logo

సింహాద్రి, ఉదయ్‌ ఎక్స్‌ప్రెస్‌ల పునరుద్ధరణ

విజయవాడ డివిజన్‌లో భద్రతా పరమైన ఆధునికీకరణ పనుల కారణంగా రద్దు చేసిన పలు రైళ్లను పునరుద్ధరిస్తున్నట్లు వాల్తేర్‌ సీనియర్‌ డీసీఎం ఎ.కె.త్రిపాఠి తెలిపారు.

Published : 04 Jan 2024 05:05 IST

రత్నాచల్‌ ఎక్స్‌ప్రెస్‌ కోసం వరుసలో  నిల్చున్న ప్రయాణికులు

రైల్వేస్టేషన్‌, న్యూస్‌టుడే: విజయవాడ డివిజన్‌లో భద్రతా పరమైన ఆధునికీకరణ పనుల కారణంగా రద్దు చేసిన పలు రైళ్లను పునరుద్ధరిస్తున్నట్లు వాల్తేర్‌ సీనియర్‌ డీసీఎం ఎ.కె.త్రిపాఠి తెలిపారు. ఈనెల 5 నుంచి 13వ తేదీ వరకు విశాఖ-విజయవాడ- విశాఖ(22701-22702) ఉదయ్‌ ఎక్స్‌ప్రెస్‌, 10 నుంచి 14 వరకు గుంటూరు-విశాఖ(17239), 11 నుంచి 15 వరకు విశాఖ-గుంటూరు(17240) సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను పునరుద్ధరిస్తున్నట్లు ప్రకటించారు. ప్రయాణికులు గమనించి ఈ రైళ్ల సేవలను వినియోగించుకోవాలని కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని