సార్లు, అన్నాడీఎంకే 3, పీఎంకే, ఐయూఎంఎల్ తలా 2 సార్లు, స్వతంత్ర అభ్యర్థి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (ఓల్డ్) తలా ఒకసారి గెలుపొందాయి.
రెండు ఎంపీల పద్ధతి
1951లో జరిగిన ఎన్నికల్లో ఇద్దరు ఎంపీలు ఎన్నికయ్యే పద్ధతి ఉన్న సమయంలో కాంగ్రెస్కు చెందిన ముత్తుకృష్ణన్, రాంసుందర్ గెలుపొందారు. 1957 ఎన్నికల్లో అదే కాంగ్రెస్ పార్టీకి చెందిన ముత్తుకృష్ణన్, మునుస్వామి విజయం సాధించారు. 1962లో ఒక ఎంపీ ఎన్నికయ్యే పద్ధతి ప్రవేశపెట్టగా కాంగ్రెస్కు చెందిన అబ్దుల్వాహిద్, 1967లో డీఎంకేకు చెందిన కుసేలర్ విజయకేతనం ఎగుర వేశారు. 1971లో డీఎంకేకు చెందిన ఉలగనంబి, 1977లో ఇండియన్ నేషన్ కాంగ్రెస్ (ఓ)కు చెందిన దండాయుధపాణి, 1980లో స్వతంత్ర అభ్యర్థి అబ్దుల్సమద్, 1984లో అన్నాడీఎంకే తరఫున పోటీ చేసిన ఏసీ షణ్ముగం, 1989లో అబ్దుల్సమద్, 1991లో అక్బర్బాషా, 1996లో డీఎంకేకు చెందిన షణ్ముగం, 1998, 99లో పీఎంకే అభ్యర్థి ఎన్డీ షణ్ముగం గెలుపొందారు. 2004, 2010లో ఐయూఎంఎల్కు చెందిన ఖాదర్మొహిద్దీన్, అబ్దుల్రెహ్మన్ విజయం సాధించారు. 2014లో అన్నాడీఎంకే తరఫున పోటీ చేసిన సెంగుట్టువన్, 2019లో డీఎంకేకు చెందిన కదిర్ ఆనంద్ గెలుపొందారు.
పరిష్కారం కాని సమస్యలు
పాలారు నది కర్ణాటకలో పుట్టినా వేలూరు జిల్లాలో ఎక్కువ దూరం ప్రవహిస్తోంది. నదిలో వరదలేర్పడితే నీరు వృథాగా సముద్రం పాలవుతోంది. దీంతో చెక్డ్యాంలు నిర్మించాలని ప్రజలు ఏళ్ల తరబడి కోరుతున్నారు. 2005లో పేర్నంపట్టు సమీపంలోని బత్తలపల్లిలో ఆనకట్ట నిర్మాణ పనులు చేపట్టి తర్వాత వదిలేశారు. చిన్నశివకాశిగా పేరుపొందిన గుడియాత్తం పరిసర ప్రాంతాల్లో వందలాది అగ్గిపెట్టెల తయారీ పరిశ్రమలు ఉన్నాయి. పరిశ్రమలకు 24 గంటల పాటు త్రీఫేస్ విద్యుత్తు సరఫరా చేయాలనే డిమాండ్ ఉంది. కేవీ కుప్పంలో 24 ప్రభుత్వ ఆసుపత్రి, కోర్టు, అగ్నిమాపదళ కేంద్రం, వాణియంబాడి న్యూటౌన్లో రైల్వే వంతెన, మల్లగుంటలో సిప్కాట్ నెలకొల్పాలని ప్రజలు కోరుతున్నారు.
గెలుపునకు వ్యూహాలు
మూడేళ్లలో డీఎంకే ప్రభుత్వం ప్రవేశపెట్టిన జనాకర్షక పథకాలు కదిర్ ఆనంద్కు ఘన విజయం సాధించి పెట్టనున్నాయని ధీమాతో కార్యకర్తలు ఉన్నారు. మరో వంక గత ఎన్నికల్లో ఓటమి చవి చూసిన ఏసీ షణ్ముగం ఈ సారి ఎలాగైన గెలిచి తీరాలనే పట్టుదలతో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడక ముందే ఉచిత వైద్య శిబిరాలు, ఉద్యోగ మేళాలు నిర్వహించారు. ప్రతి శాసనసభ నియోజకవర్గంలో కల్యాణ మండపాలు నిర్మించనున్నట్లు ప్రకటించి వేలూర్లో రూ.కోటి వ్యయంతో మండప నిర్మాణానికి ఇటీవల శంకస్థాపన చేశారు. అన్నాడీఎంకే అభ్యర్థి డాక్టరు పశుపతి నియోజకవర్గ ప్రజలకు సుపరిచితుడు.
ప్రస్తుత పోటీదారులు
ప్రస్తుత ఎన్నికల్లో డీఎంకే తరఫున మంత్రి దురైమురుగన్ తనయుడు, సిట్టింగ్ ఎంపీ కదిర్ ఆనంద్ మళ్లీ పోటీ చేస్తున్నారు. ఇతని చేతిలో గత ఎన్నికల్లో తక్కువ ఓట్ల తేడాతో ఓటమి చవి చూసిన భాజపా కూటమిలోని పుదియ నీది కట్చి అధ్యక్షుడు ఏసీ షణ్ముగం మళ్లీ బరిలోకి దిగారు. అన్నాడీఎంఏ నుంచి డాక్టరు పశుపతి, నామ్ తమిళర్ కట్చి అభ్యర్థిగా ఇంజినీరు మహేష్ ఆనంద్, సినీ నటుడు మన్సూర్ అలీఖాన్ పోటీ చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దాతృత్వం అమోఘం
[ 09-05-2024]
ఐఐటీ మద్రాస్ అంటేనే ఒక ప్రత్యేక ముద్ర. వారు నిర్వహించే ప్రాజెక్టులకు ఎంతో ప్రజాదరణ. ఇక్కడ చదివిన విద్యార్థులంటే పెద్దపెద్ద కంపెనీలు ఆసక్తి చూపుతాయి. మరీ ముఖ్యంగా కంపెనీలు పెట్టాలనే ఆలోచనలు ఇక్కడి విద్యార్థుల్లో ఉంటాయి. -
విద్యార్థులకు ప్రతినెలా రూ.1000
[ 09-05-2024]
ఈ విద్యా సంవత్సరం నుంచి ఉన్నతవిద్యకు వెళ్లే ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ప్రతినెలా రూ.1000 అందించే ‘తమిళ్ పుదల్వన్’ పథకాన్ని అమలు చేయనున్నట్లు ప్రభుత్వ ప్రధానకార్యదర్శి శివ్దాస్ మీనా తెలిపారు. -
మాజీ ఎమ్మెల్యే వేలాయుధన్ కన్నుమూత
[ 09-05-2024]
తమిళనాడు భాజపా ఎమ్మెల్యే వేలాయుధన్(73) మృతి చెందారు. 1996 శాసనసభ ఎన్నికల్లో భాజపా తరఫున రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్థులు పోటీచేశారు. కన్నియాకుమరి జిల్లా పద్మనాభపురం నియోజకవర్గం నుంచి బరిలో నిలిచిన వేలాయుధన్ గెలుపొందారు. -
ఆర్థిక అసమానతలు పెరిగాయి: అన్బుమణి
[ 09-05-2024]
డీఎంకే, అన్నాడీఎంకే పాలనలో ఆర్థిక అసమానతలు పెరిగాయని పీఎంకే అధ్యక్షుడు అన్బుమణి రామదాస్ తెలిపారు. బుధవారం ఆయన విడుదల చేసిన ప్రకటనలో.. -
ఇరాన్ నుంచి కొచ్చికి..
[ 09-05-2024]
ఇరాన్ నుంచి తప్పించుకుని 3 వేల కి.మీ. సముద్రంలో ప్రయాణించి కేరళ సముద్రతీరానికి చేరుకున్న తమిళనాడు జాలర్లను కోస్ట్గార్డ్ రక్షించింది. -
మలయాళంలోకి స్టాలిన్ స్వీయచరిత్ర
[ 09-05-2024]
ముఖ్యమంత్రి స్టాలిన్ ‘ఉంగళిల్ ఒరువన్’ పేరిట రాసిన స్వీయచరిత్ర పుస్తకాన్ని మలయాళంలోకి అనువదించారు. బాబురాజ్ కళంబూర్ అనువదించిన పుస్తకాన్ని డీసీ బుక్స్ పబ్లికేషన్స్ ప్రచురించింది. -
వివాహానికి జాతకానికంటే రక్తపరీక్షే ముఖ్యం
[ 09-05-2024]
వివాహానికి జాతక అనుకూలత కంటే రక్తపరీక్షే ముఖ్యమని ప్రముఖ నటి సుహాసిని తెలిపారు. రక్తహీనత దినం సందర్భంగా తలసేమియా నల సంఘం ప్రజల్లో అవగాహన కల్పించేలా అపోలోలో కార్యక్రమం ఏర్పాటు చేసింది. -
పీటీ మాస్టర్ పాట వీడియో విడుదల
[ 09-05-2024]
సంగీత దర్శకుడు, నటగాయకుడు హిప్హాప్ ఆది నటిస్తున్న చిత్రం ‘పీటీ మాస్టర్’. వేల్స్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రానికి కార్తిక్ వేణుగోపాలన్ దర్శకత్వం వహించగా హిప్హాప్ ఆది సంగీతం సమకూర్చారు. -
గడువు తీరిన బీరు తాగి యువకుల అస్వస్థత
[ 09-05-2024]
మైలాడుదురై జిల్లా సీర్గాళి సమీప తెన్నంగుడిలోని ఓ ప్రభుత్వ మద్యం దుకాణంలో ఇద్దరు యువకులు రెండు రోజుల క్రితం బీరును కొనుగోలు చేసి తాగారు. అది తాగిన కొద్ది సేపటికే వారు అస్వస్థతకు గురయ్యారు. -
జారవిడుచుకున్న బ్యాగు అప్పగింత
[ 09-05-2024]
మదురై సెంట్రల్ జైలు తరఫున నిర్వహిస్తున్న హోటల్లో ప్రతిరోజు చాలా మంది ఆహారం తిని వెళ్తుంటారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్కి చెందిన వెటర్నరీ డాక్టర్ శ్రీనివాస్, అతని భార్య శ్రీ గంగాలు కుటుంబంతో కలిసి తమిళనాడును సందర్శనకు వచ్చారు. -
సవుక్కు శంకర్పై మరో రెండు కేసులు
[ 09-05-2024]
యూట్యూబర్ సవుక్కు శంకర్పై మరో రెండు కేసులు నమోదయ్యాయి. మహిళా పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో ఆయన్ను కోయంబత్తూరు పోలీసులు ఇదివరికే అరెస్టు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ దేవరకొండ బర్త్డే స్పెషల్.. మూడు సినిమాల అప్డేట్స్ ఇవే..
-
2023-24లో టీసీఎస్ సీఈఓ వేతనం రూ.25 కోట్లు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
శాంపిట్రోడా వ్యాఖ్యలను ఖండించిన చంద్రబాబు
-
సందేశ్ఖాలీ ఘటనలో కీలక మలుపు.. టీఎంసీ నేతలపై కేసు వెనక్కి
-
ముంబయి ఇండియన్స్లో హార్దిక్పై అసంతృప్తి..!