logo

‘బడికెళ్లే విద్యార్థికి ఏటా రూ.15 వేలు ఇస్తాం’

తెదేపా కూటమి ప్రభుత్వంలో బడికి వెళ్లే ప్రతి విద్యార్థికి ఏటా రూ.15 వేలు ఇస్తామని విశాఖ పశ్చిమం తెదేపా అభ్యర్థి గణబాబు, విశాఖ తెదేపా ఎంపీ అభ్యర్థి శ్రీభరత్‌ అన్నారు.

Published : 09 May 2024 04:14 IST

కరాస, న్యూస్‌టుడే : తెదేపా కూటమి ప్రభుత్వంలో బడికి వెళ్లే ప్రతి విద్యార్థికి ఏటా రూ.15 వేలు ఇస్తామని విశాఖ పశ్చిమం తెదేపా అభ్యర్థి గణబాబు, విశాఖ తెదేపా ఎంపీ అభ్యర్థి శ్రీభరత్‌ అన్నారు. బుధవారం  56వ వార్డు గవరకంచరపాలెంలో, 57వ వార్డు భవానీగార్డెన్స్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభల్లో వారు మాట్లాడారు. పింఛనుదారులకు ప్రతి నెలా రూ.4 వేలు అందించి, కుటుంబానికి ఏటా మూడు గ్యాస్‌ సిలిండర్లు ఉచితంగా ఇస్తామన్నారు.  ప్రతి ఒక్కరూ సైకిల్‌ గుర్తుపై ఓటేసి తమను గెలిపించాలని కోరారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాగానే అభివృద్ధి, సంక్షేమం పరుగులు పెడుతుందన్నారు. ఆయా కార్యక్రమాల్లో కార్పొరేటర్‌ రాజశేఖర్‌, కూటమి నాయకులు అజయ్‌బాబు, శ్రీరామ్మూర్తి, శ్రీను, సోమేష్‌, ప్రకాష్‌, చిరంజీవి పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని