logo

అత్యాచార ఘటనపై ఏఎస్పీ విచారణ

రాజయ్యపేటలో పదకొండేళ్ల బాలికపై జరిగిన అత్యాచార ఘటనకు సంబంధించి నర్సీపట్నం ఏఎస్పీ మణికంఠ శనివారం విచారణ చేపట్టారు. గ్రామానికి వెళ్లిన ఆయన....

Published : 23 Jan 2022 04:22 IST


రాజయ్యపేటలో స్థానికులతో మాట్లాడుతున్న ఏఎస్పీ మణికంఠ

నక్కపల్లి, న్యూస్‌టుడే: రాజయ్యపేటలో పదకొండేళ్ల బాలికపై జరిగిన అత్యాచార ఘటనకు సంబంధించి నర్సీపట్నం ఏఎస్పీ మణికంఠ శనివారం విచారణ చేపట్టారు. గ్రామానికి వెళ్లిన ఆయన ఘటనా స్థలాన్ని పరిశీలించారు. స్థానికులతో మాట్లాడి పలు విషయాలు తెలుసుకున్నారు. బాధితురాలి కుటుంబ సభ్యులు, ఇరుగుపొరుగు వారితో మాట్లాడారు. అనంతరం అక్కడి నుంచి స్టేషన్‌కు చేరుకుని ఎఫ్‌.ఐ.ఆర్‌. పరిశీలించారు. కేసు దర్యాప్తులో భాగంగా సిబ్బందికి పలు సూచనలు చేశారు. బాధితులు ఘటన జరిగిన రోజు రాత్రి స్టేషన్‌కు వచ్చినా సిబ్బంది సరిగా స్పందించలేదనే దానిపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. సీఐ నారాయణరావు, మహిళా ఎస్సై శిరీష పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని