logo

వివాహిత ఆత్మహత్య

పరవాడ మండలం గొర్లెవానిపాలెం జెఎన్‌ఎన్‌యూఆర్‌ఎం కాలనీలో నివాసముంటున్న వివాహిత ఆత్మహత్య చేసుకుంది. దీనికి సంబంధించి సి.ఐ. ఈశ్వరరావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

Published : 03 Feb 2023 03:28 IST

అనుమానాస్పద మృతిగా కేసు నమోదు

శైలజ (పాతచిత్రం)

పరవాడ, న్యూస్‌టుడే: పరవాడ మండలం గొర్లెవానిపాలెం జెఎన్‌ఎన్‌యూఆర్‌ఎం కాలనీలో నివాసముంటున్న వివాహిత ఆత్మహత్య చేసుకుంది. దీనికి సంబంధించి సి.ఐ. ఈశ్వరరావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పరవాడ మండలం నాయుడుపాలెం పంచాయతీ పరిధి వెంకటపతిపాలెంకు చెందిన శైలజ (24) గొర్లెవానిపానిపాలెం జెఎన్‌ఎన్‌యూఆర్‌ం కాలనీలో భర్త, కుమారునితో కలిసి ఉంటోంది. భర్త బుధవారం రాత్రి మద్యం తాగి రావడంతో దీనిపై గట్టిగా ప్రశ్నించింది. అయితే మానేస్తానని భర్త చెప్పి నిద్రపోయాడు. ఉదయం నిద్రలేచి చూసేసరికి శైలజ ఫ్యానుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడి ఉంది. పోలీసులకు సమాచారం అందించగా.. డీఎస్పీ పి.శ్రీనివాసరావు వివరాలను సేకరించారు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అనుమానాస్పద మృతికింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సి.ఐ. వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని