మాజీ మంత్రి ఇంద్రకుమారి మృతి
మాజీ మంత్రి, డీఎంకే సాహిత్య విభాగం అధ్యక్షురాలు ఇంద్రకుమారి(73) మృతి చెందారు. వయోధిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె నగరంలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం కన్నుమూశారు.
చెన్నై, న్యూస్టుడే: మాజీ మంత్రి, డీఎంకే సాహిత్య విభాగం అధ్యక్షురాలు ఇంద్రకుమారి(73) మృతి చెందారు. వయోధిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె నగరంలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం కన్నుమూశారు. భౌతికకాయాన్ని అడయారు గాంధీనగర్లోని నివాసంలో ఉంచగా పార్టీ ప్రముఖులు పలువురు నివాళి అర్పించారు. మంగళవారం అంత్యక్రియలు నిర్వహించారు. ముఖ్యమంత్రి స్టాలిన్ సంతాపం ప్రకటించారు. పార్టీకి, సాహిత్య లోకానికి తీరని లోటన్నారు. భౌతికకాయానికి స్టాలిన్ నివాళులర్పించారు. 1991 శాసనసభ ఎన్నికల్లో అన్నాడీఎంకే తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికైన ఇంద్రకుమారి అప్పటి జయలలిత మంత్రివర్గంలో సాంఘిక సంక్షేమశాఖ మంత్రిగా ఐదేళ్లు పనిచేశారు. ‘తొట్టిల్ కుళందై’(ఊయల బేబి) పథకం రూపకల్పనలో ముఖ్యపాత్ర పోషించారు. 2006లో ఆ పార్టీ నుంచి వైదొలగి డీఎంకేలో చేరారు. ఆమె భర్త బాబు న్యాయవాది. ఈ దంపతులకు లేఖ అనే కుమార్తె ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వరాలిచ్చినా వనితల ఓటు పడలేదు!
[ 29-04-2024]
లోక్సభ ఎన్నికల్లో తలపడిన మూడు ప్రధాన కూటములు ప్రత్యేకించి మహిళా ఓటర్ల మీద పెద్ద ఆశలే పెట్టుకున్నాయి. -
గుకేశ్కు రూ.75 లక్షల ప్రోత్సాహక నగదు
[ 29-04-2024]
రాష్ట్రానికి చెందిన భారత గ్రాండ్మాస్టర్ గుకేశ్కు రూ.75 లక్షల ప్రోత్సాహక నగదును ముఖ్యమంత్రి అందించారు. -
తాగునీటి సమస్య తలెత్తదు
[ 29-04-2024]
చెన్నై మహానగరంలో సెప్టెంబర్ వరకు తాగునీటి సమస్య తలెత్తే అవకాశం లేదని చెన్నై తాగునీటి బోర్డు తెలిపింది. -
ఈవీఎంలను సక్రమంగా పర్యవేక్షించాలి
[ 29-04-2024]
ఎన్నికల కమిషన్ లోక్సభ ఎన్నికల్లో ఓట్లు పోలైన ఈవీఎంలను సక్రమంగా పర్యవేక్షించాలని కేంద్ర సహాయ మంత్రి ఎల్.మురుగన్ తెలిపారు. -
యూపీఎస్సీ ఫలితాల్లో టీ మాస్టర్ కుమారుడి సత్తా
[ 29-04-2024]
నెల్లై జిల్లా కల్లిడైకురిచ్చికి చెందిన వేల్మురుగన్ టీ దుకాణం నడుపుతున్నాడు. ఇతని కుమారుడు పేచ్చి ఇటీవల విడుదలైన యూపీఎస్సీ పరీక్షల ఫలితాల్లో 567వ స్థానంలో నిలిచి ప్రతిభ కనబర్చాడు. -
పనిలేక పస్తులు
[ 29-04-2024]
జాలర్లు సంద్రంలోకి వెళ్లి చేపలు పట్టడంపై ప్రస్తుతం ప్రభుత్వం నిషేధం విధించింది. -
విజయ్ పుట్టినరోజున గోట్ రెండో సింగిల్
[ 29-04-2024]
విజయ్ 68వ చిత్రంగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో ‘గోట్’ (గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్స్) రూపొందుతున్న విషయం తెలిసిందే. -
ఐఎస్ఐ మద్దతుదారుడి అరెస్టుకు ప్రతీకారంగానే కోయంబత్తూరులో బాంబు పేలుళ్లకు కుట్ర
[ 29-04-2024]
ఐఎస్ఐ మద్దతుదారుడిని అరెస్టు చేసినందుకే కోయంబత్తూరులో బాంబు పేలుళ్లకు కుట్ర చేసినట్లు తెలిసింది. -
వాహనాలపై స్టిక్కర్లు అంటించడంపై నిషేధం
[ 29-04-2024]
ప్రజలు తమ వాహనాలపై మీడియా, పోలీసు, న్యాయశాఖ, ఆర్మీ అని పలు శాఖలు, సంస్థల పేర్లను అతికించడానికి గ్రేటర్ చెన్నై ట్రాఫిక్ పోలీసులు నిషేధం విధించారు.