ఏవీ కూరగాయలు.. నిలువెల్లా గాయాలు!
రైతు బజారుకెళ్తే తక్కువ ధరకు కూరగాయలు లభిస్తాయని కొనుగోలుదారుల ఆశ. నగరంలో ఎక్కువ మంది వీటిపైనే ఆధారపడతారు. రైతులకు ఉపాధి దక్కి...కొనుగోలుదారులకు మేలు జరగాల్సిన ఈ రైతుబజార్ల అభివృద్ధిపై వైకాపా ప్రభుత్వం దృష్టిసారించకపోవడం ఎన్నో కష్టాలు తెచ్చి పెడుతోంది.
సీఎం జగన్ మరిచె.. కష్టాలు ముసిరె!!
అధ్వానంగా రైతుబజార్లు
ఈనాడు, విశాఖపట్నం
రైతు బజారుకెళ్తే తక్కువ ధరకు కూరగాయలు లభిస్తాయని కొనుగోలుదారుల ఆశ. నగరంలో ఎక్కువ మంది వీటిపైనే ఆధారపడతారు. రైతులకు ఉపాధి దక్కి...కొనుగోలుదారులకు మేలు జరగాల్సిన ఈ రైతుబజార్ల అభివృద్ధిపై వైకాపా ప్రభుత్వం దృష్టిసారించకపోవడం ఎన్నో కష్టాలు తెచ్చి పెడుతోంది.
జగన్ పాలనలో రైతుబజార్లు తీవ్ర నిర్లక్ష్యానికి గురయ్యాయి. జనం ఏం కోరుకుంటున్నారు...అవసరమైన కూరగాయలు వస్తున్నాయా, రైతులు తెస్తున్నారా? లేకుంటే ఏం చేయాలి అనే ధ్యాసే కరవయింది. ఫలితంగా సమస్యల నడుమే నిర్వహణ సాగుతోంది. పలు చోట్ల విక్రయించే కాయగూరలు నాణ్యతగా ఉండటం లేదు. దీంతో అధిక సంఖ్యలో వినియోగదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అన్ని రకాలు అందుబాటులో లేక వెనుదిరుగుతున్నారు. కొన్ని రకాల ధరలు బయట మార్కెట్తో పోల్చితే రైతుబజార్లలో ఎక్కువగా ఉంటున్నా పర్యవేక్షించే నాథుడు లేడు. అటు రైతులు...ఇటు ప్రజలు కష్టాలు పడుతున్నా పట్టించుకోని ప్రభుత్వ తీరుపై జనం మండిపడుతున్నారు.
ఎంవీపీ బజారు వద్ద చెత్త నిల్వ
సమస్యలు స్వాగతం: ‘అందుబాటు ధరల్లో నాణ్యమైన కాయగూరలు విక్రయించాలి. అటు రైతులకు ఉపాధి కల్పించడంతో పాటు ప్రజల అవసరాలను తీర్చాలి’ అనేది రైతు బజార్ల లక్ష్యం. విశాఖ వంటి నగరంలో వీటి మీదే ఎక్కువమంది ఆధారపడతారు. వారాంతాల్లో రద్దీగా ఉంటాయి. గతంలో నిర్వహణ బాగుండేది. ఇప్పుడు దారుణంగా మారాయి. లోపలికి అడుగుపెడితే సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి.
మరుగుదొడ్డి వద్దే కరివేపాకు
నాణ్యత ఏది?: ప్రస్తుతం బజార్లకు వస్తున్న కాయగూరల్లో నాణ్యత వెతుక్కోవాల్సిందే. ముఖ్యంగా ఉల్లి, బంగాళదుంప, టమాట, క్యారెట్, క్యాబేజి, కాలీఫ్లవర్, చిక్కుడు రకాలు నాసిరకంగా ఉంటున్నాయి. ఉల్లి, టమాటాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంది. కొందరు రైతులను దీనిపై ప్రశ్నిస్తే సరకు అలానే వస్తుందంటున్నారు. పర్యవేక్షించాల్సిన అధికారులు కళ్లుమూసుకోవడంతో వినియోగదారులు వాటినే కొనుగోలు చేయాల్సి వస్తోంది.
పనిచేయని తాగునీటి కుళాయి
నగరంలో రైతుబజార్లు 13
రోజుకు విక్రయించే కూరగాయలు 5 వేల క్వింటాళ్లు
అవస్థలు ఇలా..
- సీతమ్మధార రైతుబజారు అత్యంత ఇరుకుగా ఉంది. స్థలం చాలక మరుగుదొడ్ల వద్దే రైతులు కూరగాయలు విక్రయిస్తున్నారు. పార్కింగ్ సమస్య కూడా నెలకొంది.
- ఎంవీపీ రైతుబజారు విశాలంగా ఉన్నా చాలామంది రైతులు దుకాణాల్లో కాకుండా ఆరుబయటే అమ్ముతున్నారు. గతంలో తాగునీరు, విశ్రాంతికి కేటాయించిన గదులు ఇతర అవసరాలకు వాడుతున్నారు. శీతలగిడ్డంగులు పాడైపోయాయి. నడకదారులు శిథిలమయ్యాయి.
- నరసింహనగర్ బజారులో నాణ్యమైన కాయగూరలు ఎప్పుడూ అందుబాటులో ఉండవని వినియోగదారులు వాపోతున్నారు. ఇక్కడి పరిసరాలు అధ్వానంగా ఉన్నాయి.
- పెందుర్తిలో నిర్వహణకు సరిపడినంత స్థలం లేదు. దీంతో చాలామంది విక్రయాలకు ఇబ్బంది పడుతున్నారు. పార్కింగ్ సమస్య ఉంది.
- పెదవాల్తేరు బజారులో రైతుల పేర్లతో కొందరు బినామీలు స్టాళ్లు నిర్వహిస్తున్నారు. తాగునీరు అందుబాటులో లేదు. పరిసరాలు అపరిశుభ్రంగా ఉంటున్నాయి. విద్యుత్తు దీపాలు వెలగడం లేదు.
- కంచరపాలెంలో 201 మంది రైతులుంటే 114 స్టాళ్లు ఉన్నాయి. మిగిలిన వారంతా నేలపైనే విక్రయిస్తున్నారు. పార్కింగు సమస్య తీవ్రంగా ఉంది.
- మధురవాడలో 84 స్టాళ్లు ఉండగా 100 మంది రైతులున్నారు. కొందరు స్టాళ్ల ముందు డేరాల్లో వ్యాపారాలు సాగిస్తున్నారు. చిన్నపాటి వర్షంపడితే చాలు బురదమయంగా మారిపోతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘కర్కశ జమా’నా!!
[ 30-04-2024]
ఆ వృద్ధులు...కర్రదన్నుగా లేకుంటే నడవలేరు అలా పదడుగులు వేసినా ఆయాసం వచ్చేస్తుంది! చదువురాదు...అక్షరం తెలియదు.. చూపు కనిపించక మరొకరి సాయం తీసుకోవాల్సిందే!! -
పర్యాటక రంగంపై వైకాపా పడగ
[ 30-04-2024]
గమ్య నగరంగా విశాఖకున్న పేరును వైకాపా పాలకులు బంగాళాఖాతంలో కలిపేశారు. జగన్ సర్కారు హయాంలో పర్యాటక రంగం కుదేలైంది. -
అసెంబ్లీ ఎన్నికల బరిలో101 మంది
[ 30-04-2024]
జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల ఎన్నికల బరిలో 101 మంది నిలిచారు. -
ఎర్రమట్టి దిబ్బలకు గండం
[ 30-04-2024]
విశాఖ నగరం, సమీప ప్రాంతాల్లోని భూములపై కన్నేసిన అధికార వైకాపా నేతల కన్ను భీమిలికి సమీపంలోని భౌగోళిక వారసత్వ ప్రదేశం (జియోహెరిటేజ్ సైట్)గా గుర్తించిన ఎర్రమట్టి దిబ్బలపై పడింది. -
ఏజెంట్ల వివరాలు సమర్పించాలి
[ 30-04-2024]
విశాఖ పార్లమెంట్ నియోజకవర్గ స్థానానికి పోటీ చేస్తున్న అభ్యర్థులు ఎన్నికల ఏజెంట్ల వివరాలను మంగళవారం సాయంత్రంలోగా కలెక్టర్ కార్యాలయంలో సమర్పించాలని కలెక్టర్, ఆర్ఓ మల్లికార్జున కోరారు. -
ముస్లింల సమస్యల పరిష్కారానికి కృషి
[ 30-04-2024]
ముస్లిం ఓటర్లు గత ఎన్నికల్లో తనను ఎంతో ప్రోత్సహించారని తెదేపా ఎంపీ అభ్యర్థి శ్రీభరత్ అన్నారు. -
వలసలతో వైకాపా ఖాళీ: అనిత
[ 30-04-2024]
తెదేపాలోకి వలస వస్తున్న వారితో వైకాపా ఖాళీ అవుతోందని కూటమి ‘పేట’ అభ్యర్థి వంగలపూడి అనిత అన్నారు. -
కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ధి
[ 30-04-2024]
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి కొణతాల రామకృష్ణ పేర్కొన్నారు. -
పార్టీ కోసం మెట్టు దిగా: పైలా
[ 30-04-2024]
ఎన్డీఏ కూటమిని అధికారంలోకి తీసుకురావడానికి ఓ మెట్టు దిగాల్సి వచ్చిందని తెదేపా నాయకుడు పైలా ప్రసాదరావు పేర్కొన్నారు. -
బ్యాంకాక్ ఏషియా అందాల పోటీల్లో విశాఖ నివాసి మూడు టైటిల్స్ కైవసం
[ 30-04-2024]
బ్యాంకాక్లో జరిగిన ఏషియా అందాల పోటీల్లో విశాఖ నివాసి డాక్టర్ వై.మమతా చౌదరి మూడు టైటిల్స్ కైవసం చేసుకున్నారు. -
విశాఖ లోక్సభ బరిలో 33 మంది అభ్యర్థులు
[ 30-04-2024]
విశాఖ లోక్సభ ఎన్నికల బరిలో 33 మంది అభ్యర్థులు నిలిచారు. 2019 ఎన్నికల్లో కేవలం 14 మంది పోటీ చేశారు. -
ఖాతాల్లో పడకపోతే ఇళ్లకెళ్లి పింఛన్ల పంపిణీ: కలెక్టర్
[ 30-04-2024]
ఎన్నికల ప్రవర్తనా నియమావళికి లోబడి సామాజిక పింఛన్లను పంపిణీ చేస్తామని జిల్లా కలెక్టర్ ఎ.మల్లికార్జున ఒక ప్రకటనలో తెలిపారు. -
అనకాపల్లి లోక్సభ నుంచి15మంది పోటీ!
[ 30-04-2024]
అనకాపల్లి ఎంపీ స్థానానికి 15 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. -
రైళ్లలో చోరీలకు పాల్పడే ముఠా అరెస్టు
[ 30-04-2024]
రైళ్లలో బంగారు ఆభరణాల చోరీకి పాల్పడుతున్న ముగ్గురు ముఠా సభ్యులను రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. -
మనవడిని కొట్టిందని.. కోడలిని హతమార్చిన మామ
[ 30-04-2024]
కోడలిపై మామ రోకలితో దాడి చేసి హతమార్చిన ఘటన పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం జగన్నాథపురంలో చోటు చేసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (30/04/24)
-
ఆ సినిమా చూశాక వ్యాక్సింగ్ మానేశా: తమన్నా
-
ఏపీ సీఎం జగన్ సతీమణి భారతికి చేదు అనుభవం
-
ప్రేమలో విఫలమైతే అలా చేయొద్దు: పూరి జగన్నాథ్
-
అప్పట్లో.. 4 సెకన్లు ఆలస్యంగా చంద్రయాన్ 3.. ఎందుకంటే!
-
‘బాయ్ఫ్రెండ్ ఓవర్సైజ్డ్ షర్ట్’లో అషు.. కీర్తి సురేశ్ చిల్!