డబ్బులెప్పుడిస్తారు
గోవాడ కర్మాగారంలో గతేడాది డిసెంబరు ఆఖరి వారంలో గానుగాట ప్రారంభించారు. చెరకు సరఫరా చేసిన రైతులకు టన్నుకు రూ. 2,700 పైగా యాజమాన్యం చెల్లించాలి.
చెరకు రైతుల ఎదురుచూపులు
రూ.40 కోట్ల మేర బకాయిలు
చోడవరం, న్యూస్టుడే: గోవాడ కర్మాగారంలో గతేడాది డిసెంబరు ఆఖరి వారంలో గానుగాట ప్రారంభించారు. చెరకు సరఫరా చేసిన రైతులకు టన్నుకు రూ. 2,700 పైగా యాజమాన్యం చెల్లించాలి. ప్రస్తుతం టన్నుకు రూ. 2,500 మాత్రమే చెల్లిస్తూ వస్తున్నారు. బకాయిలు చెల్లించాలంటూ కర్షకులు మొర పెట్టడంతో యాజమాన్యం అరకొర చెల్లింపులు చేస్తూ వచ్చింది. డిసెంబరు 31 వరకు మొత్తానికి బకాయిలు చెల్లించారు. ఇటీవల జనవరి 1 నుంచి 15 వరకు పంట సరఫరా చేసిన కొందరు రైతుల బ్యాంకు ఖాతాలకు నగదు వేశారు. తాజాగా మరికొందరి ఖాతాలకు నగదు వేస్తున్నట్లు సమాచారం. జనవరి ఆఖరు వారంతోపాటు ఫిబ్రవరి, మార్చి నెలల్లో చెరకు సరఫరా చేసిన రైతులకు ఇంతవరకు ఒక్క పైసా చెల్లించలేదు. 2022-23 గానుగాట కాలానికి ఇంకా రూ. 40 కోట్ల మేర యాజమాన్యం చెల్లించాల్సి ఉంది. చెరకు సరఫరా చేసిన 15 రోజుల్లోగా రైతులకు యాజమాన్యాలు చెల్లింపులు చేయాలన్నది నిబంధన. ఇది అమలయ్యేలా చూడాల్సిన బాధ్యత చెరకు అభివృద్ధి మండలి అధికారులది. ఇటు యాజమాన్యానికి పట్టక, అటు చెరకు అభివృద్ధి మండలి పట్టించుకోక రైతుల గోడు అరణ్య రోదనే అవుతోంది.
ఇదంతా మా ఖర్మ
గోవాడ కర్మాగారం రైతుగా చెప్పుకొనేందుకు ఒకప్పుడు గర్వపడేవాళ్లం. 300 టన్నుల వరకు చెరకు సరఫరా చేసేవాడిని. 15 రోజులకోసారి నగదు చెల్లింపులు చేసేటప్పుడు పండగ వాతావరణం కనిపించేది. ఇపుడు చెరకు సరఫరా చేసి ఎదురుచూడటంతోనే కాలం గడిచిపోతోంది. దుస్థితి నుంచి గట్టెక్కించేలా పెద్దలు ఆలోచన చేయకపోవడం రైతుల దురదృష్టకరం. ఈ ప్రాంత రైతుల ఆర్థిక దన్నయిన గోవాడను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. జనవరి తర్వాత సరఫరా చేసిన పంటకు డబ్బులు అందాల్సి ఉంది. చెరకు సాగు బాగా తగ్గించేశాం. పెట్టుబడులు ఎక్కువయ్యాయి. సకాలంలో యాజమాన్యం డబ్బులివ్వడం లేదు. దీంతో విరక్తి వస్తోంది.
గూనూరు సూర్యనారాయణ, చోడవరం
వడ్డీలకే సరిపోతోంది
కర్మాగారానికి చెరకు సరఫరా చేయగా వచ్చే డబ్బులను సంక్రాంతి పండగ, పిల్లల చదువులకు ఖర్చులు చేసేవాళ్లం. నేడు సాగుకు చేసిన అప్పులకు వడ్డీలు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నాం. 25 టన్నుల మేర చెరకు సరఫరా చేశాను. రూ. 45 వేలకు పైగా అందాలి. నేటికీ పడలేదు. జనవరి ముందు సరఫరా చేసిన పంటకు మాత్రమే చెల్లించారు. కూలీల ధరలు పెరగడం, డబ్బులు అదునుకు చేతిలో లేకపోవడంతో ఈ ఏడాది 60 సెంట్లలో మాత్రమే చెరకు వేశాను. చోడవరం, మాడుగుల పెద్దలు ఈ ప్రాంత కల్పతరువును రక్షించే చర్యలు చేపట్టాలి.
నాగులాపల్లి సూర్యనారాయణ, లక్కవరం
దశలవారీగా చెల్లిస్తున్నాం
చెరకు రైతులకు దశలవారీగా టన్నుకు రూ. 2,500 చొప్పున వారి బ్యాంకు ఖాతాలకు జమ చేస్తున్నాం. బయట మార్కెట్లో చక్కెర విక్రయించడం ద్వారా వచ్చిన నగదుతో ఇప్పటివరకు జనవరి 15 వరకు సరఫరా చేసిన రైతులకు నగదు జమ చేశాం. జనవరి 16 నుంచి 31 వరకు సరఫరా చేసినవారి ఖాతాలకు నగదు వేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. విద్యుదుత్పాదన పడిపోవడంతో కాస్త ఆదాయం తగ్గింది. దానికితోడు మార్కెట్లో చక్కెర ధర ఆశాజనకంగా లేదు. వచ్చే గానుగాట కాలం బాగుంటుందని భావిస్తున్నాం. సాగుకు రైతులను సమాయత్తం చేస్తున్నాం.
వి.సన్యాసినాయుడు, ఎండీ, గోవాడ చక్కెర కర్మాగారం
చెరకు సరఫరా చేసి ఆరు నెలలు అవుతోంది. గానుగాట ముగిసి మూడు నెలలు దాటింది. మాకు ఇవ్వాల్సిన నగదు నేటికీ చెల్లించలేదు. నాలుగేళ్లుగా ఇదే పరిస్థితి. దీంతో చెరకు సాగు చేయాలంటేనే విరక్తి కలుగుతోంది. అందుకే సాగు తగ్గించేస్తున్నాం..
గోవాడ చక్కెర కర్మాగారం రైతుల ఆవేదన ఇదీ.
గోవాడ కర్మాగారంలో షేర్లు ఉన్నాయి.. ఏటా 20 టన్నులకు పైగా చెరకును సరఫరా చేస్తాం అంటూ మొన్నటి వరకు ఫ్యాక్టరీ రైతు గొప్పగా చెప్పుకొంటూ మీసం మెలేసేవాడు. నేడు ఆ పరిస్థితులు పోయాయి. చెరకు సాగు తగ్గించేస్తున్నాడు. ఎవరైనా షేర్లు కొంటే... ఇచ్చేస్తామంటూ తిరుగుతున్నారు.
ఈ పరిస్థితికి ప్రధాన కారణం చెరకు రైతులకు కర్మాగారం సకాలంలో చెల్లింపులు చేయకపోవడమే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
[ 26-04-2024]
సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ సంచలన ఆరోపణలు చేశారు. -
జగన్ బ్యాండేజీ సంగతి డాక్టర్లు చూసుకుంటారు: మంత్రి బొత్స
[ 26-04-2024]
విమర్శలు చేసేటప్పుడు ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల సంయమనం పాటించాలని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. -
జగన్ రాజకీయ నియంత
[ 26-04-2024]
జగన్ రాజకీయ నియంత అని సినీనటుడు పృథ్వీరాజ్ అన్నారు. గురువారం అనకాపల్లి జనసేన అభ్యర్థి కొణతాల రామకృష్ణతో కలిసి గాంధీనగరం, అంజయ్య కాలనీల్లో, రాత్రి కొత్తూరులో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
జగన్ ప్యాలెస్కు కోట్లు.. పర్యటకానికి తూట్లు
[ 26-04-2024]
రిషికొండలో జగన్ ప్యాలెస్ నిర్మాణం కోసం పర్యటక శాఖ రూ. వందల కోట్లు కుమ్మరించింది. ఇదే శాఖ రాష్ట్ర పర్యటక రాజధానిగా ఉన్న అరకులోయ, పరిసర ప్రాంతాల కోసం కనీసం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. -
చిరంజీవిని విమర్శిస్తే ఖబడ్దార్.. వైకాపాకు సీఎం రమేశ్ హెచ్చరిక
[ 26-04-2024]
రాజకీయాలకు దూరంగా తటస్థంగా ఉన్న చిరంజీవిని విమర్శిస్తే ఆయన అభిమానులు చూస్తూ ఊరుకోరని అనకాపల్లి పార్లమెంట్ కూటమి అభ్యర్థి సీఎం రమేశ్ వైకాపా నాయకులను హెచ్చరించారు. -
వైకాపా ర్యాలీలో కార్యకర్తల ఘర్షణ
[ 26-04-2024]
తురువోలు సమీపంలో గురువారం సాయంత్రం వైకాపా కార్యకర్తలు నడిరోడ్డుపై ఘర్షణ పడ్డారు. ఒకరినొకరు కొట్టుకోవడంతో రోడ్డున పోయే వారు భయాందోళనకు గురయ్యారు. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
[ 26-04-2024]
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
రాష్ట్రాభివృద్ధే కూటమి ధ్యేయం
[ 26-04-2024]
నర్సీపట్నం తొమ్మిదో వార్డులో మాజీ మంత్రి అయ్యన్న సతీమణి, తెదేపా కౌన్సిలర్ చింతకాయల పద్మావతి, కోడళ్లు సువర్ణ, దివ్య, జనసేన కౌన్సిలర్ అద్దేపల్లి సౌజన్య ఇంటింటి ప్రచారం నిర్వహించారు. -
పేట వైకాపాకు భారీ షాక్
[ 26-04-2024]
వైకాపాకు భారీ షాక్ తగిలింది. పాయకరావుపేట, నక్కపల్లి మండలానికి చెందిన అనేక మంది గురువారం తెదేపాలో చేరారు. ఇప్పటికే పాయకరావుపేట మండలం పాల్తేరు, పాల్మన్పేట తదితర గ్రామాల నుంచి పెద్దఎత్తున వైకాపా నాయకులు, కార్యకర్తలు, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు తెదేపాలో చేరిన విషయం తెల్సిందే. -
ఎంపీకి 25.. అసెంబ్లీకి 148 నామినేషన్లు
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో నామినేషన్ల ఘట్టం గురువారం ముగిసింది. జిల్లాలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలకు మొత్తం 148 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. -
సీఎం నోరు తెరిస్తే అబద్ధాలే!
[ 26-04-2024]
ప్రజలకు అబద్ధాలు చెప్పి మోసగించడంలో జగన్కు మించిన నాయకుడు దేశంలోనే లేరని జనసేన అసెంబ్లీ అభ్యర్థి సుందరపు విజయ్కుమార్ ఆరోపించారు. -
చెప్పింది ఘనం.. చేసింది శూన్యం
[ 26-04-2024]
రాష్ట్రంలో సులువైన పారిశ్రామిక విధానం ఉంది. పరిశ్రమల స్థాపనకు, వ్యాపార ప్రతిపాదనలతో వచ్చేవారికి అనువైన వాతావరణం కల్పించేందుకు కృతనిశ్చయంతో ఉన్నాం. -
ఏడునియోజకవర్గాలకు 147 మంది నామపత్రాల దాఖలు
[ 26-04-2024]
నామపత్రాల స్వీకరణకు చివరి రోజైన గురువారం అసెంబ్లీ నియోజకవర్గాలకు భారీగా నామపత్రాలు దాఖలయ్యాయి. -
ఉక్కులో విద్యుత్తు ఛార్జీల పెంపు తగదు : సిటూ
[ 26-04-2024]
ఉక్కునగరంలో నివాసం ఉండే కార్మికులపై విద్యుత్తు ఛార్జీల భారం పెంచేలా యాజమాన్యం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని సిటూ నాయకులు డిమాండ్ చేశారు. -
ఐదేళ్లూ మాటలే.. జనంతో ఆటలే!!
[ 26-04-2024]
రోడ్లు విస్తరణ, మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టకుండా ముక్కుపిండి నగరవాసుల నుంచి పన్నులు వసూళ్లు చేశారు. జి-20 పుణ్యమా అని వచ్చిన నిధులను సైతం నాణ్యత లేకుండా సుందరీకరణ పనుల పేరుతో ఇష్టారాజ్యంగా ఖర్చు చేశారు. -
పదో తరగతి ఫీజు 30లోగా చెల్లించాలి
[ 26-04-2024]
ఇటీవల విడుదల అయిన పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణులు కాని విద్యార్థులు ఏప్రిల్ 30వ తేదీలోపు ఫీజు చెల్లించుకోవచ్చని డీఈఓ ఎల్.చంద్రకళ తెలిపారు. -
న్యాయ కళాశాల విద్యార్థికి గాయాలు
[ 26-04-2024]
ఆంధ్ర విశ్వవిద్యాలయం డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ న్యాయ కళాశాలలో చదువుతున్న విద్యార్థులు నాలుగో పట్టణ పోలీస్ కానిస్టేబుల్పై నగర పోలీస్ కమిషనర్కు ఫిర్యాదు చేశారు. -
తెలంగాణ ఇంటర్ ఫలితాలలో 983 మార్కులు
[ 26-04-2024]
తెలంగాణ ఇంటర్మీడియట ఫలితాలలో విశాఖకు చెందిన పూజారి సిద్విని 983 మార్కులు(హెచ్జీపీ) సాధించింది. ఆమె తండ్రి పూజారి రఘుప్రసాద్ ద్వారకా బస్స్టేషన్లో ఆర్టీసీ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. -
ప్రధాన దారులు.. నరకానికి నకళ్లు..
[ 26-04-2024]
సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లు అని ప్రచారం చేసుకుంటున్న వైకాపా ప్రభుత్వం ఆ సిద్ధాంతాన్ని క్షేత్ర స్థాయిలో అమలు చేయడంలో ఘోరంగా విఫలమైంది. జగన్ పాలనలో రాష్ట్రంలోని రోడ్లన్నీ అథోగతి పాలయ్యాయన్నది వాస్తవం. -
పారిశ్రామిక ప్రాంతాలు.. నిర్లక్ష్యానికి నిదర్శనాలు
[ 26-04-2024]
వైకాపా ముఖ్యమంత్రి జగన్ పాలనలో పారిశ్రామిక పురోగతి పూర్తిగా చతికిలపడింది. కొత్త పరిశ్రమలు రాకపోగా ఉన్నవి మూతపడే పరిస్థితి నెలకొంది. -
మట్టి తవ్వకందారులకు వైకాపా అండదండలు..
[ 26-04-2024]
చెరువులు, కొండల్లో అక్రమంగా మట్టి తవ్వకాలు జరిపి సొమ్ము చేసుకుంటున్న అక్రమదారులకు వైకాపా ప్రజాప్రతినిధులు పుష్కలంగా అండదండలు అందిస్తున్నారు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
దొడ్డిదారి బదిలీలకు రాచమార్గం
[ 26-04-2024]
‘మా ప్రభుత్వంలో అంతా పారదర్శకమే. ఎక్కడా లంచాలు లేవు.. అవినీతికి తావులేదు. సుపరిపాలన అంటే మాదే’ అని సీఎం జగన్మోహన్రెడ్డి తరచూ గొంతుచించుకుంటూ ఉంటారు. -
బాబు వస్తేనే యువతకు జాబు
[ 26-04-2024]
విశాఖ నగరం అభివృద్ధి చెందాలంటే తెదేపా, జనసేన, భాజపా కూటమి ఎంపీ అభ్యర్థి శ్రీభరత్, ఎమ్మెల్యే అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ను గెలిపించాలని శ్రీభరత్ సతీమణి తేజస్విని కోరారు. -
ఎవరు ఆ ఇద్దరు?
[ 26-04-2024]
ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఇద్దరు వ్యక్తులు అనధికారికంగా ఉద్యోగాలు చేస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది. వీరికి ఏయూ వేతనాలు చెల్లిస్తున్నట్లు చర్చ జరుగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక
-
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్
-
అలెన్ హెర్బల్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం