ఎడాపెడా మోత..
నగరంలో చెత్త సేకరణ రుసుముల వసూలు ఒక అడుగు ముందుకు.. ఒక అడుగు వెనక్కు అన్న చందాన సాగుతోంది. మరో పక్క యూజీడీ ఛార్జీల విధింపునకు జీవీఎంసీ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.రుసుములపై క్షేత్రస్థాయిలో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఆస్తి పన్నులో భాగంగా ఇవి వసూలు చేస్తున్నట్లు లెక్కల్లో చూపుతున్నారు. ఒక్కో ఇంటికి మురికివాడల్లో రూ.60, మిగతా ప్రాంతాల్లో రూ.120 వసూలు చేయాలని పాలకమండలి తీర్మానం చేసింది. అయితే ఇప్పటికీ ఏవి మురికివాడలనేది విభజించ లేదు.
యూజీడీ ఛార్జీల వసూలుకు సన్నాహాలు
ఇప్పటికే చెత్త సేకరణ రుసుములపై వ్యతిరేకత
న్యూస్టుడే, కార్పొరేషన్
చెత్తను సేకరిస్తున్న కార్మికులు
నగరంలో చెత్త సేకరణ రుసుముల వసూలు ఒక అడుగు ముందుకు.. ఒక అడుగు వెనక్కు అన్న చందాన సాగుతోంది. మరో పక్క యూజీడీ ఛార్జీల విధింపునకు జీవీఎంసీ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
రుసుములపై క్షేత్రస్థాయిలో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఆస్తి పన్నులో భాగంగా ఇవి వసూలు చేస్తున్నట్లు లెక్కల్లో చూపుతున్నారు. ఒక్కో ఇంటికి మురికివాడల్లో రూ.60, మిగతా ప్రాంతాల్లో రూ.120 వసూలు చేయాలని పాలకమండలి తీర్మానం చేసింది. అయితే ఇప్పటికీ ఏవి మురికివాడలనేది విభజించ లేదు.
త్వరలో యూజీడీ ఛార్జీల విధింపు: భూగర్భ మురుగునీటి వ్యవస్థ కనెక్షన్ల నుంచి ఛార్జీలు వసూలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్ల క్రితమే ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు దానిపై ఎలాంటి నిర్ణయం తీసుకోని అధికారులు త్వరలో ఆయా ఛార్జీలు విధించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రారంభంలో ఒక్కో కనెక్షన్కు నెలకు రూ.40 విధించాలని నిర్ణయించారు. ప్రభుత్వం ఇటీవల దాన్ని సవరించి రూ.50గా నిర్ధారించింది. ఇంట్లో రెండు మరుగుదొడ్లు ఉంటే ఒక్కో దానికి రూ.50 చొప్పున కట్టాల్సిందే..
* నగరంలో 84,368 యూజీడీ(అండర్ గ్రౌండ్ డ్రైనేజీ) కనెక్షన్లు ఉన్నాయి. ఒక్కో దానికి రెండు నుంచి 40 వరకు మరుగుదొడ్లు అనుసంధానించి ఉంటాయి. ప్రస్తుత కనెక్షన్లపై నెలకు మొత్తం రూ.4.5కోట్ల నిధులు వసూలయ్యే అవకాశాలు ఉన్నాయని ఇటీవల అధికారులు లెక్క కట్టారు.
సర్దిచెప్పలేక సతమతం..
వార్డు పారిశుద్ధ్య, పర్యావరణ కార్యదర్శి, కార్పొరేటర్ల సహకారంతో చెత్త సేకరణ రుసుములు వసూలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ విషయంలో ప్రజలకు సర్ది చెప్పలేకపోతున్నామని అధికార వైకాపాకు చెందిన పలువురు కార్పొరేటర్లు వాపోతున్నారు. అధికారంలోకి వచ్చి ఏడాది కాకముందే భారాలు వేయడం సరికాదని అభిప్రాయ పడుతున్నారు. సీపీఎం, సీపీఐ, తెదేపా, జనసేన, భాజపా కార్పొరేటర్లు వ్యతిరేకంగా గళం విప్పుతున్నారు. రెండున్నరేళ్లలో రహదారులు, కాలువలు వంటి మౌలిక వసతులు కల్పించడానికి నిధులు వ్యయం చేయకుండా, ఇప్పుడు ప్రజల నుంచి చెత్త సేకరణ రుసుములు ఎలా వసూలు చేస్తారని ప్రశ్నిస్తున్నారు.
కేవలం రూ.20లక్షలు వసూలు
నగరంలో 5,43,243 అసెస్మెంట్లు ఉన్నాయి. వాటిల్లో 1,80,928 అసెస్మెంట్లు మురికివాడల్లో ఉన్నాయని అధికారులు గుర్తించారు. జీవీఎంసీ అధికారులు పకడ్బందీగా చెత్త సేకరణ ఛార్జీలు వసూలు చేయగలిగితే నెలకు రూ.5.43 కోట్లు వచ్చే అవకాశాలున్నాయి. జీవీఎంసీ ఎంపిక చేసిన 8 వార్డుల నుంచి గతేడాది డిసెంబరులో కేవలం రూ.20లక్షలు మాత్రమే వసూలు చేయగలిగారు. వాణిజ్య సముదాయాలు, హోటళ్ల నుంచి వసూలు చేయడానికి ఎలాంటి అడ్డంకులు లేకపోయినా, ఇప్పటి వరకు వారికి డిమాండ్ నోటీసులు జారీ చేయలేదు. ఈ విధానాన్ని అన్ని వార్డుల్లో ఎప్పుడు అమలు చేస్తారో అధికారులు చెప్పలేకపోతున్నారు.
నూతన ఆస్తి పన్ను డిమాండ్ నోటీసుల జారీ
మూలధన విలువ ఆధారిత ఆస్తి పన్నులోకి మార్చిన అనంతరం పెరిగిన పన్నులకు సంబంధించిన డిమాండ్ నోటీసులను జీవీఎంసీ రెవెన్యూ సిబ్బంది పంపిణీ చేస్తున్నారు. నగరంలోని 5,43,243 అసెస్మెంట్లలో 3,60,345 అసెస్మెంట్ల ఆస్తి పన్నులకు సంబంధించి నోటీసులు జారీ చేశారు. 2021-2022 ఆర్థిక సంవత్సరం నుంచే కొత్త పన్నులు అమలులోకి వచ్చాయి. ఆయా నిధులు చెల్లించడానికి ఈ ఏడాది మార్చి వరకు గడువు ఉంది. ఇప్పటికే పన్నులు చెల్లించినవారు పెరిగిన 15శాతం నిధులు కట్టాల్సి ఉంది. ఇప్పటి వరకు చెల్లించని వారు రెండు అర్ధ సంవత్సరాలకు చెల్లించాలి.
ఎక్కువ భారం పడకుండా..
యూజీడీ కనెక్షన్ల నుంచి వినియోగ రుసుములు వసూలు చేయాలని ప్రభుత్వ ఉత్తర్వులు ఉన్నాయి. పదేళ్ల కిందట ఒక జీవో రాగా నాడు అమలు చేయలేదు. ప్రస్తుత ప్రభుత్వం తాజాగా జీవో విడుదల చేసింది. నగర ప్రజలపై ఎక్కువ భారం పడకుండా ఛార్జీలు వసూలు చేసే అవకాశాలు ఉన్నాయి.
- కె.వి.ఎన్. రవి, మంచినీటి సరఫరా, యూజీడీ నిర్వహణ, పర్యవేక్షక ఇంజినీరు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జైలుకు పోతానన్న భయంతో జగన్ లండన్కు: సీఎం రమేశ్
[ 10-05-2024]
ముఖ్యమంత్రి జగన్ ఘోరంగా ఓడిపోతారని తెలిసి, జైలుకు పోతారన్న భయంతో లండన్కు వెళ్లిపోతున్నారని అనకాపల్లి భాజపా ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ అన్నారు. -
అందరూ ఓటేస్తేనే.. ఐదేళ్ల అరాచక పాలన అంతం
[ 10-05-2024]
ఈనెల 13న ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకుని, 95 శాతం పోలింగ్ నమోదు చేయాలని తెదేపా అధినేత నారా చంద్రబాబునాయుడు ఓటర్లకు పిలుపునిచ్చారు. -
పోలింగ్ బృందాల తరలింపునకు.. 800 వాహనాలు
[ 10-05-2024]
పోలింగ్ బృందాలను ఏయూ ఇంజినీరింగ్ కళాశాల మైదానం నుంచి తరలించేందుకు యంత్రాంగం ఏర్పాట్లు ప్రారంభించింది. ఈనెల 11వ తేదీ సాయంత్రం 6గంటలతో ప్రచార ఘట్టం పరిసమాప్తం కానుంది. -
అసంపూర్తిగా ముగిసిన చర్చలు
[ 10-05-2024]
అదానీ గంగవరం పోర్టు కార్మికులతో యాజమాన్యం జరిపిన మలి దఫా చర్చలు గురువారం అసంపూర్తిగా ముగిశాయని పోర్టు యాజమాన్యం ఒక ప్రకటనలో తెలిపింది. -
ఉప్పెనలా రండి.. ఓటెత్తండి..!
[ 10-05-2024]
పోస్టల్ బ్యాలట్ ఓట్ల కోసం ప్రభుత్వ ఉద్యోగులు పోటెత్తారు. మండే ఎండ మాడ్చేస్తున్నా తగ్గలేదు. గంటల కొద్దీ నిరీక్షించి ఓటు వేశారు. -
జగన్.. ఏంటీ కనికట్టు!!
[ 10-05-2024]
వైకాపా ప్రభుత్వం జగనన్న కాలనీలను శాటిలైట్ సిటీలుగా అభివృద్ధి చేస్తామని గొప్పలు చెప్పింది. క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం అధ్వానంగా ఉంది. ఆ కాలనీల్లో నిర్మించిన ఇళ్లు పిచ్చుక గూళ్లను తలపిస్తున్నాయి. -
ఓటు వివరాలు ముందే తెలుసుకోండిలా!
[ 10-05-2024]
సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడింది. ఈనెల 13న జిల్లాలోని ఒక లోక్సభ, ఏడు అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. -
ఉద్యోగం వచ్చేంత వరకు రూ. 3 వేల నిరుద్యోగ భృతి
[ 10-05-2024]
పెందుర్తి నియోజకవర్గం కూటమి అభ్యర్థి పంచకర్ల రమేశ్బాబుకు సబ్బవరం మండలం ప్రజలు గురువారం బ్రహ్మరథం పట్టారు. నారపాడు, నల్లరేగులపాలెం, బల్జిపాలెం, బాటజంగాలపాలెం, గణపతినగర్, అసకపల్లి, ఎరుకునాయుడుపాలెం, పైడివాడ అగ్రహారం గ్రామాల్లో సుడిగాలి ప్రచారం నిర్వహించారు. -
వైఎస్సార్ బీమా.. ఏదీ ధీమా..
[ 10-05-2024]
కుటుంబ పెద్దను కోల్పోయి పుట్టెడు దుంఖంలో ఉన్న బాధిత కుటుంబాలను ఆదుకోవడంలో వైకాపా ప్రభుత్వంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. -
కేంద్రం సహకారంతో జిల్లా అభివృద్ధి: సీఎం రమేశ్
[ 10-05-2024]
కేంద్రంలో ప్రధానిగా మోదీ, రాష్ట్రంలో సీఎంగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టడం ఖాయమని, వారిద్దరి సహకారంతో జిల్లా అభివృద్ధికి కృషి చేస్తానని కూటమి ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ పేర్కొన్నారు. -
దళితులకు అన్యాయం చేసిన వైకాపాను ఓడించాలి
[ 10-05-2024]
దళితులకు అన్యాయం చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రభుత్వాన్ని రాష్ట్రవ్యాప్తంగా దళితసేన, ప్రజాసంఘాలతో కలసి మే 13న జరిగే ఎన్నికల్లో ఓడిస్తామని రాష్ట్ర మాలమహానాడు అధ్యక్షుడు పాల్తేటి పెంటారావు పేర్కొన్నారు. -
పోస్టల్ బ్యాలెట్ కేంద్రంలో గందరగోళం
[ 10-05-2024]
ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ అందకపోవడంతో తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అనకాపల్లి గవరపాలెం బాలుర ఉన్నత పాఠశాలలోని పోస్టల్ బ్యాలెట్ కేంద్రంలో చివరి రోజు చాలా మంది ఉద్యోగులు భారీగా ఓటు వేయడానికి తరలివచ్చారు. -
మున్సిపల్ ఉన్నతాధికారిపై ఈడీ కేసు నమోదు
[ 10-05-2024]
ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణలపై రాజమహేంద్రవరం నగరపాలక సంస్థలో విధులు నిర్వహించిన ఉన్నతాధికారి, ఆయన కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేసినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) (హైదరాబాద్) ఒక ప్రకటనలో తెలిపింది. -
మాజీ కౌన్సిలర్ దంపతుల ఓట్లు గల్లంతు..
[ 10-05-2024]
జీవీఎంసీ 82వ వార్డు శ్రీరామనగర్ కాలనీలో ఉంటున్న మాజీ కౌన్సిలర్ యర్రంశెట్టి లక్ష్మి పేరు ఓటర్ల జాబితాలో కనిపించలేదు. -
నిర్మాణాలు కుంగదీశావ్.. బతుకులు కూల్చేశావ్!
[ 10-05-2024]
భవన నిర్మాణ రంగం ఉపాధికి పెద్ద దిక్కు. లక్షలాది మంది కార్మికులు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారు. -
స్మార్ట్ బాదుడుకు రంగం ‘సిద్ధం’!
[ 10-05-2024]
‘దేశంలో నాలాగా సంక్షేమ పథకాలు అమలుచేసే ముఖ్యమంత్రి ఎవ్వరూ ఉండరు. బటన్లు నొక్కుతున్నాను.. నే..రుగా నా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి డబ్బులు పడతా ఉన్నాయి.’ -
అసత్యాల సారథి.. ఏదీ వారధి?
[ 10-05-2024]
ఐదేళ్లలో జనం కష్టాలు అన్నీ తీర్చేశామని.. తమ పాలనలో జరిగిందంతా మంచేనని చెబుతున్నారు ముఖ్యమంత్రి జగన్.
తాజా వార్తలు (Latest News)
-
ఎంగేజ్మెంట్ రద్దు.. బాలిక తల నరికిన యువకుడు
-
ఎన్నికల వేళ సుప్రీం తీర్పు ప్రయోజనకరం: కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్పై హర్షం
-
ఫ్రెండ్షిప్ మ్యారేజ్.. ఆ దేశంలో ఇదో కొత్త ట్రెండ్!
-
గూగుల్, యాపిల్కు పోటీగా మైక్రోసాఫ్ట్ గేమింగ్ స్టోర్
-
రోల్ మోడల్ లాంటి ఐపీఎల్లో... ఇదేం అంపైరింగ్!
-
ఖలిస్థానీ నేత అమృత్పాల్ సింగ్ నామినేషన్ దాఖలకు సహకరించాం: పంజాబ్ ప్రభుత్వం