ఉక్కు ఉత్పత్తిపై సమ్మె పోటు
‘అదానీ గంగవరం పోర్టు’లో కార్మికులు చేపట్టిన సమ్మెతో విశాఖ ఉక్కుకు కష్టకాలం ఎదురయింది. పోర్టులో కార్యకలాపాలు పూర్తిగా స్తంభించాయి.
రెండు ఫర్నేస్లు, ఓవెన్లు, నాలుగు రోలింగ్ మిల్స్ నిలిపివేత!
ఈనాడు-విశాఖపట్నం: ‘అదానీ గంగవరం పోర్టు’లో కార్మికులు చేపట్టిన సమ్మెతో విశాఖ ఉక్కుకు కష్టకాలం ఎదురయింది. పోర్టులో కార్యకలాపాలు పూర్తిగా స్తంభించాయి. ఈ నేపథ్యంలో స్టీలు ప్లాంటుకు చెందిన ముడిసరకు బొగ్గు, లైమ్స్టోన్ కొన్ని రోజులుగా పోర్టులోనే ఉండిపోయాయి. ఉన్న ముడిసరకు నిల్వలతో వారం రోజులుగా ప్లాంటును నిర్వహించుకుంటూ వచ్చారు. బుధవారం నాటికి ముడి సరకు కొరత తీవ్రమై కీలకమైన బ్లాస్ట్ ఫర్నేస్(బీఎఫ్)లను మూసి వేసేందుకు నిర్ణయించారు. 16వ తేదీ రాత్రి బ్లాస్ట్ ఫర్నేస్-2లో రూ. కోటి విలువైన బొగ్గును వేసి మూసివేశారు. ఆ తరువాత బీఎఫ్-3తోపాటు, రెండు బ్యాటరీ ఓవెన్స్లో బొగ్గు నింపి ఉంచారు. మిగిలిన మూడు బ్యాటరీల్లోనూ ఉత్పత్తిని సగానికి తగ్గించేశారు. ఫలితంగా కోకోవెన్ గ్యాస్ ఉత్పత్తి కూడా నిలిచి నాలుగు రోలింగ్ మిల్స్ బుధవారం షట్డౌన్ చేశారు.
విశాఖ పోర్టుకు నౌకల మళ్లింపు: స్టీలు ప్లాంటుకు చెందిన 1.50లక్షల టన్నుల బొగ్గు ఆస్ట్రేలియా నుంచి రెండు నౌకల్లో గంగవరం పోర్టుకు మూడు రోజుల క్రితం చేరింది. వీటితోపాటు పోర్టు గోదాంలో 30వేల టన్నులకు పైగా నిల్వలున్నాయి. ఈ బొగ్గు అక్కడి నుంచి బయటకు రాలేదు. దీంతో బొగ్గు నౌకలను గంగవరం నుంచి విశాఖ పోర్టుకు మళ్లించే ప్రయత్నాలు చేస్తున్నారు. దుబాయ్ నుంచి ఇటీవల గంగవరం వచ్చిన లైమ్స్స్టోన్ 60వేల టన్నులు గోదాంలో ఉంది. ఎక్కడికక్కడ ముడిసరకు ఉండిపోయి స్టీలు ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం పడింది. మూడు బ్లాస్ట్ ఫర్నేస్లపై ప్రతి రోజూ సరాసరిన 20వేల టన్నుల హార్డ్ మెటల్ ఉత్పత్తి చేయాలి. కానీ, 16న 9,100 టన్నులు, 17న 4వేల టన్నులే ఉత్పత్తయింది. ఎస్ఎంఎస్ విభాగంలోనూ ఉత్పత్తి తగ్గిపోయింది.
ప్రభుత్వాలు జోక్యం చేసుకోవాలి: విశాఖ స్టీలు ప్లాంటును ఏదొక విధంగా దెబ్బతీసే కుట్రలో భాగంగానే తాజా పరిణామాలున్నాయని విశాఖ ఉక్కు పోరాట కమిటీ కో కన్వీనర్ అయోధ్యరామ్ మండిపడ్డారు. అదానీ పోర్టు కార్మికుల కోరికలు సాధారణమైనవన్నారు. ఆరు నెలల క్రితం ఇచ్చిన హామీ ప్రకారం కనీస వేతనాలు, వైద్య సదుపాయాలపై యాజమాన్యం ఎందుకు స్పందించడం లేదన్నారు. దీనిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకుని సమస్య పరిష్కరించకపోతే, ఆ ప్రభావం విశాఖ ఉక్కుపై పడుతుందన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మనవడిని కొట్టిందని.. కోడలిని హతమార్చిన మామ
[ 30-04-2024]
కోడలిపై మామ రోకలితో దాడి చేసి హతమార్చిన ఘటన పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం జగన్నాథపురంలో చోటు చేసుకుంది. -
రోడ్డు ప్రమాదంలో ట్రాన్సుపోర్టు వ్యాపారి దుర్మరణం
[ 30-04-2024]
రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందినట్లు పీఎంపాలెం సీఐ వై.రామకృష్ణ తెలిపారు. -
‘కర్కశ జమా’నా!!
[ 30-04-2024]
ఆ వృద్ధులు...కర్రదన్నుగా లేకుంటే నడవలేరు అలా పదడుగులు వేసినా ఆయాసం వచ్చేస్తుంది! చదువురాదు...అక్షరం తెలియదు.. చూపు కనిపించక మరొకరి సాయం తీసుకోవాల్సిందే!! -
పర్యాటక రంగంపై వైకాపా పడగ
[ 30-04-2024]
గమ్య నగరంగా విశాఖకున్న పేరును వైకాపా పాలకులు బంగాళాఖాతంలో కలిపేశారు. జగన్ సర్కారు హయాంలో పర్యాటక రంగం కుదేలైంది. -
అసెంబ్లీ ఎన్నికల బరిలో101 మంది
[ 30-04-2024]
జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల ఎన్నికల బరిలో 101 మంది నిలిచారు. -
ఎర్రమట్టి దిబ్బలకు గండం
[ 30-04-2024]
విశాఖ నగరం, సమీప ప్రాంతాల్లోని భూములపై కన్నేసిన అధికార వైకాపా నేతల కన్ను భీమిలికి సమీపంలోని భౌగోళిక వారసత్వ ప్రదేశం (జియోహెరిటేజ్ సైట్)గా గుర్తించిన ఎర్రమట్టి దిబ్బలపై పడింది. -
ఏజెంట్ల వివరాలు సమర్పించాలి
[ 30-04-2024]
విశాఖ పార్లమెంట్ నియోజకవర్గ స్థానానికి పోటీ చేస్తున్న అభ్యర్థులు ఎన్నికల ఏజెంట్ల వివరాలను మంగళవారం సాయంత్రంలోగా కలెక్టర్ కార్యాలయంలో సమర్పించాలని కలెక్టర్, ఆర్ఓ మల్లికార్జున కోరారు. -
ముస్లింల సమస్యల పరిష్కారానికి కృషి
[ 30-04-2024]
ముస్లిం ఓటర్లు గత ఎన్నికల్లో తనను ఎంతో ప్రోత్సహించారని తెదేపా ఎంపీ అభ్యర్థి శ్రీభరత్ అన్నారు. -
వలసలతో వైకాపా ఖాళీ: అనిత
[ 30-04-2024]
తెదేపాలోకి వలస వస్తున్న వారితో వైకాపా ఖాళీ అవుతోందని కూటమి ‘పేట’ అభ్యర్థి వంగలపూడి అనిత అన్నారు. -
కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ధి
[ 30-04-2024]
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి కొణతాల రామకృష్ణ పేర్కొన్నారు. -
పార్టీ కోసం మెట్టు దిగా: పైలా
[ 30-04-2024]
ఎన్డీఏ కూటమిని అధికారంలోకి తీసుకురావడానికి ఓ మెట్టు దిగాల్సి వచ్చిందని తెదేపా నాయకుడు పైలా ప్రసాదరావు పేర్కొన్నారు. -
బ్యాంకాక్ ఏషియా అందాల పోటీల్లో విశాఖ నివాసి మూడు టైటిల్స్ కైవసం
[ 30-04-2024]
బ్యాంకాక్లో జరిగిన ఏషియా అందాల పోటీల్లో విశాఖ నివాసి డాక్టర్ వై.మమతా చౌదరి మూడు టైటిల్స్ కైవసం చేసుకున్నారు. -
విశాఖ లోక్సభ బరిలో 33 మంది అభ్యర్థులు
[ 30-04-2024]
విశాఖ లోక్సభ ఎన్నికల బరిలో 33 మంది అభ్యర్థులు నిలిచారు. 2019 ఎన్నికల్లో కేవలం 14 మంది పోటీ చేశారు. -
ఖాతాల్లో పడకపోతే ఇళ్లకెళ్లి పింఛన్ల పంపిణీ: కలెక్టర్
[ 30-04-2024]
ఎన్నికల ప్రవర్తనా నియమావళికి లోబడి సామాజిక పింఛన్లను పంపిణీ చేస్తామని జిల్లా కలెక్టర్ ఎ.మల్లికార్జున ఒక ప్రకటనలో తెలిపారు. -
అనకాపల్లి లోక్సభ నుంచి15మంది పోటీ!
[ 30-04-2024]
అనకాపల్లి ఎంపీ స్థానానికి 15 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. -
రైళ్లలో చోరీలకు పాల్పడే ముఠా అరెస్టు
[ 30-04-2024]
రైళ్లలో బంగారు ఆభరణాల చోరీకి పాల్పడుతున్న ముగ్గురు ముఠా సభ్యులను రైల్వే పోలీసులు అరెస్టు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
చూసిన 5 నిమిషాలకే పెళ్లి చేసుకోవాలనిపించింది
-
ధరలు పెరిగినా.. బంగారం గిరాకీ తగ్గలే!
-
కేజ్రీవాల్ను కలిసిన పంజాబ్ సీఎం.. ఆయన ఏం చెప్పారంటే?
-
విప్రో కొత్త సీఈఓ వేతనం ఎంతో తెలుసా?
-
కరోనా జన్యు గుట్టువిప్పిన శాస్త్రవేత్తకు చైనా వేధింపులు..!
-
‘ఇప్పటికి నిద్ర లేచారు..’: పతంజలి ఉత్పత్తుల లైసెన్సు రద్దుపై సుప్రీం