logo

కంటైనర్‌ను ఢీకొన్న కారు.. ఇద్దరు మృతి

బాహ్య వలయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా..నలుగురుకి తీవ్ర గాయాలయ్యాయి.

Published : 01 Feb 2023 05:34 IST

మరో నలుగురికి గాయాలు.. వారిలో ఇద్దరు చిన్నారులు
అవుటర్‌ రింగురోడ్డుపై ప్రమాదం

కారులో ఇరుక్కుపోయిన జైత్రి మృతదేహం

హైదరాబాద్‌, న్యూస్‌టుడే: బాహ్య వలయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా..నలుగురుకి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. రాజేంద్రనగర్‌ ఠాణా ఇన్‌స్పెక్టర్‌ నాగేంద్రబాబు తెలిపిన వివరాల ప్రకారం.. విశాఖపట్నానికి చెందిన వెంకటగణపతి(48), జైత్రి(41), విరాట్‌(11), శ్రియ(9), మరో వ్యక్తి(35), మంగళవారం రాత్రి శంషాబాద్‌లోని విమానాశ్రయంలో దిగి కారులో బాహ్యవలయ రహదారి మీదుగా సోలాపూర్‌ బయలుదేరారు. తెలంగాణ పోలీసు అకాడమీ సమీపంలో ముందు వెళ్తున్న కంటైనర్‌ను వెనుకాల నుంచి వేగంగా ఢీకొట్టారు. ప్రమాదంలో కారు నడుపుతున్న ముస్తఫా షేక్‌(40), జైత్రి(41) ఘటనా ప్రదేశంలోనే తుదిశ్వాస వదిలారు. మిగతా నలుగురుకి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ప్రమాదంలో గాయపడ్డ చిన్నారులు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని