logo

గంగవరం పోర్టు రూ.50 లక్షల విరాళం

‘అదానీ గంగవరం పోర్టు లిమిటెడ్‌’ కార్పొరేట్‌ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్‌) కింద రూ.50 లక్షలు విరాళంగా ఇచ్చింది. ఈ మేరకు పోర్టు అధికారులు సోమవారం కలెక్టర్‌ మల్లికార్జునను కలిసి చెక్కు అందజేశారు.

Published : 28 Mar 2023 04:16 IST

జిల్లా కలెక్టర్‌ మల్లికార్జునకు చెక్కు అందజేస్తున్న పోర్టు ప్రతినిధులు

వన్‌టౌన్‌, న్యూస్‌టుడే: ‘అదానీ గంగవరం పోర్టు లిమిటెడ్‌’ కార్పొరేట్‌ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్‌) కింద రూ.50 లక్షలు విరాళంగా ఇచ్చింది. ఈ మేరకు పోర్టు అధికారులు సోమవారం కలెక్టర్‌ మల్లికార్జునను కలిసి చెక్కు అందజేశారు. వైద్య సదుపాయాలు, సామాజిక ఆరోగ్య కార్యక్రమాలకు ఆయా నిధులు ఖర్చు చేయాలని కోరారు. పోర్టు చుట్టుపక్కల గ్రామాల్లో అదానీ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు ప్రతినిధులు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల్లో నైపుణ్యాభివృద్ధికి పలు కార్యక్రమాలు చేపట్టినట్లు వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని