logo

అంతటా తనిఖీలు

జి-20 సన్నాహక సదస్సుల నేపథ్యంలో పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. సదస్సు ప్రాంగణం, విమానాశ్రయం వద్ద, సదస్సుకు హాజరయ్యే ప్రతినిధులు బస చేసిన హోటళ్లలో విస్తృత తనిఖీలు చేపట్టారు.

Published : 29 Mar 2023 03:15 IST

భద్రతా సిబ్బందికి సూచనలిస్తున్న పోలీసు అధికారి

ఎం.వి.పి.కాలనీ, న్యూస్‌టుడే: జి-20 సన్నాహక సదస్సుల నేపథ్యంలో పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. సదస్సు ప్రాంగణం, విమానాశ్రయం వద్ద, సదస్సుకు హాజరయ్యే ప్రతినిధులు బస చేసిన హోటళ్లలో విస్తృత తనిఖీలు చేపట్టారు. విదేశీ ప్రతినిధులు ప్రయాణించే బస్సుల్లో డాగ్‌, బాంబ్‌ స్క్వాడ్‌లతో క్షుణ్ణంగా పరిశీలించారు. వి.ఐ.పి.లు ప్రయాణించే మార్గంలో నిఘాను పెంచారు. ప్రముఖులు నగరంలో ఉండటంతో నిరంతరం నిఘాతో పాటు అన్ని రకాల భద్రతా చర్యలు తీసుకుంటున్నారు.

బస్సు వద్ద తనిఖీ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని