ఒక్క టికెట్ దొరికితే చాలు
ఈ నెల 19న వన్డే క్రికెట్ మ్యాచ్. అందులోను అభిమానించే క్రికెట్ హీరోలు వస్తున్నారు. వారిని చూసేందుకు ఎలాగైనా స్టేడియానికి వెళ్లాల్సిందే...అందుకు టికెట్ సంపాదించాల్సిందేనని వందలాది మంది అభిమానులు మంగళవారం ఆఫ్లైన్లో.
క్రికెట్ అభిమానుల పడిగాపులు
విశాఖ క్రీడలు, న్యూస్టుడే: ఈ నెల 19న వన్డే క్రికెట్ మ్యాచ్. అందులోను అభిమానించే క్రికెట్ హీరోలు వస్తున్నారు. వారిని చూసేందుకు ఎలాగైనా స్టేడియానికి వెళ్లాల్సిందే...అందుకు టికెట్ సంపాదించాల్సిందేనని వందలాది మంది అభిమానులు మంగళవారం ఆఫ్లైన్లో టికెట్లు విక్రయించే కేంద్రాల వద్దకు చేరుకున్నారు. ఎటుచూసినా అభిమానుల కోలాహలం కనిపించింది. టికెట్ లభిస్తుందో లేదో అనే ఆందోళనతో గంటల కొద్దీ మండు టెండను లెక్కచేయకుండా బారులు తీరారు. పీఎంపాలెం క్రికెట్ స్టేడియం, ఇందిరాప్రియదర్శిని మున్సిపల్ స్టేడియం, గాజువాక వికాస్నగర్ రాజీవ్గాంధీ క్రీడా ప్రాంగణం వద్ద భారీ వరుసలు కనిపించాయి. టికెట్లు చాలా తక్కువ సంఖ్యలో ఉండడంతో సగం మందికి కూడా లభించలేదు. దీంతో కొందరు నిరుత్సాహంతో వెనుదిరిగారు.
పీఎంపాలెం క్రికెట్ స్టేడియం-బి మైదానం వద్ద...
తెల్లవారుజాము 3 గంటలకే..
- గోపాల్, శ్రీను, ప్రవీణ్
మాది శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం తలసిల సముద్రం గ్రామం. సోమవారం అర్ధరాత్రి ఊరి నుంచి బయలుదేరి తెల్లవారుజామున మూడు గంటలకు వచ్చి క్రికెట్ స్టేడియం వద్ద వరసలో నిల్చున్నాం. రూ.600 టికెట్లు దొరికాయి. ఒక్కొక్కరం రెండు చొప్పున ఆరు తీసుకున్నాం. చాలా సంతోషంగా ఉంది. అభిమాన క్రికెటర్లను స్టేడియంలో చూసేందుకు వేచి చూస్తున్నాం.
ఇందిరాప్రియదర్శిని మున్సిపల్ స్టేడియం వద్ద..
భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య ఈనెల 19న జరగనున్న డేఅండ్ నైట్ వన్డే మ్యాచ్కు పీఎంపాలెం ఏసీఏ-వీడీసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. పిచ్ దాదాపు సిద్ధమైంది. గ్యాలరీలను శుభ్రపరచి, కుర్చీలను తుడిచి నెంబర్లు వేశారు. క్రికెటర్ల డ్రెస్సింగ్ రూంలను అధునాతనంగా తీర్చిదిద్దారు. స్టేడియం లోపలికి ప్రవేశించగానే పచ్చని మొక్కలు అభిమానులకు స్వాగతం పలికేలా ఏర్పాట్లు చేశారు. ఫ్లడ్లైట్ల పనితీరును గత రెండు రోజుల నుంచి పరిశీలిస్తున్నారు. స్టేడియం బయట బారికేడ్లు ఏర్పాటు చేసి అభిమానులు మైదానంలోకి రావడానికి వీలుగా సూచికలు ఏర్పాటు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విశాఖ యువతకు.. లక్ష ఉద్యోగాలు
[ 08-05-2024]
‘వైకాపా ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో నిరుద్యోగం పెరిగిపోయింది. యువతకు ఉపాధి లేకుండా పోయింది. కొత్త పరిశ్రమలు రాకపోగా.. ఉన్నవి కూడా మూతపడ్డాయి. డిగ్రీలతో బయటకొస్తున్న యువతకు తగిన ఉద్యోగాలు లేవు. -
జగన్కు పల్లకీ మోత.. గిరిజనులకు డోలీమోత
[ 08-05-2024]
అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం మూలపేట పంచాయతీ కుంబర్ల గ్రామానికి చెందిన కొర్రా రోజా నిండు గర్భిణి. కొద్దినెలల కిందట పురిటినొప్పులతో బాధపడుతున్న ఆమెను స్ట్రెక్చర్పై డౌనూరు ఆరోగ్య కేంద్రానికి వద్దకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. -
నిషేధమన్నావు.. నిషాలో ముంచావు!
[ 08-05-2024]
మాటతప్పను.. మడమ తిప్పను అన్న జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత మద్య నిషేధాన్ని పక్కనపెట్టేశారు. అనకాపల్లి జిల్లాలో 151 మద్యం దుకాణాలను ఏర్పాటుచేసి వాటి ద్వారా ఏటా అమ్మకాలు పెంచుకుంటూ పోయారు. -
అంతు చూసేలా.. అన్యాయం చేసేలా..!!
[ 08-05-2024]
ఉద్యమాలపై పూర్తి నిరంకుశ వైఖరి ప్రదర్శించారు. ఉపాధ్యాయులు, స్టీల్ప్లాంట్, సమగ్రశిక్ష, కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు.. ఇలా అందరినీ అణచివేసేందుకు ప్రయత్నించారు. ‘నా అక్కచెల్లెమ్మలు’ అంటూ ప్రేమ నటించే జగన్.. -
రేవులో తేలిన జగన్ హామీలు..!
[ 08-05-2024]
తూర్పు తీరంలో విశాఖ చేపలరేవు అతి పెద్దది. వేలాది మంది మత్స్యకారులు, బోటు ఆపరేటర్లు దీనిపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వీరికి కష్టాలు మొదలయ్యాయి. -
కూటమిని గెలిపిస్తే నెలకు రూ.4 వేల పింఛను
[ 08-05-2024]
కూటమి అభ్యర్థులను గెలిపిస్తే పింఛను నెలకు రూ. 4 వేలు అందిస్తారని, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని జనసేన పార్టీ ఉత్తరాంధ్రా జిల్లాల ముఖ్యవ్యవహారాల ప్రతినిధి సుందరపు సతీష్కుమార్ అన్నారు. -
మచ్చలేని నాయకుడు నరేంద్రమోదీ: జీవీఎల్
[ 08-05-2024]
సుదీర్ఘ రాజకీయ జీవితంలో నరేంద్రమోదీ మచ్చలేని నాయకుడిగా నిలిచారని భాజపా నేత జీవీఎల్ నరసింహారావు అన్నారు. లాసన్స్బేకాలనీ భాజపా కార్యాలయంలో మంగళవారం సాయంత్రం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. -
గాజువాకలో జగన్ ప్రచార సభ
[ 08-05-2024]
ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం సాయంత్రం గాజువాక కూడలిలో నిర్వహించిన ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి సభ పేలవంగా సాగింది. -
వైకాపాను గద్దె దించేందుకు జనం ఎదురుచూపు
[ 08-05-2024]
మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు స్మారక ప్రాంతాలకు జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చేలా అభివృద్ధి చేస్తానని అనకాపల్లి పార్లమెంట్ భాజపా అభ్యర్థి సీఎం రమేశ్ హామీ ఇచ్చారు. -
అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్
[ 08-05-2024]
జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో వందశాతం వెబ్కాస్టింగ్ నిర్వహిస్తున్నామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రవి పేర్కొన్నారు. కలెక్టరేట్లో మంగళవారం పార్టీల ఏజెంట్లతో సమావేశం నిర్వహించారు. -
కూటమికి స్వతంత్ర అభ్యర్థి శిరీష మద్దతు
[ 08-05-2024]
విశాఖ ఉత్తరం, తూర్పు నియోజకవర్గాల నుంచి గాజుగ్లాసు గుర్తుపై స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న వడ్డి శిరీష కూటమి అభ్యర్థులకు తన మద్దతు ప్రకటించారు. మంగళవారం మధ్యాహ్నం తెదేపా కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. -
ఇలాక్కూడా చెబుతారా?!
[ 08-05-2024]
గాజువాకలో మంగళవారం నిర్వహించిన సిద్ధం సభలో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రసంగం విని జనం అవాక్కయ్యారు. వివిధ అంశాలపై జగన్ చెప్పిన విషయాలకు, వాస్తవాలకు పొంతన లేకపోవడంతో ఇలాక్కూడా చెబుతారా అని ఆశ్చర్యపోయారు. -
‘వైకాపా కార్యాలయంగా ఏయూ’
[ 08-05-2024]
‘ఆంధ్ర విశ్వవిద్యాలయం అధికార పార్టీ వైకాపా కార్యాలయంగా మారిపోయింది. ఉపకులపతి ఆచార్య పి.వి.జి.డి.ప్రసాదరెడ్డి, నిబంధనలకు విరుద్ధంగా నియమితులైన రిజిస్ట్రార్ జేమ్స్ స్టీఫెన్ వర్సిటీని వైకాపా సేవలో తరింపచేస్తున్నారు.