icon icon icon
icon icon icon

Botsa Satyanarayana: జగన్‌ బ్యాండేజీ సంగతి డాక్టర్లు చూసుకుంటారు: మంత్రి బొత్స

విమర్శలు చేసేటప్పుడు ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల సంయమనం పాటించాలని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.

Published : 26 Apr 2024 15:33 IST

విశాఖపట్నం: విమర్శలు చేసేటప్పుడు ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల సంయమనం పాటించాలని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఆమె ఒక పార్టీలో ఉన్నారని, దాని ప్రకారం మాట్లాడుతున్నారన్నారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తమపై ఆధారపడే ప్రభుత్వం కేంద్రంలో రావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ‘‘ఆమె ఇటీవల వరకు సీఎం జగన్‌కు చెల్లి.. ఇప్పుడు ప్రత్యర్థి పార్టీకి నాయకురాలు. ఇక చెల్లి, అన్న.. అనుబంధాలు ఎక్కడ ఉంటాయి?’’ అని బొత్స వ్యాఖ్యానించారు. తలకు పెట్టిన బ్యాండేజీ తీసేయాలంటూ జగన్‌కు.. వివేకా కుమార్తె సునీత ఇచ్చిన సలహాపైనా బొత్స స్పందించారు. బ్యాండేజీ ఉంచాలా.. తీసేయాలా.. అనేది డాక్టర్లు చూసుకుంటారని వ్యాఖ్యానించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img