logo

ఉపరాష్ట్రపతి పర్యటనకు పక్కాగా ఏర్పాట్లు

ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడి నగర పర్యటనకు పక్కాగా ఏర్పాట్లు చేయాలని జిల్లా సంయుక్త కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షలో జేసీ మాట్లాడారు.

Published : 18 Jan 2022 05:30 IST


అధికారులతో సమీక్షిస్తున్న జేసీ ఎం.వేణుగోపాల్‌రెడ్డి

వన్‌టౌన్‌, న్యూస్‌టుడే: ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడి నగర పర్యటనకు పక్కాగా ఏర్పాట్లు చేయాలని జిల్లా సంయుక్త కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షలో జేసీ మాట్లాడారు. ఈనెల 19 నుంచి 22వ తేదీ వరకు ఉపరాష్ట్రపతి విశాఖలో పర్యటిస్తారని చెప్పారు. వివిధ శాఖల అధికారులకు పలు బాధ్యతలు అప్పగించామని, వారంతా ఆయా ఏర్పాట్లలో నిమగ్నం కావాలన్నారు. ప్రొటోకాల్‌ విషయంలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. 19న ఉదయం ప్రత్యేక విమానంలో ఉపరాష్ట్రపతి విశాఖ చేరుకుని, పోర్టు అతిథి గృహంలో బస చేస్తారని చెప్పారు. అనంతరం నగరంలో జరిగే రెండు కార్యక్రమాలకు హాజరవుతారన్నారు. పర్యటనకు అవసరమైన వాహనాలను అందుబాటులో ఉంచాలని, వైద్యుల బృందాలను సిద్ధం చేయాలని జిల్లా ఆరోగ్యశాఖ అధికారులను జేసీ ఆదేశించారు. సమీక్షలో డీఆర్వో శ్రీనివాసమూర్తి, ఆర్డీఓ పెంచలకిషోర్‌, తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని