నాకేమీ తెలియదు..!!
బక్కన్నపాలెం ఏపీ విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సహాయ సంస్థ (ఐటీఐ శిక్షణ, ఉత్పత్తి కేంద్రం)లో తుక్కు, వృక్షాల మాయంపై సోమవారం జిల్లా ఉపాధి అధికారి సీహెచ్.
సమాధానాలపై అవాక్కయిన కమిటీ
‘తుక్కు, వృక్షాల మాయం’పై విచారణ
సస్పెన్షన్కు గురైన పీవో విజయ్కుమార్ను విచారిస్తున్న బృందం
కొమ్మాది, న్యూస్టుడే: బక్కన్నపాలెం ఏపీ విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సహాయ సంస్థ (ఐటీఐ శిక్షణ, ఉత్పత్తి కేంద్రం)లో తుక్కు, వృక్షాల మాయంపై సోమవారం జిల్లా ఉపాధి అధికారి సీహెచ్.సుబ్బిరెడ్డి నేతృత్వంలో విచారణ కమిటీ క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టింది. సాయంత్రం 3 గంటలకు విచారణకు హాజరు కావాలని 33 మందికి నోటీసులు జారీ చేయగా అందులో 24 మంది హాజరై కమిటీ ఇచ్చిన ఓ ప్రశ్నావళిని రాత పూర్వకంగా పూర్తి చేసి అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు.
* ఈ కేంద్రంలో దశాబ్దాలుగా నిల్వ ఉన్న తుక్కు విక్రయించి రూ.20 లక్షల వరకు లబ్ధి పొందారని, భారీ వృక్షాలను నరికించేసి ఉన్నతాధికారులకు సమాచారమివ్వకుండా తరలించే ప్రక్రియ చేపట్టారనే ఆరోపణలపై కమిటీ ఈ విచారణ చేపట్టింది. హాజరైన వారు ‘నాకు ఏమి తెలియదు’ అన్న సమాధానమే చెప్పడంతో విచారణ చేపట్టిన జిల్లా ఉపాధి అధికారి సీహెచ్.సుబ్బిరెడ్డి, సబ్ డీఎఫ్వో సీహెచ్.ధర్మరక్షిత్, ప్రస్తుత ఇన్ఛార్జి పీవో జె.మాధవి అవాక్కయ్యారు. అసలు అక్రమాలకు పాల్పడిన వ్యక్తులు ఎవరంటూ ప్రశ్నల వర్షం కురిపించినా అందరి నోటా ఇదే సమాధానం వచ్చింది.
సీసీ ఫుటేజీలు లేకపోవడంతో
ప్రాంగణంలో ప్రతిచోట నిఘా కోసం ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ఫుటేజ్ ప్రతి నెలా 15వ తేదీ నాటికి రద్దయ్యే వ్యవస్థ ఇక్కడ ఉండడంతో ఈ అక్రమాలకు అసలైన ఆధారం లేకుండా పోయింది. దీంతో అందరూ ఒకే సమాధానం చెప్పాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. గతంలో జాయింట్ కలెక్టర్ ఆదేశాల మేరకు ఏడుగురితో ఏర్పడిన కమిటీ ఇక్కడి తుక్కు విక్రయించింది. ఆ కమిటీలో సస్పెన్షన్కు గురైన ప్రాజెక్టు ఆఫీసర్ వి.విజయ్కుమార్, పెయింటర్ శిక్షకుడు పి.వి.రమణ మూర్తి, ప్రిన్సిపల్ ఐ.అబద్దంతో పాటు అదే కమిటీలో సభ్యులుగా ఉన్న ఎం.అర్జున్రాజు, ఎం.వి.రమణ, ఎం.సత్యనారాయణ, ప్రస్తుత ప్రిన్సిపల్ సీహెచ్. భాస్కర్ రావులతో పాటు తుక్కు కొనుగోలు చేసిన కృప ట్రేడర్స్ యజమాని రామస్వామి, వృక్షాలు నరికి తీసుకెళ్లిన టింబర్ డిపో యజమాని సన్యాసిరావును సైతం విచారణ చేపట్టారు. విద్యుత్తు లైన్మెన్, కేంద్రంలో శిక్షణ పొందుతున్న కొంతమంది విద్యార్థులను కూడా విచారించారు.
అసలు బాధ్యులెవరు?
జనవరి 6, 7 తేదీల్లో తుక్కు విక్రయించారు. ఆ కమిటీలో ముగ్గురిపైనే చర్యలు తీసుకోగా.. మిగతా నలుగురిపై చర్యలు లేకపోవడం, సీసీ ఫుటేజీ రద్దు కావడం, ఆ ఏడుగురితో పాటు ఇతర సిబ్బంది తమకేమీ తెలియదని, పొంతన లేని సమాధానాలు చెప్పడంతో మున్ముందు చర్యలు... నిర్ణయాలపై ఉత్కంఠ నెలకొంది. ఈ విచారణలో తుక్కు కొనుగోలుదారు రామస్వామి రూ.2,05,707లకే ఇక్కడి నిల్వ తరలించినట్లు బదులిచ్చారు. ప్రాంగణంలో తుప్పలు మొలిచి అడవిని తలపించడంతో విషసర్పాలు వస్తాయని అప్పటి అధికారుల సూచన మేరకు వాటిని తరలించినట్లు వృక్షాలు నరికించి తీసుకెళ్లిన సన్యాసిరావు సమాధానమిచ్చారు. ఈ నేపథ్యంలో ఇక్కడ భారీ స్థాయిలో తుక్కు తరలించి లబ్ధి పొందిన మొత్తాన్ని తిరిగి రాబట్టేందుకు అధికారులు చర్యలేమైనా చేపడతారా? నివేదికలతో సరిపెడతారా? అనే చర్చ స్థానికంగా నెలకొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ రాజకీయ నియంత
[ 26-04-2024]
జగన్ రాజకీయ నియంత అని సినీనటుడు పృథ్వీరాజ్ అన్నారు. గురువారం అనకాపల్లి జనసేన అభ్యర్థి కొణతాల రామకృష్ణతో కలిసి గాంధీనగరం, అంజయ్య కాలనీల్లో, రాత్రి కొత్తూరులో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
జగన్ ప్యాలెస్కు కోట్లు.. పర్యటకానికి తూట్లు
[ 26-04-2024]
రిషికొండలో జగన్ ప్యాలెస్ నిర్మాణం కోసం పర్యటక శాఖ రూ. వందల కోట్లు కుమ్మరించింది. ఇదే శాఖ రాష్ట్ర పర్యటక రాజధానిగా ఉన్న అరకులోయ, పరిసర ప్రాంతాల కోసం కనీసం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. -
చిరంజీవిని విమర్శిస్తే ఖబడ్దార్.. వైకాపాకు సీఎం రమేశ్ హెచ్చరిక
[ 26-04-2024]
రాజకీయాలకు దూరంగా తటస్థంగా ఉన్న చిరంజీవిని విమర్శిస్తే ఆయన అభిమానులు చూస్తూ ఊరుకోరని అనకాపల్లి పార్లమెంట్ కూటమి అభ్యర్థి సీఎం రమేశ్ వైకాపా నాయకులను హెచ్చరించారు. -
వైకాపా ర్యాలీలో కార్యకర్తల ఘర్షణ
[ 26-04-2024]
తురువోలు సమీపంలో గురువారం సాయంత్రం వైకాపా కార్యకర్తలు నడిరోడ్డుపై ఘర్షణ పడ్డారు. ఒకరినొకరు కొట్టుకోవడంతో రోడ్డున పోయే వారు భయాందోళనకు గురయ్యారు. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
[ 26-04-2024]
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
రాష్ట్రాభివృద్ధే కూటమి ధ్యేయం
[ 26-04-2024]
నర్సీపట్నం తొమ్మిదో వార్డులో మాజీ మంత్రి అయ్యన్న సతీమణి, తెదేపా కౌన్సిలర్ చింతకాయల పద్మావతి, కోడళ్లు సువర్ణ, దివ్య, జనసేన కౌన్సిలర్ అద్దేపల్లి సౌజన్య ఇంటింటి ప్రచారం నిర్వహించారు. -
పేట వైకాపాకు భారీ షాక్
[ 26-04-2024]
వైకాపాకు భారీ షాక్ తగిలింది. పాయకరావుపేట, నక్కపల్లి మండలానికి చెందిన అనేక మంది గురువారం తెదేపాలో చేరారు. ఇప్పటికే పాయకరావుపేట మండలం పాల్తేరు, పాల్మన్పేట తదితర గ్రామాల నుంచి పెద్దఎత్తున వైకాపా నాయకులు, కార్యకర్తలు, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు తెదేపాలో చేరిన విషయం తెల్సిందే. -
ఎంపీకి 25.. అసెంబ్లీకి 148 నామినేషన్లు
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో నామినేషన్ల ఘట్టం గురువారం ముగిసింది. జిల్లాలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలకు మొత్తం 148 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. -
సీఎం నోరు తెరిస్తే అబద్ధాలే!
[ 26-04-2024]
ప్రజలకు అబద్ధాలు చెప్పి మోసగించడంలో జగన్కు మించిన నాయకుడు దేశంలోనే లేరని జనసేన అసెంబ్లీ అభ్యర్థి సుందరపు విజయ్కుమార్ ఆరోపించారు. -
చెప్పింది ఘనం.. చేసింది శూన్యం
[ 26-04-2024]
రాష్ట్రంలో సులువైన పారిశ్రామిక విధానం ఉంది. పరిశ్రమల స్థాపనకు, వ్యాపార ప్రతిపాదనలతో వచ్చేవారికి అనువైన వాతావరణం కల్పించేందుకు కృతనిశ్చయంతో ఉన్నాం. -
ఏడునియోజకవర్గాలకు 147 మంది నామపత్రాల దాఖలు
[ 26-04-2024]
నామపత్రాల స్వీకరణకు చివరి రోజైన గురువారం అసెంబ్లీ నియోజకవర్గాలకు భారీగా నామపత్రాలు దాఖలయ్యాయి. -
ఉక్కులో విద్యుత్తు ఛార్జీల పెంపు తగదు : సిటూ
[ 26-04-2024]
ఉక్కునగరంలో నివాసం ఉండే కార్మికులపై విద్యుత్తు ఛార్జీల భారం పెంచేలా యాజమాన్యం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని సిటూ నాయకులు డిమాండ్ చేశారు. -
ఐదేళ్లూ మాటలే.. జనంతో ఆటలే!!
[ 26-04-2024]
రోడ్లు విస్తరణ, మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టకుండా ముక్కుపిండి నగరవాసుల నుంచి పన్నులు వసూళ్లు చేశారు. జి-20 పుణ్యమా అని వచ్చిన నిధులను సైతం నాణ్యత లేకుండా సుందరీకరణ పనుల పేరుతో ఇష్టారాజ్యంగా ఖర్చు చేశారు. -
పదో తరగతి ఫీజు 30లోగా చెల్లించాలి
[ 26-04-2024]
ఇటీవల విడుదల అయిన పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణులు కాని విద్యార్థులు ఏప్రిల్ 30వ తేదీలోపు ఫీజు చెల్లించుకోవచ్చని డీఈఓ ఎల్.చంద్రకళ తెలిపారు. -
న్యాయ కళాశాల విద్యార్థికి గాయాలు
[ 26-04-2024]
ఆంధ్ర విశ్వవిద్యాలయం డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ న్యాయ కళాశాలలో చదువుతున్న విద్యార్థులు నాలుగో పట్టణ పోలీస్ కానిస్టేబుల్పై నగర పోలీస్ కమిషనర్కు ఫిర్యాదు చేశారు. -
తెలంగాణ ఇంటర్ ఫలితాలలో 983 మార్కులు
[ 26-04-2024]
తెలంగాణ ఇంటర్మీడియట ఫలితాలలో విశాఖకు చెందిన పూజారి సిద్విని 983 మార్కులు(హెచ్జీపీ) సాధించింది. ఆమె తండ్రి పూజారి రఘుప్రసాద్ ద్వారకా బస్స్టేషన్లో ఆర్టీసీ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. -
ప్రధాన దారులు.. నరకానికి నకళ్లు..
[ 26-04-2024]
సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లు అని ప్రచారం చేసుకుంటున్న వైకాపా ప్రభుత్వం ఆ సిద్ధాంతాన్ని క్షేత్ర స్థాయిలో అమలు చేయడంలో ఘోరంగా విఫలమైంది. జగన్ పాలనలో రాష్ట్రంలోని రోడ్లన్నీ అథోగతి పాలయ్యాయన్నది వాస్తవం. -
పారిశ్రామిక ప్రాంతాలు.. నిర్లక్ష్యానికి నిదర్శనాలు
[ 26-04-2024]
వైకాపా ముఖ్యమంత్రి జగన్ పాలనలో పారిశ్రామిక పురోగతి పూర్తిగా చతికిలపడింది. కొత్త పరిశ్రమలు రాకపోగా ఉన్నవి మూతపడే పరిస్థితి నెలకొంది. -
మట్టి తవ్వకందారులకు వైకాపా అండదండలు..
[ 26-04-2024]
చెరువులు, కొండల్లో అక్రమంగా మట్టి తవ్వకాలు జరిపి సొమ్ము చేసుకుంటున్న అక్రమదారులకు వైకాపా ప్రజాప్రతినిధులు పుష్కలంగా అండదండలు అందిస్తున్నారు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
దొడ్డిదారి బదిలీలకు రాచమార్గం
[ 26-04-2024]
‘మా ప్రభుత్వంలో అంతా పారదర్శకమే. ఎక్కడా లంచాలు లేవు.. అవినీతికి తావులేదు. సుపరిపాలన అంటే మాదే’ అని సీఎం జగన్మోహన్రెడ్డి తరచూ గొంతుచించుకుంటూ ఉంటారు. -
బాబు వస్తేనే యువతకు జాబు
[ 26-04-2024]
విశాఖ నగరం అభివృద్ధి చెందాలంటే తెదేపా, జనసేన, భాజపా కూటమి ఎంపీ అభ్యర్థి శ్రీభరత్, ఎమ్మెల్యే అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ను గెలిపించాలని శ్రీభరత్ సతీమణి తేజస్విని కోరారు. -
ఎవరు ఆ ఇద్దరు?
[ 26-04-2024]
ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఇద్దరు వ్యక్తులు అనధికారికంగా ఉద్యోగాలు చేస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది. వీరికి ఏయూ వేతనాలు చెల్లిస్తున్నట్లు చర్చ జరుగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
-
టీఎస్బీపాస్తోనే అనుమతులు.. డీపీఎంఎస్ విధానం పూర్తిగా నిలుపుదల
-
కొండయ్య.. లెక్కే వేరు
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
-
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి
-
‘యూటీఎస్’ పరిధి పెంపు.. ఇక ఎంత దూరం నుంచైనా జనరల్ టికెట్ కొనచ్చు..